WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

HEALTH BENEFITS WITH DRINKING MILK WITH INDIAN SPICES - DALCHINA CHAKKA


దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి. 

వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

HEALTH AND BEAUTY BENEFITS WITH ROSEMARY


అందం.. ఆరోగ్యాల రోజ్‌ మేరీ!

రోజ్‌మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్నపొద. వంటల్లో కొత్తిమీరలాగ దీన్ని ఎక్కుగా విదేశీ వంటల్లో వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్‌లు, సూపుల తయారీలోనూ సలాడ్లలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్‌టీ కూడా తయారు చేస్తారు.

రోజ్‌మేరీ శాస్త్రీయనామం రోజ్‌మారినస్‌ అఫిషినాలిస్‌. బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటిసన్నని ఆకులతో, సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగుపూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుకనేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండ పడనిచోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపీట్‌ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో... రోజ్‌మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండినదైనా కూడా వంటల్లో వాడతారు. ఆకు కోసేటప్పుడు గ్రీవంపైన తుంచుకుంటే చిగుళ్లు త్వరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క చాన్నాళ్లపాటు నిలిచి ఉంటుంది. రోజ్‌మేరీలోని రెండు రకాల్లో అఫిషినాలిస్‌ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్‌ కొద్దిగా తీగలాగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్‌ రకం రాక్‌ గార్డెన్లలోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవడానికి కూడా బాగుంటుంది. వంటలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలా ఉంటాయి.

* సేంద్రియ ఎరువులు వాడితే...

రోజ్‌మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికోసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకంపోస్టు, ఆముదం, వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువే. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్లు కూడా ఆశించవచ్చు. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను(మార్కెట్‌లలో దొరుకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.

* ఔషధ గుణాలెన్నో...

రోజ్‌మేరీకి ఔషధగుణాలు ఎక్కువే. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులకు నివారణంగా వాడతారు. ఈ నూనెను తలకు మర్దన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందట. రోజ్‌మేరీని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు(అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీన్ని రూమ్‌ఫ్రెష్‌నర్‌గానూ, పెర్‌ఫ్యూమ్‌ల్లోనూ వాడతారు. జ్ఞాపకానికీ, ప్రేమకూ సంకేతంగా భావిస్తారు కూడా. రోజ్‌మేరీని కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణె, బెంగళూరు వంటి నగరల్లోని నర్సరీల్లో సులువుగా దొరుకుతుంది.

LORD HANUMAN BIRTH STORY IN TELUGU


”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః ”
హనుమత్ప్రభువుల దివ్యచరితామృతము - హనుమద్గాదా తరంగిణి -01
ఆంజనేయ జననం 
”హనుమాన్ కల్ప వ్రుక్షోమే –హనుమాన్ మామ కామధు 
చిన్తామనిస్తూ హనుమాన్ –కో విచారః కుతో భయం .”

ఒక సారి రాక్షస బాధలు భరించ లేక దేవతలంతా బ్రహ్మ దేవుని వెంట పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళారు .అప్పుడ్డు ఆయన వాళ్ళందర్నీ తీసుకొని బదరికా వనం లో వున్న శ్రీ మహా విష్ణు వును దర్శించాడు .రాక్షస బాధలనుంచి రక్షించ మని అందరు వేడుకొన్నారు విష్ణు మూర్తిని ..రాక్షసులు తప్పక నశిస్తారని చెప్పి ,బ్రహ్మ తో సహా అందరి దేవతల తేజస్సును ,తన తేజస్సును కలిపి ముద్దగా చేసి శివునికి ఇచ్చాడు .ఈ తేజస్సు నుంచి బలవంతుడైన వానరుడు పుట్టి ,భయం తీరుస్తాడని అభయం ఇచ్చాడు శ్రీ హరి .
కొంత కాలమ్ తర్వాత పరమేశ్వరుడు ,పార్వతీ దేవి తో కలిసి భూమండలం అంతా పర్యటిస్తూ ,ఆంద్ర దేశం లోని వెంకటాచలం చేరారు .శేష శైలం మీద చిత్ర వనం లో ఆనందం గా విహరిస్తున్నాడు .ఆయనా ,ఆమె కపి రూపం తో విహరించారు .విష్ణువు ఇచ్చిన సకల దేవతా తేజస్సును పార్వతి గర్భం లో నిక్షిప్తం చేశాడు .ఆమె దాన్ని భరించ లేక అగ్ని దేవునికిచ్చింది .ఆయనుకు శక్తి చాలక వాయుదేవునికి అందించాడు .
పూర్వం రాదంతర కల్పం లో కశ్యపుడు అనే వెద వేదాంగ పారీనుడైన బ్రాహ్మణోత్తముడు వుండే వాడు .ఆయన శివుని గురించి పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశాడు .శివుడు మెచ్చి ప్రత్యక్ష మయాడు .కోరిక ఏమిటో చెప్పమన్నాడు .”శివా !నువ్వు నాకు పుత్రుని గా జన్మించాలి ”అని ఆ బ్రాహ్మణుడు కోరాడు .”తధాస్తు ”అన్నాడు పరమేశ్వరుడు .అక్కడే వున్న అగ్ని ,వాయువుదేవులు కూడా తమకు కూడా శివుడు పుత్రుని గా జన్మించాలి అని కోరారు .అలాగే అన్నాడు .ఆ కశ్యపుడే కేసరి అనే వానర శ్రేష్టునిగా జన్మించాడు .ఆయన భార్య మహాసాద్వి అయిన సాధ్య ఈమె గౌతమ మహర్షి భార్య అహల్యకు అంజనా దేవిగా జన్మించింది .ఆమె దేవతల అభీష్టం మేరకు కేసరికి ధర్మ పత్ని అయింది .కేసరి అరవై వేలమంది వానరులకు నాయకుడు .
ఆకాలం లో ”శంక సాధనుడు ”అనే రాక్షసుడు ,దేవ వానర రుషి గణాలను చిత్ర హింసలు పెట్టె వాడు .వారంతా బ్రహ్మ దగ్గర మొర పెట్టుకొన్నారు .ఆయన కేసరి కి మాత్రమే అతన్ని చంపే శక్తి వుందని ,ఆయన్ను శరణు కోరమని హితవు చెప్పాడు ఆయన దగ్గరకు వెళ్లి రక్షించ మన్నారు .అభయం ఇచ్చాడు కేసరి .శంకసాధనునికి తెలిసి ఆయనపై యుద్ధానికి దిగాడు .అతన్ని సంహరించి వారందరినీకాపాడాడు కేసరి .కేసరి ఆంటే సింహం అని అర్ధం కదా డాని బలం ముందు ఏదీ ఆగలేదు

