WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 29 July 2014

LORD SIVA TEMPLE AT YANAMADDURU VILLAGE - BHIMAVARAM - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA - MUST VISIT



యనమదుర్రు 'శక్తీశ్వరస్వామి క్షేత్రం'

యమధర్మ రాజుకు ఒకనాడు తాను చేసే విధిపై కొంచెం అసహ్యం కలిగి, శివుని గురించి తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించి ఒకానొక రాక్షసుని వధానంతరం నా దగ్గరకు రావడం జరుగుతుందని అప్పుడు తాను ఆంధ్రదేశంలో ప్రతిష్ఠించి, తద్వారా యముడు అంటే ప్రాణాలు తీసేవాడు కాదు, దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయగలడనే మంచి పేరు దక్కేలా చేయడమే కాక మనుష్యులందరి చేత స్మరింపబడతాడని యమధర్మరాజుకి వరం ఇచ్చాడు. ఆ వరప్రభావంగా ఈ 'యనమదుర్రు' గ్రామం వెలిసింది. ఈ దేవస్థానంలో మహాశివుడు శీర్షాసన భంగిమలో వెలియడం విశేషం.


శివుని ప్రతిమ (సాకారరూపం) సాధారణంగా కాళ్లపై నిలబడి ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు శీర్షాసన (తలక్రిందులుగా తపం ఆచరిస్తున్న) భంగిమలో ఉండటం విశేషం. శివుడి జటాఝూటం భూమిని తగులుతూంటుంది. ఆపైన ముఖం, కంఠం, ఉదరం...ఇలా ఆఖరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి. బాలింతగా తాను కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణ ధ్వేయంగా అమ్మవారు తన ఒడిలో మూడునెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలిసి, భక్తులను అనుగ్రహిస్తోంది.

దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీపార్వతీ సమేత శక్తీశ్వర స్వామి క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో గల యనమదుర్రు గ్రామంలో వుంది.

TELUGU CHILDREN'S STORY - HARIKATHA



హరికథ చేసిన మేలు

ఒక ఊరిలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. 

ఒకసారి వాళ్ళఊరి గుడిలో హరికథ చెబుతున్నారు.

ఆ సంగతి తెలుసుకొన్న రామయ్య, ఆ రాత్రికి గొర్రెల మందలోకి పనివాణ్ణి పంపి, తను హరికథ వినడానికి వెళ్ళాడు.


వెళ్ళేటప్పుడు, అతని భార్య అతనికి కొన్ని పప్పులు(పుట్నాలు) ఇచ్చి పంపింది. 

అయితే గొర్రెల్లో ఉండీ ఉండీ నోరాగకుండా తినటం అలవాటైంది రామయ్యకు. 
భార్య ఇచ్చిన పప్పులు కాసిన్నీ హరికథ చెప్పేచోటికి వెళ్ళేలోపే తినేసాడు అతను. 
తీరా గుడిని చేరుకొని చూస్తే, హరి కథ చెప్పే దాసుగారు ఇంకా రాలేదు. 
నోరాగని రామయ్య ఇక ఆగలేకపోయాడు. పప్పులకోసం తిరిగి ఇంటికి వెళ్లాడు. 
భార్య ఇంట్లో ఉన్న పప్పులన్నింటినీ బట్టలో కట్టి ఇచ్చింది రామయ్యకు. 
ఇక అతను సంతోషంగా వాటిని తినుకుంటూ హరికథకు వెళ్ళాడు. హరికథ మొదలయింది.


దాసుగారు "ఆఁ, అందరూ వచ్చారా? 
ఆఁ, అందరూ కూర్చోండి! సరే!! 

అయితే ఇక మొదలు పెడదామా?" అని అంటూండే లోపే, కడుపునిండా తిన్న రామయ్య నిద్రలోకి జారుకున్నాడు. హరికథంతా అయిపోయేసరికి అర్థ రాత్రయింది. అందరూ ఇళ్లకు వెళ్తుండగా మేలుకున్న రామయ్య, " ఆఁ, అందరూ వెళుతున్నారా?" అని హరికథ చెప్పే దాసుగారు అనటం మాత్రం విన్నాడు. ఇక తనూ లేచి, అందరితోపాటూ తీరికగా ఇంటికి చేరుకున్నాడు.


అప్పటికి సమయం ఒంటిగంటయ్యింది. సరిగ్గా అదే సమయానికి కొందరు దొంగలు రామయ్య ఇంటికి దొంగతనానికని వచ్చి ఉన్నారు.

ఇంటికెళ్ళిన రామయ్యను, హరి కథలో ఏమి చెప్పారని అడిగింది భార్య. అడగ్గానే, 
" ఆఁ, అందరూ వచ్చారా?" అనిగట్టిగా అన్నాడు రామయ్య.


అది విన్న పెరట్లోని దొంగలు తామొచ్చింది ఇంటిలోనివారికి తెలిసిపోయిందనుకొని, పొదలమాటున నక్కి కూర్చున్నారు.

ఈ సారి రామయ్య, " ఆఁ! అందరూ కూ
ర్చున్నారా?" అన్నాడు. తామొచ్చింది ఇంట్లోని వారికి ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్నారు బయటున్న దొంగలు!. 

ఈసారి రామయ్య "సరే! అయితే మొదలుపెడదామా! " అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇంట్లోని వారందరూ వస్తున్నట్టున్నారని దొంగలంతా పారిపోతుండగా, "ఆఁ! అందరూ వెళ్ళిపోతున్నారా?" అన్నాడు రామయ్య, దాసుగారు అన్నట్లుగా. దాంతో దొంగలు హడావిడిగా కాలికి బుద్ధి చెప్పారు. హరికథను వినకుండానే రామయ్యకు అంతమేలు జరిగింది,

FESTIVAL ARTICLES IN TELUGU - SRI MANGALA GOWRI VRATHA KATHA IN TELUGU - TIPS TO PERFORM SRI MANGALA GOWRI VRATHAM - STEP BY STEP DETAILS



శ్రీ మంగళ గౌరీ వ్రతకథ 


పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. 
కానీ, వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు.


ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం, వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు.

ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. 

కాబట్టి, శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

* మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. 

* మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. * వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.


ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ.

పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. 
ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను 
* గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. 
* రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. 

* మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు.


ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు.

తరువాత, వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యారు . 

ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.


మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి.

చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

Sunday 27 July 2014

VITAMIN-D PUTS CHECK TO BREAST CANCER - ANALYSIS


ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదులక్షల మందికి పైగా మహిళలు రొమ్ముక్యాన్సర్‌ కారణంగా మరణిస్తున్నారు. గ్లోబకాన్‌ డాటా (క్యాన్సర్‌కు సంబంధించి అంతర్జాతీయ పరిశోధన ఏజెన్సీ) ప్రకారం రొమ్ము క్యాన్సర్‌ కారణంగానే 1.85 మిలియన్‌ సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితం నష్టపోతూ భారతదేశం ఈ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న 1,45,000 సరికొత్త రొమ్ముక్యాన్సర్‌ కేసులు మరో దశాబ్ధంన్నర నాటికి 2,14,000కు చేరుకునే అవకాశం ఉందని క్యాన్సర్‌ వైద్యుల అంచనా. ఇటీవల కాలంలో వెలువడిన పరిశోధనల ఫలితాల ప్రకారం విటమిన్‌ డి లోపం రొమ్ము క్యాన్సర్‌ వృద్ధికి ప్రధాన కారణంగా తేలింది. బ్రెస్ట్‌ టిషఉ్యలో విటమిన్‌ డి గ్రాహకాలు ఉంటాయి. విటమిన్‌ డి ని ఈ గ్రాహకాలు బంధిస్తాయి. దీనివల్ల క్యాన్సర్‌ జీన్స్‌ మరణించేలా చేయటం లేదా వృద్ధి చెందటం ఆపటం చేస్తాయి. దానితో పాటు క్యాన్సర్‌ సెల్స్‌ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా కూడా అడ్డుకుంటాయి. విటమిన్‌ డి రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకోవటంలో సహాయపడుతుందని యుఎస్‌ఎకు చెందిన విటమిన్‌ డి, ఆరోగ్యం, సూర్యకాంతి శరీరానికి తగలటం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ''విటమిన్‌ డి కౌన్సిల్‌'' తన అధ్యయనం ద్వారా తెలిపింది. దాని ప్రకారం ఇప్పటికే రొమ్ముక్యాన్సర్‌ కలిగిన మహిళలు లేదంటే గతంలో రొమ్ము క్యాన్సర్‌ కనుగొనబడిన మహిళలకు విటమిన్‌ డి ఎంతగానో సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో విటమిన్‌ డి ప్రమాణాలతో కూడిన నివేదికలు పరిశీలించిన తరువాత ఈ శక్తివంతమైన ప్రో హార్మోన్‌ ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. చాలా పరిశోధనలను సమీక్షించిన తరువాత రొమ్ముక్యాన్సర్‌తో బాధపడే మహిళలు ఎవరికైతే తక్కువ పరిమాణంలో విటమిన్‌ డి నిలువలు ఉంటాయో వారికి క్యాన్సర్‌ మరలా వచ్చే అవకాశాలు రెట్టింపుగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు. విటమిన్‌ డి అధికరగా ఉన్న వారితో పోలిస్తే మరణాల సంఖ్య కూడా విటమిన్‌ డి తక్కువగా ఉన్నవారిలో కనిపిస్తుందని విటమిన్‌ డి కౌన్సిల్‌ వెల్లడించింది.