ఆకాలం లోనే వానర వీరులలో కున్జరుడు అనే గొప్ప వాడుండే వాడు. భార్య వింధ్యావళి సంతానం కలగలేదు .శివుని ధ్యానించాడు ,ఆయన కనిపించి సంతాన యోగం లేదనీ ,కొద్ది కాల౦ లో ఒక ఋషి పుత్రిక లభ్యం అవుతుందని ,ఆమెనే బిడ్డ గా పెంచుకొంటే ఆమె వల్ల సంతానం వృద్ధి చెందు తుందని హితవు చెప్పాడు .ఆ రోజు కోసం దంపతులు ఎదురు చూస్తున్నారు
గౌతమ మహర్షికి అహల్య వల్ల అంజనా దేవి అనే కుమార్తె పుట్టిందని చెప్పుకున్నాం వారికే శతానందుడు అనే కుమారుడు కూడా జన్మించాడు .అహల్యా శాపం సంగతి మనకు తెలిసిన కధే .ఆమె శిలగా మారింది .పిల్లల ఆలనా ,పాలనా చూసే వారు లేక పోయారు .నారదుని సలహాతో గౌతముడు శాతానండున్ని జనక మహా రాజు దగ్గరకు పంపాడు .ఆయన తర్వాత జనక ఆస్థానపురోహితుడు అయ్యాడు .అలాగే నారదుని మాట విని కున్జరునికి అంజనా దేవిని పెంచుకోవటానికి ఇచ్చాడు. ఆమె కున్జరుని పెంపుడు కూతురు అయిందన్న మాట .యుక్త వయస్సు వచ్చిందామెకు .తగిన వరుడి కోసం వెతుకు తున్నాడు ..శంబ సాధనుడి నుంచి తమల్ని రక్షించిన కేసరికి మేలు చేయాలని దేవతలు భావించారు .కేసరికి అన్జకు అంతా కలిసి వైభవం గా వివాహం చేశారు .
వారిద్దరికీ చాలా కాలం సంతానం కలగలేదు .కేసరి వంటి మహా వీరుణ్ణి కుమారునిగా పొందాలని అంజనా దేవి భావించింది .తాను వీర మాత అనిపించు కోవాలని ఆరాట పడింది .దైవానుకూలం కావాలని కేసరి ,అంజన తెలుసు కున్నారు భర్త అనుమతితో మన తిరుపతి దగ్గర వున్న వృషభాద్రి చేరింది .ఆకాశ గంగలో స్నానం చేస్తూ ,ఇంద్రియ నిగ్రహం తో తపస్సు ప్రారంభించింది. ఆమె యందు అనుగ్రహం తో వాయుదేవుడు రోజు ఒక ఫలాన్ని ఆమెకు అర్పించేవాడు .ఒక రోజు ,పార్వతి ,అగ్ని దేవుల ద్వారా తనలో చేరిన శివ తేజస్సును ఫల రూపం లో ఆమె ఒడిలో వేశాడు .ఆమె దాన్ని భక్తితో భుజించింది .ఆమె గర్భం ధరించింది .ధ్యానం మాన లేదు .ఒక రోజు ఆకాశవాణి “అంజన ! నీకు వ్రతభంగంలేదు దుఖిన్చవద్దు .భగవంతుని దయ వల్ల నీకు గొప్ప వ్యక్తీ జన్మిస్తాడు” .ఇది దేవతల అనుగ్రహం .నీ పాతివ్రత్యానికి భంగము వుండదు . కాల౦ గడిచింది వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడు శనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనేయుడు జన్మించాడు .బంగారు రంగు ,పింగళ వర్ణం గల నేత్రాలు ,స్వర్ణ హారం ,బంగారు యజ్ఞోపవీతం ,మణుల నూపురాలతో ,ధ్వజము ,వజ్రాయుధం ,అంకుశం ,గొడుగు ,పద్మం ,అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్న వాడు ,పొడవైన తోక గల వాడు ,వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద దవడలు కలవాడు ,కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు .
దేవతలు పుష్ప వర్షం కురిపించారు .అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు .వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు ,అనిల సుతుడు యాడు .అగ్ని తేజం కూడా వుండటం తో అగ్ని సంభవుడని శివ పార్వతుల తేజస్సు కల్గివుండటం తో పార్వతీ నందనుడనీ శంకర సుతుడని పిలువ బడు తున్నాడు .సకల దేవతల తేజస్సు తో జన్మించినందున సర్వ దేవాత్మకుడు అన్నారు .
”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః ”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .


KRISHNA PUSHKARALU 2016 - DHANALU


పుష్కరాలలొ వ స్త్ర దానం నిమ్మిత్తం కొందరు ,అన్న ప్రసాద వినియోగం నిమ్మిత్తం కొందరు పుస్తకాలు పంచమని కొందరు ధనసహాయం చేసారు .
పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.
మొదటి రోజు;- సువర్ణ దానం,రజితము దానం,ధాన్య దానం ,భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం,లవణ దానం,రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ(బెల్లం),అశ్వశాఖ,ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం ,శకట దానం,వృషభదానం,హలం దానం చేయాలి.
ఆరవవ రోజు;-ఔషధదానం,కర్పూరదానం,చందనదానం,కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;-గృహదానం,పీట దానం,శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు;-చందనం,కందమూలాల దానం,పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం,దాసి దానం,కన్యాదానం,కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం,సాలగ్రామ దానం,పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.



YOGA SADHANA - YOGA HEALTH BENEFITS


యోగసాధన
భారతీయ షట్ దర్శనాల్లో యోగ ఒకటి. “యోగ: చిత్తవృత్తి నిరోధ:” అని అన్నారు మహర్షి పతంజలి. అనగా చంచలమైన మనో నడవడికలను, ఆలోచనలను నిరోధించి ఏకాగ్రతను సాధించేదే యోగము.
ఆధ్యాత్మికుల మాటల్లో చెప్పాలంటే ఇది ఆత్మ – పరమాత్మల సంయోగానికి మార్గం. యుజ్ అనే సంస్కృత పదానికి సమ్యోగం అని అర్ధం. ఈ యుజ్ నుంచి యోగ వచ్చింది. బయతి ప్రప్రంచంలోని అసత్య రూపాలతోను, ఆకర్షణలతోను మునిగి ఉన్న అహం కారపూరిత మనస్తత్వం కలిగి ఉన్న మానవ జీవాత్మను సర్వోపగతమైన పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగల స్థితికి చేర్చు ప్రయత్నమే యోగాభ్యాసం.
యోగ శాస్త్రాన్ని క్రీస్తుపూర్వం రెండు శతాబ్దాల నాడు మహర్షి పతంజలి క్రమబద్ధం చేసి గ్రంథస్థం చేశారు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచే యోగ భిన్న పద్ధతులలో ఉండవచ్చన్నది చరిత్ర కారుల అభిప్రాయం.
సాంఖ్య దర్శనానికి యోగ కొనసాగింపు.
యోగలో మొత్తం ఎనిమిది దశలున్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాథి.ఈ ఆఖరి స్థితొలోనే ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చన్నది దార్శనికుల విశ్వాసం.
1. యమ అనగా పది ధర్మములను అబ్య్హసించటం. అవి అహింస, సత్యం, దొంగతనం చేయకుండుత, బ్రహ్మచర్యం, దయ, నీతి, క్షమ, పట్టుదల, మితాహారము తీసుకొనుట మరియు శుభ్రము.
2. నియమమనగా 8 ధర్మములను అబ్యసించటం. అవి త్రుప్తి, వేదములను నమ్మటం, దానము, దైవపూజ, వేదములను పఠించటం, అణకువ, మనియు జపము.
3. ఆసన: అయిదు ముఖ్యమైన కూర్చుండు విధములను పాటించటం. అవి ఏమనగా పద్మాసన, స్వస్తికాసన,భద్రాసన, వజ్రాసన మరియు విరాసన.
4. ప్రాణామాయం అంటే గాలిని లోనికి పీల్చి, కొంత సేపు అట్లాగే ఉంచి తరువాత వదలి వేయుట. గాలిని ముక్కు యొక్క ఎడమ రంధ్రంతో 16 మాత్రల కాలము పీల్థి, 64 మాతల కాలం లోపల ఉంచి తరువాత ముక్కు యొక్క కుడి రంధమునిండి 32 మాత్రల కాలము వదలి పెట్టాలి. ఈ ప్రాణాయామం వీలయినన్నిసార్లు ఎక్కువ కాలం అభసించాలి. ఈ ప్రణాయామ అభాసంలో శరీర మునకు మిక్కిలి చెమట పడితే అది సామాన్య ప్రాణామాయం. శరీరము కుదిపినట్లయిన మధరకమైనది. శరీరము నేలనుండి పైకి లేచిన అది సర్వోత్కృష్టమైనది.
5. ప్రత్యాహారము: జ్ఞానేంద్రియములను రూప రసగంధాది విషయాలనుండి బలవంతంగా విముఖంగానుండునట్లు అంతర్ముఖం చేయటం.
6. ధారణ: భగవంతుని తప్ప మైయొకటి ఎరుగని స్థితిలో ఉండటం.
7. ధ్యానం: ఇష్ట దైవాన్ని ఏకాగ్రతతో ప్రార్థించటం.
8. సమాధి: ఈ స్థితిలో ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చునని దార్శనికుల విశ్వాసం.
ఆధునిక కాలంలో దాదాపు వందేళ్ళుగా ఇటు భారతదేశంలోను, అటు పశ్చిమదేశాల్లోను విస్తృతంగా ఆచరిస్తున్న యోగకు మాత్రం శారీరక, మానసిక ప్రశాంతతే లక్ష్యం అష్టాంగయోగలోని మూడు, నాలుగు దశలు ఆసన (శారీరక వ్యయామం) ప్రాణాయమ (ఉచ్చ్వాస, నిశ్వాసాల నియంత్రణ)ను ప్రప్రంచంవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆచరిస్తున్నారు. శారీరక ఆరోగ్యానికి, శారీరక, దార్ద్యానికి తిరుగులేని మార్గంగా నమ్ముతున్నరు.

HEALTH BENEFITS WITH NERUDUKAYALU


నీరసం తగ్గించే నేరేడు పండ్లు

నేరేడుపండ్లు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. నిగనిగలాడుతూ..నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...!

1. నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి.

2. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇందులోని పోషకాలు గ్లైసమిక్‌ ఇండెక్స్‌ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధీ జరుగుతుంది.

3. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంతŒ తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.

4. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
5. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

6. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

7. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.

TIPS TO REDUCE HEAVY STOMACH - REDUCE OVER WEIGHT STOMACH WITH YOGA


పొట్ట తగ్గించుకుందాం!

పొట్ట ముందుకొచ్చి, జారినట్టుగా కాకుండా.. పల్చగా ఉంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే అందమైన పొట్టకావాలంటే ఆహారనియమాలు పాటించడం ఎంత అవసరమో చక్కని వ్యాయామం కూడా అంతే అవసరం. ఈ రెండూ కలిసినప్పుడే మీరు కోరుకున్న విధంగా ఆకృతి సాధ్యమవుతుంది.

* చాలామంది బరువు తగ్గాలనే తాపత్రయంలో మరీ తక్కువ ఆహారం తింటారు. కానీ 1200 కెలొరీల కంటే తక్కువ శక్తి అందితే కనుక... కొవ్వుని కరిగించే లెప్టిన్‌ అనే హార్మోను విడుదల తగ్గుతుంది. ఆ హార్మోను అసమతుల్యత వల్ల కొవ్వు పెరుగుతుంది. దాంతో బరువు పెరుగుతారు. కాబట్టి తగినంత ఆహారం తీసుకోవాలి.

* ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంతగా పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్‌ అనే హార్మోను విడుదల అయి అది పొట్టు చుట్టూ కొవ్వు చేరడానికి కారణమవుతుంది. అందుకే రోజులో కనీసం పదినిమిషాలయినా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడి తగ్గుతుంది.

* పీచు ఎక్కువగా ఉండే ఓట్‌మీల్‌తో మీ ఉదయాన్ని ప్రారంభించండి. ఓట్స్‌ ఒక్కటీ తినలేం అనుకుంటే దాంతో కాస్త గరంమసాలా పొడిని కలుపుకోవచ్చు. లేదంటే ఏదైనా పండ్ల మేళవింపుతో కూడా తినొచ్చు. అప్పుడు పీచుతోపాటూ వ్యాధి నిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

* ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలని అదుపులో ఉంచడం, చీజ్‌, ఐస్‌క్రీం, పాలూ, క్యాలీఫ్లవర్‌ వంటి వాటిని కాస్త తగ్గించి తీసుకుంటే మంచిది. అలాగే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే బాదం, ఆలివ్‌నూనె వంటివి చేర్చుకోవడం వల్ల పొట్టదగ్గర ఉండే కొవ్వు అదుపులో ఉంటుంది. చేపలూ, టోఫూ వంటి వాటిల్లో పొట్ట దగ్గర కొవ్వుని అదుపులో ఉంచే లీన్‌ ప్రొటీన్‌ ఉంటుంది. తరచుగా ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిది.

* యోగాతో పాటూ పొట్టా, నడుమూ, కాళ్లలో కదలికలు పెంచే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు శక్తిని పుంజుకుంటాయి. పొట్ట ఆకృతి కూడా తీరువుగా మారుతుంది.

SEVEN IMPORTANT DIABETES HEALTH TIPS


మధుమేహులకు సప్త సూత్రాలు

మీరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారా...అయితే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు సప్తసూత్రాలు పాటించాలంటున్నారు వైద్యనిపుణులు. మీరు మధుమేహంతో బాధపడుతున్నా వైద్యనిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.వైద్యనిపుణులతో సమయానుకూలంగా కలుస్తూ వారి సూచనలు పాటించాలి. డయాబెటీస్ ను అదుపులో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వైద్యుల సలహాతో మధుమేహాన్ని నిరంతరం నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ వ్యాధి వల్ల కలిగే అనర్ధాలపై పరీక్షలు చేయించుకోవాలి. వైద్యనిపుణుల సలహాతో దీర్ఘకాలిక వైద్యం తీసుకోవాలి. మధుమేహంతోపాటు ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించాలి. ఈ సప్త సూత్రాలు పాటించకుంటే మధుమేహ వ్యాధి పీడితులు అనర్ధాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. 

DONT SHOUT - JOB GONE - JOKES

ఊడి పోతుందిరా...ఉద్యోగం గట్టిగ అరవకు...
.
ఒక నిరుద్యోగికి జూలో ఉద్యోగం వచ్చింది. వారు అతన్ని గొరిల్లా లాగా డ్రెస్ వేసుకుని 
గొరిల్లాలా నటిస్తూ ప్రజలను ఆకర్షించమని చెప్పారు. దీంతో అతను గొరిల్లా వేషం వేసుకుని వచ్చాడు.