HEALTHY FOOD STUFF TIPS IN TELUGU



ఆహారం మనిషి ప్రాథమిక అవసరాల్లో తొలి స్థానంలో ఉంటుంది. అభివృద్ధిచెందిన ఆహారం మనిషి ఆలోచనలను, సామాజిక ప్రవర్తనను తీర్చిదిద్దింది.

ఖీ    ఆరోగ్యానికి, ఆలోచనలకు, పురోగమనానికి మనిషి స్వీకరించే ఆహారం తోడ్పడుతుంది. శ్రమను తట్టుకునే శక్తిని సమకూరుస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సమర్థవంతంగా పనిచేసే లక్షణాన్ని చేకూర్చిపెడుతుంది.

ఖీ ఆహారంతోటే బుద్ధివికాసం, కళానైపుణ్యం, శాస్త్రాభివృద్ధి సాధ్య మవుతున్నాయి. మనిషిని రాక్షస ప్రవృత్తినుండి మానవతా ధోరణిలోకి ఆహారం తీసుకురాగల్గింది.

ఖీ    భుజించిన ఆహారం మనిషి శరీరంలో మూడు భాగాలుగా విడిపోతుంది. కొంత విసర్జితం కాగా మరికొంత కండపుష్టిని కల్గిస్తుంది. మిగిలినది మేథను వృద్ధిచేసి ప్రజ్ఞాశీలిగా మారుస్తుంది.

ఖీ    అప్పుడేపుట్టిన శిశువునుండి, జీవితాను భవాల చరమాంకంలోవున్న వ్యక్తివరకు శారీరక స్థితిని అనుసరించి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. 

ఖీ మనిషి ఎదుగుదలకు కీలకమైన బాల్యవ్యవస్థలో సరియైన పోషకాహారం పటిష్టమైన పునాదులను ఏర్పరుస్తుంది. 

ఖీ పసివారి ప్రయోజన కరమైన ఎదుగుదలకు, పరిరక్షణకు, సంరక్షణకు విధిగా పోషకాహారాన్ని సమకూర్చాలి.

ఖీ ఆహారం కేవలం పసివారి మనుగడ కోసమే కాదు అభివృద్ధి కోసం కూడా అని మరువకూడదు.

ఏమి తినాలి? : శరీరానికి మొత్తం 50 పోషకాలు అవసరం అవుతాయి. పిండిపదార్థాలు, పీచు పదార్థాలు, నీరు, కొవ్వుపదార్థాలతోపాటు 10 అమైనో ఆమ్లాలు (ఇవి ప్రోటీన్ల తయారీకి కావాలి) 16 ఖనిజ లవణాలు, 13 విటమిన్లు శరీరానికి అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా వెల్లుల్లి, బ్రన్సెల్‌ స్ప్రౌట్స్‌, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌...వంటి కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తాయి. పైగా క్యాన్సర్‌, గుండెజబ్బుల నివారణ కు దోహద పడతాయి.

ఖీ నారింజరంగులో ఉన్న పళ్లు, కూర గాయలు, క్యారట్‌, చిలగడదుంప, టమాటోల్లో బీటా-కెరోటిన్‌ (ఎ-విటమిన్‌) బాగా లభిస్తుంది.

ఖీ శరీరానికి ఎనిమిదిగంటలు ఏ ఆహారం అందించక పోతే దానికి కావలసిన పోషక పదార్థాలు వెంటనే అందించాల్సి ఉంటుంది. 

ఖీ ఉదయంపూట తప్పనిసరిగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఫిష్‌, కర్రీపఫ్‌ లాంటివయితే వారానికి ఒకసారితింటే చాలు. 