మొదటిరోజు అతను ఎన్నో విన్యాసాలు చేశాడు. ప్రజలంతా అతన్నిచూసి కేరింతలు కొట్టారు. 

రెచ్చిపోయిన అతడు ఒకవైపు వేలాడుతూ పట్టుదప్పి సింహమున్న బోనులో పడ్డాడు. సింహాన్ని చూసి భయపడిపోయి అతడు రక్షించండి! రక్షించండి అని బిగ్గరగా అరవసాగాడు.

అప్పుడు సింహం మెల్లగా అతని వద్దకు వచ్చి బుద్ధిలేనోడా! నీవు గొరిల్లా వేషంలో వున్నావు. అరవడం ఆపు, జనం గుర్తుపట్టారంటే మనిద్దరి ఉద్యోగాలు ఊడిపోతాయి.

MASALA FRIED FISH RECIPE


మసాలా ఫ్రైడ్ ఫిష్

కావలసిన పదార్థాలు:

చేప : 1
ఉల్లిపాయ : 1
అల్లంవెల్లుల్లి ముద్ద : 1tbsp
ఎండుకొబ్బరి: అర చెక్క,
గసాలు: 1tsp
ధనియాల పొడి : 2tsp
జీలకర్ర పొడి: 1tsp
గరంమసాలా: 2tsp
కారం: 2tsp
పసుపు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
నూనె : కావలసినంత

తయారుచేయు విధానం:

1. చేపని శుభ్రంగా కడిగి పొలుసు తీసేయాలి. చేప పొట్ట భాగంలో కోసి లోపలిభాగం కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చేపకి రెండు వైపులా కత్తితో గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

2. మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద , ఎండుకొబ్బరి ముక్కలు, గసాలు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. తర్వాత రుబ్బుకొన్న పేస్ట్ లో చేపని వేసి రెండు వైపులా మసాలా పట్టేలా చేయాలి. ఓ పావుగంట సేపు నానాక స్టౌ మీద మందపాటి గిన్నెలేదా పాన్ పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక చేపని అందులో వేసి రెండు వైపులా ఎర్రగా వేగించాలి. అంతే ఫ్రైడ్ ఫిష్ రెడీ.

HEALTH BENEFITS WITH TAKING SWEET CORN REGULARLY


 పోషకాలు నిండుగా

ఉడికించి కొద్దిగా ఉప్పూ, కారం, మిరియాలపొడి చల్లిన స్వీట్‌కార్న్ ‌ని చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు ఈ వానాకాలంలో. దాన్నితరచూ తీసుకోవడం వల్ల ఒనగూడే ప్రయోజనాలేంటో చూద్దామా.

* ఇందులో కెలొరీలు తక్కువ. సుమారు వందగ్రాముల స్వీట్‌కార్న్‌ తీసుకుంటే 86 కెలోరీలు అందుతాయి. ఈ గింజల్లో ఆహారసంబంధిత పీచూ, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లోని ఫెరులిక్‌ ఆమ్లం కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాదు, వార్థక్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.

* స్వీట్‌కార్న్ ‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది తియ్యగా ఉంటుంది కాబట్టి.. తీపిశాతం ఎక్కువేమో అనే అపోహ వద్దు. కానీ ఒక యాపిల్‌తో పోలిస్తే.. ఇందులో ఉండే తీపి శాతం తక్కువే. కాబట్టి మోతాదు మించకుండా వీటిని నిత్యం తీసుకోవచ్చు.

* స్వీట్‌కార్న్‌ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం ఇందులో ఉండే పీచే. అలాగే మేలు చేసే బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుంది. పైగా ఇది గ్లూటెన్‌ రహిత పదార్థం కూడా.

* స్వీట్‌కార్న్ ‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్‌ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని థయామిన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

* వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటూ మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్‌ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జియాగ్జాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్‌ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

CHILLI EGG IDLI RECIPE


చిల్లీ ఎగ్‌ ఇడ్లీ

* కావలసినవి:
చిట్టి ఇడ్లీలు: 15(లేదంటే 8 పెద్ద ఇడ్లీలు), ఉడికించిన గుడ్లు: 2, ఉల్లిపాయ: ఒకటి, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లిరెబ్బలు: 3, పచ్చిమిర్చి: 2, కరివేపాకు: రెబ్బ, క్యాప్సికమ్‌: ఒకటి, చిల్లీసాస్‌: టేబుల్‌స్పూను, షెజువాన్‌ సాస్‌: టేబుల్‌స్పూను, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, ఉల్లికాడల తురుము: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడా

* తయారుచేసే విధానం:
ఇడ్లీలను కావలసిన సైజులో ముక్కలుగా చేయాలి. చిట్టి ఇడ్లీలను కూడా రెండు ముక్కలుగా చేయాలి. ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొనను తీసేసి తెల్లసొనను మాత్రం చిన్నముక్కలుగా కోయాలి.బాణలిలో నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లిముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చితురుము వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేగాక క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు కూడా వేసి వేయించాలి. అవి వేగాక చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌, షెజువాన్‌ సాస్‌ వేసి కలపాలి. తరవాత ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలపాలి.చివరగా తెల్లసొనముక్కలు వేసి, ఉల్లికాడల తురుము, కొత్తిమీర తురుము వేసి అందించాలి.

THAI BAJJI RECIPE


థాయ్‌ బజ్జీ

* కావలసినవి 

దోరగా పండిన అరటిపండ్లు: నాలుగు, బియ్యప్పిండి: కప్పు, 
మైదాపిండి: కప్పు, పంచదార: అరకప్పు, కొబ్బరితురుము: అరకప్పు,
ఉప్పు: రుచికి కొద్దిగా, బేకింగ్‌సోడా: టీస్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను,
నూనె: వేయించడానికి సరిపడా

- తయారుచేసే విధానం

* అరటిపండ్లు తొక్క తీసి కాస్త మందంగా పొడవాటి స్లైసులుగా కోయాలి.

* బేకింగ్‌సోడాలో ముప్పావుకప్పు నీళ్లు పోసి కలపాలి.

* వెడల్పాటి గిన్నెలో మైదా, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార, కొబ్బరితురుము, నువ్వులు వేసి కలపాలి. తరవాత బేకింగ్‌సోడా కలిపిన నీళ్లు పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి.

* బాణలిలో నూనెపోసి బాగా కాగాక అరటిపండు స్లైసుల్ని పిండిలో ముంచి తీసి నూనెలో వేసి వేయించాలి. రెండుమూడు చొప్పున అన్నీ వేయించుకుని తీసి బ్లాటింగ్‌పేపర్‌తో అద్ది అందించాలి.

NAATU KODI PALAV RECIPE


నాటు కోడి పలావ్‌

* కావలసినవి 
బాస్మతిబియ్యం: అరకిలో, నాటుకోడిమాంసం: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఆరు, అల్లంవెల్లుల్లి: 4 టీస్పూన్లు, కారం: 4 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పుదీనా: 2 కట్టలు, కొత్తిమీర: కట్ట, టొమాటో: రెండు, పసుపు: అరటీస్పూను, అనాసపువ్వు: చిన్నముక్క, జాజికాయ పొడి: పావు టీస్పూను, జాపత్రి: ఒకటి, కొబ్బరి పాలు: అరలీటరు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు

* తయారుచేసే విధానం
కోడి మాంసాన్ని కడిగి, ఉప్పు, కారం, సగం అల్లంవెల్లుల్లి కలిపి నానబెట్టాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ముద్దగా చేయాలి. ఓ గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయల్ని వేయించాలి. పచ్చిమిర్చి, మిగిలిన అల్లంవెల్లుల్లి, గరంమసాలాపొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుముద్ద వేసి బాగా వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన మాంసం వేసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ఉడికాక టొమాటో ముక్కలు, కొబ్బరిపాలు వేసి మూతపెట్టి ఓ రెండు నిమిషాలు మరిగించాలి. ఉప్పు సరిచూడాలి. ఇప్పుడు బాగా నానిన బియ్యం వేసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. దించేముందు అనాసపువ్వు, జాజికాయపొడి, నెయ్యి వేసి కలిపి వడ్డించాలి.

BEERAKAYA GARELU RECIPE


బీరకాయ గారెలు

* కావలసినవి:
బీరకాయలు: పావుకిలో, మినప్పప్పు: 200గ్రా., పండుమిర్చి:నాలుగు, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: రెబ్బ, అల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,జీలకర్ర: టీస్పూను, నూనె: తగినంత

* తయారుచేసే విధానం:
మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి.బీరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. వీటికి అల్లంతురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర చేర్చి మిక్సీలో రుబ్బాలి. తరవాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

MAZZIGA IDLI - IDLI WITH BUTTERMILK RECIPE


మజ్జిగ ఇడ్లీ

* కావలసినవి: 
బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు, మజ్జిగ: 4 కప్పులు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా, మినపప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఆవాలు: టీస్పూను, తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), కరివేపాకు: 2 రెబ్బలు, ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: టేబుల్‌స్పూను.

* తయారుచేసే విధానం:

* ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.

* చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.

HAMSASANAM HEALTH BENEFITS


హంస ఆసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అక్కడ నుంచి రెండు అరచేతులని నేలమీద ఉంచి వెనక్కి తిప్పిపెట్టాలి. కాళ్లను నెమ్మదిగా వెనక్కి చాపాలి. ముందుకు చూస్తూ శ్వాసని తీసుకుని, వదులుతూ ఉండాలి. ఈ ఆసనంలో కూడా పది నుంచి ఇరవైసెకన్లపాటూ ఉండాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల చేతుల దగ్గర అధిక కొవ్వు చేరుకుండా ఉంటుంది. భుజాలు శక్తిమంతం అవుతాయి. పొట్ట స్ట్రెచ్‌ అయి కొవ్వు తగ్గుతుంది. వీపు, భుజాల దగ్గర స్ట్రెచ్‌ అయి ఆ ప్రాంతంలో అధికంగా ఉండే కొవ్వు తగ్గుతుంది.