ఖీ క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్టు తీసుకున్నవారే దానిని తినని వారికంటే నాజూగ్గా ఉంటారు.ఖీ డైటింగ్‌చేయడంవల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పూర్తిగా నిద్రలేవని సమయంలో అర్థరాత్రి సమయాల్లో భోజనం చేయడం శరీరానికి అంతమంచిది కాదు. 

ఖీ వేయించిన పదార్థాలకన్నా ఉడికించిన పదార్థా లు తినడం మంచిది. ఖీ సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సప్లిమెంటుపదార్థాలు తినా ల్సిన అవసరంఉండదు. 

ఖీ ఎక్కువగా ధూమపానం చేసేవారు, గర్భిణీలు, వృద్ధులు ఆకలికోల్పోయిన వారు సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. ఖీ గుండె జబ్బులున్నవారు వారానికి రెండుసార్లు మాక్రెల్‌, సాల్మన్‌ చేపల్ని తినడం మంచిది.

ఖీ ఆయిలీఫిష్‌లో విటమిన్‌-డి సమృద్ధిగా ఉంటుంది. వెజిటబుల్‌ ఆయిల్స్‌లో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉంటుంది.

ఖీ    ఈ రెండూ కూడా గుండెజబ్బుల్ని నివారి స్తాయి. ఖీ మన శరీరం రోజుకి ఒకటిన్నర లీటర్ల నీటిని కోల్పోతుంది. కావున అనుదినం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం అవసరం.
గుర్తుంచుకోండి! : కౌమార దశలోవున్న బాలికలు రాగుల్ని రొట్టె, సంకటి, మాల్ట్‌ ఎక్కువగా తీసు కోవడంవల్ల ఐరన్‌లోపాన్ని అరికట్టవచ్చు.

ఖీ 6-9 నెలలవయసుగల పిల్లల ఆహారవిషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో వారికి పెట్టే ఆహారం వారి మానసిక, శారీరక పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది.

ఖీ పిల్లలకు ఒకేసారి ఎక్కువ ఆహారం ఇవ్వకూడదు. మొత్తం ఆహారాన్ని రోజు మొత్తంమీద అయిదారుసార్లు విభజించి పెట్టాలి.

ఖీ    బాల్యస్థితిలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండకపోతే కౌమారదశలో తీసుకోవాలి. ఖీ అను దినం అన్నం, పప్పు లేదా రొట్టె, పప్పు, ఆకుకూర లు, కాయగూరలు విధిగా తీసుకోవాలి.

ఖీ    భోజనం తరువాత సి-విటమిన్‌ కలిగిన ఏదో ఒక పండును కనీసం జామపండునైనా తినాలి. దీనివలన రక్తహీనత సమస్య తలెత్తదు.

ఖీ    భోజనానంతరం కనీసం రెండుగంటల వరకు కాఫీ, టీలు సేవించకూడదు. 

ఖీ 45 ఏళ్లు దాటిన వారు మితంగా ఆహారం తీసుకోవడం అలవరచు కోవాలి. 

ఖీ     వృద్ధాప్యంలో ఆకలి మందగిస్తుంది కాబట్టి పండ్లు ఎక్కువగాతినడం ఉత్తమం.ఖీ రెడీ మేడ్‌ పోషక ఆహార పదార్థాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. 

ఖీ ఖనిజ లవణాలతోను, మాంసకృత్తుల తోను, రకరకాల విటమిన్లతోను, ఇతర పోషకాలతో కూడుకున్న సమతుల ఆహారం మానసిక, శారీరక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఖీ ఈ ఆహారం వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పౌష్టికా హారం తీసుకుంటే మందులఖర్చు చాలావరకు ఆదా అవుతుంది.

LIST OF SRAVANAMASAM PUJA RECIPES AND ITS HEALTHY USES



శ్రావణ వంటలు -- ఆరోగ్యప్రదాయము :

ఆషా్ఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది

. వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంచి . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిందివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు

. ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంతం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .

తొమ్మిది రకాల పిండివంటలు

పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి
.
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .

గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .

పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .

చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
.
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .

చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .

పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము .

Saturday 26 July 2014

WHAT IS THE SCIENTIFIC REASON BEHIND TAKING THEERTHA PRASADALU IN HINDU TEMPLES


తీర్ధ ప్రసాదం

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు ఉంటాయి .

1.జల తీర్ధం

2.కషయ తీర్ధం

3.పంచామృత తీర్ధం

4.పానకా తీర్ధం


జల తీర్ధం

ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .

కషాయ తీర్ధం

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .

పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది .
పానకా తీర్ధం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..

కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .

పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .
దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .

రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు
రుమాటిజం ,ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .
నీరసం దరిచేరదు .

ఆకలి బాగా వేస్తుంది
దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .
జేవితంలో శత్రువుల బాధ ఉండదు
బుద్ది చురుకుగా పని చేస్తుంది
జ్ఞాపకశక్తి పెరుగుతుంది .

HOW TO TAKE CARE OF YOUR BEAUTIFUL SKIN IN RAINY SEASON


వర్షాకాలంలో మీకోసం స్పెషల్ స్కిన్ కేర్ టీప్స్

ఆవిరి పట్టుడం:

చర్మంలో రంధ్రాలు తెరుచుకొని, చర్మంలోపల చేరిన దుమ్ముధూళి నిర్మూలించడానికి ముఖానికి ఆవిరి పట్టడం చాలా అవసరం. ఆవిరి పట్టిన తర్వాత, కొన్ని నిముషాలు అలాగే ఉండే, తర్వాత ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేసుసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెరచుకొన్న చర్మ రంధ్రాలు, మూసుకోబడుతాయి.

వారానికి రెండు సార్లు ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి:

చర్మంలోని అన్నింటికంటే పైపొర వర్షాలకు పొడిగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మం నిర్జీవంను మరియు పిగ్మెంటేషన్ నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ ఒక ఉత్తమ మార్గం. అందుకు వారానికి రెండు సార్లు బీడ్స్ తో స్ర్కబ్ చేయాలి. మరియు కెమికల్ గ్లైకోలిక్ పీల్ నెలకు రెండుసార్లు చేసుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన మరియు కాంతి వంతమైన చర్మం అందిస్తుంది
.
పుదీనా ఫేషియల్ మంచి ఉపాయం:

ఈ సీజన్ లో మీ చర్మానికి పుదీనా లేదా బొప్పాయి ఫేషియల్ ఉత్తమం. పుదీనా మీ ముఖానికి కూలింగ్ ఎపెక్ట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీ ముఖానికి చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది, దాంతో చర్మ రంద్రాల పరిమాణం తగ్గుతుంది. పొడి చర్మం ఉన్నవారికి బొప్పాయి గొప్పగా సహాయపడుతుంది.

ARTICLE IN TELUGU ON SRAVANA MASAM - THE IMPORTANCE OF SRAVANA MASAM AND ITS PUJA PRAYERS


శ్రావణ మాసం విశిష్టత ,
(27 నుంచి శ్రావణమాసం ప్రారంభం )

మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు .

శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి.

ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు .

మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే .

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,
భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది


. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.

Friday 18 July 2014

USES OF FRUITS AND ITS COVERS - HEALTH TIPS WITH FRUITS WASTE



తొక్కలతో ఉపయోగాలెన్నో 

నిమ్మరసం కానీ, బత్తాయిరసం కానీ తీసిన తర్వాత తొక్కని పారేస్తున్నారా...! అయితే, ఇక నుంచీ ఆ తొక్కలు పారేయకండి. ఎందుకంటే సిట్రస్‌ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వీటి వల్ల డబ్బులు ఆదా కావడంతో పాటు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

- గోరు వెచ్చని నీటిలో ఎండ బెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది మీ శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది.

- నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్‌ జాతికి చెందిన పండు ఏదైనా సరే తొక్కను తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోయి, మంచి వాసనతో నిండిపోతుంది.
- సిట్రస్‌ జాతి పండ్ల తొక్కులకు కొద్దిగా బ్రౌన్‌షుగర్‌ను అద్ది అరచేతులకు, మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా మారతాయి.

- ఎండిపోయిన సిట్రస్‌ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్‌ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టలు మంచి సువాసన వస్తాయి. డ్రాయర్ల లోపల ఒక సాచెట్‌ను పెడితే మంచి సెంటు వాసనను వెదజల్లుతుంది. తొక్కలను వార్డురోబ్‌లో ఉంచడం వల్ల సువాసనలు వెదజల్లుతాయి.

- నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది.

DON'T UNDERESTIMATE THE NATURE OF GOODNESS


సాగరాన్ని చులకన చెయ్యడం ఎంత తప్పో

మంచితనాన్ని తక్కువగా అంచనా వెయ్యడం అంతే తప్పు..!