INDIAN YOGA HEALTH BENEFITS - PRASARITHA PADHOTHASANAM


ప్రసారిత పాదోత్తాసనం

రెండుకాళ్లనూ సాధ్యమైనంత వరకూ దూరంగా స్ట్రెచ్‌ చేసి మెల్లగా 90 డిగ్రీల కోణంలో వంగి రెండు అరచేతులనూ నేలకు ఆనించాలి. చేతులు రెండు పాదాల మధ్యకు వచ్చేటట్టుగా ఉంచాలి. చేతులు వంచకుండా నిటారుగా ఉంచాలి. తలని పైకిపెట్టి ముందుకు చూస్తూ ఉండాలి. అలా పదిసెకన్ల నుంచి అరనిమిషం పాటూ ఉండాలి. ఈ ఆసనాన్ని రెండు నుంచి మూడు సార్లు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చేతులూ, కాళ్లలోని కండరాలు సాగి క్రమంగా శక్తిని పుంజుకుంటాయి. చక్కగా నునుపుతేలతాయి. తీరైన ఆకృతిని సంతరించుకుంటాయి. భుజాల నుంచి నడుము వరకూ ఉండే కొవ్వు తగ్గుతుంది.

YOGA TIPS - VYAGRASANAM


వ్యాఘ్రాసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చుని అక్కడ నుంచి మోకాళ్లపై లేచి రెండు చేతులన్నీ భుజాలకు సమాంతరంగా ఉంచి... తర్వాత మెల్లగా కుడిమోకాలుని పైకి లేపాలి. ఎడమచేత్తో కుడిపాదాన్ని పట్టుకుని స్ట్రెచ్‌ చేయాలి. ఈ ఆసనంలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. తర్వాత ఇదే విధంగా కుడికాలితో కూడా చేయాలి. ఇలా కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల పిరుదుల వెనక, నడుము దగ్గర ఉన్న కండరాలు సాగి ఆరోగ్యంగా ఉంటాయి. సయాటికా నొప్పి ఉన్నవారికి కూడా ఉపశమనం కలుగుతుంది. శరీరం మొత్తానికి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరం వెనుక భాగంలో అన్ని భాగాలకూ వ్యాయామం అంది కొవ్వు తొలగిపోతుంది.

BEAUTY AND HEALTH BENEFITS WITH PEANUTS - GROUND NUTS - PALLILU


పల్లీలు ... పోషకాలు మెండు..!

కూరలూ, పచ్చళకు రుచి తేవడమే కాదు.. చక్కటి పోషకవిలువలు అందించడంలోనూ ముందుంటాయి పల్లీలు. 

* వేరుసెనగలో ఫోలేట్‌ శాతం అధికం. కాబట్టి గర్భధారణకు ముందూ, ఆ తరవాతా వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే పాపాయిలో అవకరాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే అమినోయాసిడ్‌ వల్ల ఒత్తిడి తగ్గి.. మెదడు చురుగ్గా మారుతుంది.

* వీటిల్లో ఉండే రాగి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. వీటిల్లో మోనోశాచురేటెడ్‌ కొవ్వులూ, యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. వారంలో నాలుగు సార్లు వీటిని తింటే గనక గుండెజబ్బులు చాలా మటుకూ అదుపులో ఉంటాయంటున్నారు నిపుణులు. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారు బరువు పెరిగే అవకాశం తక్కువని ఓ అధ్యయనం చెబుతోంది.

Turmeric Powder - Health and beauty Benefits - skin care with turmeric powder


పసిడికాంతులకు పసుపు

సహజ ఔషధ గుణాలెన్నో కలిగిన పసుపుతో అరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు. అందాన్ని మెరుగుపరుచుకునే సుగుణాలూ ఉన్నాయి. 

వంటింట్లో తప్పనిసరిగా ఉండే దీనితో సౌందర్య పోషణ ఎలాగో చూద్దామా...!

చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి తగినన్ని పాలను చేర్చి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే చాలు...ఇలా కనీసం ఓ నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే యాక్నే, మొటిమలు వాటి తాలూకు మచ్చలు వంటివి దూరమవుతాయి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలకు దారితీసే కారకాలతో పోరాడతాయి.

* కాలం ఏదైనా సరే కొందరి ముఖం ఇట్టే జిడ్డుకారుతుంది. ఇలాంటప్పుడు పరిష్కారంగా పసుపుతో ఈ పూతను ప్రయత్నించి చూడండి. రెండు చెంచాల గంధం పొడి, చిటికెడు పసుపుకి రెండు టేబుల్‌ స్పూన్ల కమలాఫల రసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే సమస్య దూరమవుతుంది. పసుపు చర్మంలో ఉత్పత్తి అయ్యే సీబమ్‌ని నియంత్రిస్తుంది.

* ముప్ఫైలకు చేరుకుంటున్నామనేప్పటికి ముఖంపై సన్నటి గీతలూ కనిపిస్తుంటాయి. కప్పు బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, కాసిని పచ్చిపాలు, రెండు టేబుల్‌ స్పూన్ల టొమాటో రసం కలిపి మరీ గట్టిగా కాకుండా ముద్దచేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని నలుగులా పెట్టుకోవాలి. ఆపై మరో పది నిమిషాలు అలానే ఆరనిచ్చి ముఖం కడిగేసుకుంటే సరి. ముడతలు, మృతకణాల వంటివి పోయి చర్మం నునుపుగా, కాంతిమంతంగా తయారౌతుంది. క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మం చాయ మెరుగుపడుతుంది.

CHINA WOMEN BEAUTY TIPS WITH RICE WATER - PESALU - GREEN TEA - PUDINA


అందానికి చైనా సూత్రాలు ....!

చైనా అమ్మాయిలు తమ సౌందర్య పోషణకు సహజ సిద్ధమైన పదార్థాలనే ఎక్కువగా వాడతారు. మార్కెట్లలో లభించే రకరకాల క్రీముల కంటే వీటికే ప్రాధాన్యమిస్తారు..

* బియ్యం నీళ్లు: ముఖం అందంగా కనిపించాలంటే.. ముందు అది పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసం ఖరీదైన ఉత్పత్తులేవీ వాడరు. బియ్యం నీళ్లనే టోనర్‌గా ఎంచుకుంటారు. అదెలాగంటే పాలిష్‌ చేయని బియ్యాన్ని ముందుగా నీళ్లలో నానబెడతారు. కాసేపటికి నీళ్ల రంగు తెల్లగా పాలలా మారుతుంది. ఆ నీటిలో దూదిని ముంచి తుడుచుకుంటే ముఖం పరిశుభ్రంగా... ప్రకాశవంతంగా తయారౌతుంది.

* పెసలు: వీటిని కొన్ని శతాబ్దాలుగా ముఖానికి పూతలా వాడుతున్నారు చైనీయులు. బాగా నానబెట్టిన పెసల్ని మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటారు. అరగంటయ్యాక కడిగేసుకుంటారు. ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాదు, మొటిమలు కూడా తగ్గుతాయి.

* గ్రీన్‌ టీ: దీన్ని చర్మ, కేశసంరక్షణకు మాత్రమే కాదు... పొద్దునే లేచి మూడు, నాలుగుకప్పులు తాగేస్తారు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. జీవక్రియల వేగాన్నీ పెంచుతాయి.

* మర్దన: మనం మర్దనని కేవలం విశ్రాంతికీ, ఒత్తిడి నివారణ కోసమనే అనుకుంటాం. కానీ చైనీయులు మాత్రం మర్దన వల్ల శరీరానికి రక్తప్రసరణ సజావుగా సాగుతుందనీ, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయనీ భావిస్తారు. అందుకే తరచూ మర్దనకు ప్రాధాన్యం ఇస్తారు.

* పుదీనా: చైనా అమ్మాయిల అందానికి కారణం పుదీనానే. వీరు గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుంటారు. కాసేపయ్యాక కడిగేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తారు.
పసుపు: మన దేశంలో సౌందర్య సంరక్షణలో ఎక్కువగా పసుపు వాడుతుంటాం. చైనీయులు కూడా దీనికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. చర్మంపై ముడతల్ని నివారించేందుకు, శరీరఛాయను మెరుగుపరిచేందుకు పసుపును ఎంచుకుంటారు. రెండు చెంచాల పసుపులో చెంచా తేనె, కాసిని బాదం పాలు చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటారు. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తారు. ఇలాంటి చిన్నచిన్న చర్యల ద్వారానే వారు తమ చర్మ సౌందర్యాన్ని పెంచుకుంటారు.

BEAUTY HELATH BENEFITS WITH MENTHI


మెరిపించే మెంతి

కాస్త కంటికి నదురుగా....తాజాగా కనిపించడం కోసం అస్తమానం బ్యూటీపార్లర్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే మెంతులు, మెంతి ఆకులతో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

కూరల్లో ఉపయోగించే దీన్ని సౌందర్య పోషకంగా ఎలా వాడాలి అంటారా? 

* మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.

* తాజాగా ఉండే మెంతిఆకులను ఎంచుకుని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

* పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి, మురికి వదిలిపోతాయి. చర్మం నునుపుగా తయారవుతుంది. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది.

BEAUTY WITH HOT WATER


 అందానికి గోరువెచ్చని నీళ్లు

ముఖాన్ని అందంగానే కాదు, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇంతకీ అవేంటంటే..

* వాతావరణం ఏ మాత్రం చల్లగా ఉన్నా.. వేణ్నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటాం. అలాగే ఏ మాత్రం ఎండగా అనిపించినా చల్లనినీళ్లను ముఖంపై చల్లుకుంటాం. నిపుణుల ప్రకారం రెండూ సరికావు. మరీ వేడిగా, అలాగని చల్లగా కాకుండా ఏ రుతువులోనైనా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం శ్రేయస్కరం.

* సున్నితమైన చర్మాన్ని అదేపనిగా రుద్దడం వల్ల ఎర్రగా కందిపోతుంది. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగించేందుకు అదేపనిగా రుద్దాలని లేదు. కేవలం మునివేళ్లతో మర్దన చేసుకుని, తరవాత కడిగేస్తే చాలు.

* ముఖంలో పేరుకున్న మురికీ, క్రిములు పూర్తిగా తొలగిపోవాలంటే ముందుగా మేకప్‌ని పూర్తిగా తుడిచేయాలి. క్లెన్సర్లు మేకప్‌ని తొలగించవు కాబట్టి మేకప్‌ రిమూవర్‌ని ఎంచుకుంటే మంచిది. ఆ తరవాతే ముఖాన్ని కడుక్కోవాలి.

* సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి కానీ, ముఖానికి కాదు. వాటి గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్‌ క్లెన్సర్‌ని వాడాల్సి ఉంటుంది. అది కూడా మన చర్మతత్వానికి నప్పేదై ఉండాలి.

* ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చేతుల్లోని మురికీ, క్రిములు ముఖంలోకి చేరతాయి. దాంతో మొటిమలు మొదలవుతాయి.

* కొందరు రోజంతా అదేపనిగా ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. కానీ అది సరైన పనికాదు. అలా చేయడం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అతిగా శుభ్రం చేయడం వల్ల కూడా చర్మంలో అధిక నూనెలు విడుదలై ఇబ్బంది పెడతాయి.