COMPETITION BETWEEN A CROW AND THE SWAN - TELUGU MORAL CHILDRENS STORIES COLLECTION



కాకి - హంస

పూర్వం ఒకానోక రాజ్యాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక వర్తకుండేవాడు. భాగ్యవంతుడు.మంచివాడు. ఒక రోజు అతనొక కాకిని చేరదీసి రోజు దానికి ఎంగిలి మెతుకులు వేసి పెంచారు.అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది.

ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు. ఆ హంసల కంటే ఎత్తుగా ఎగరగలవా? "అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి."మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరితూగగలిగే కాకులు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నావా . చూసావా??" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం నాకు చేతనవును. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనలు వెళతాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం " అంది కాకి. "ఆ గతులు, గమనాలు మాకు తెలీదు.మామూలుగా సముద్రం మీద ఎగురుదాం. మేమంతా వద్దు కాని మాలో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

ఒక హంస, కాకి రెండూ సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి మాత్రం విన్యాసాలు చేయసాగింది.హంసను దాటిపోయి వెనక్కి తిరిగి హంసను వెక్కిరించడం,ముక్కు మీద ముక్కు పెట్టడం, జుట్టు రేపుకుని, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులు చేసింది. హంస అవన్ని పట్టించుకోక ఊరకుంది. కాసేపటికి కాకి అలిసిపోఉయింది. హంస పొడుగ్గా ఎగిసి పడమరకు పరుగెత్తింది. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమోహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. "అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి కాసేపు ఆగుదామంటే పర్వతాలు, చెట్లు కూడా లేవు. ఈ సముద్రంలో పడితే మరణమే గతి" అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది.

అది చూసి "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేసావు. ఒక్కటీ చూపవేమి వాయసరాజమా?" అంది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా ఉంది. "ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నూ మిన్నూ గానక నాకెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతులనయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నాయందు దయ చూపి నను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది."ఇంకెప్పుడు గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస.
కాకి లెంపలేసుకుంది.

STEP BY STEP DETAILS OF SRAVANA SUKRUVARAM POOJA PERFORMANCE - TELUGU DEVOTIONAL / BHAKTHI PRAYERS ABOUT SRAVANA SUKRUVARAM




శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలి?

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం . వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు.

ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు . శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుంది.

. అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు

. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి

Friday 11 July 2014

MANSOON HAIR CARE TIPS IN TELUGU - BEAUTY TIPS FOR CARING HAIR IN RAINY SEASON IN TELUGU



వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు 

1) మీ జుట్టును పొడిగా ఉంచండి: సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం సుమారు 50-60 వెంట్రుకలను కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోండి 

2) తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి: మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.

3) ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.

4) కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

5) పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా వస్తుంది.

6) జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది కనుక పూర్తిగా ఆరనివ్వండి.

ARTICLE ON TELUGU CULTURE AND TRADITIONAL PADAHARANALA TELUGU AMMAI - TELUGU TRADITIONAL BEAUTY



పదహారణాల తెలుగమ్మాయి అంటే..!?  

అది తెలుసుకోవాలంటే ముందు పదహారణాలు అంటే ఏంటో పరిశీలిద్దాం.

భారత దేశంలో ఒకప్పుడు అణాలు ఉండేవి అని మన అందరికి తెలుసు. ఆ తరువాతి కాలంలో రూపాయి ప్రవేశపెట్టబడింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఒక భాజకం ఉండాలి కదా, అది ఒక అణా = 6.25 పైసలు.


మనలో చాలా మందికి తెలిసిన కొన్ని పదాలు పరిశీలిస్తే. (భావితరాలకు తెలిసే అవకాశంలేదు, ఎందుకంటే అవి వాడుకలోంచి వెళ్ళిపోయాయి)

చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు

ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు

బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు


లెక్క సరిపోయింది కదా. ఇక పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. 

అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. 

ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పుకోవచ్చు. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలొ, ఇలా ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయి మాతమే పదహారణాల తెలుగమ్మాయి అనడానికి అర్హత కలిగిన అమ్మాయి. ఏ ఒక్క విషయంలో తెలుగుదనం లేకున్నా తనకు పదహారణాలు తెలుగమ్మయి అని పిలవబడటానికి అర్హత లేదు.

TELUGU LANGUAGE AND ITS ALPHABETS - DETAILED LIST OF TELUGU GUNINTHALU


గుణింతాలు :


గుణింతం అంటే తెలుగు హల్లుకి అచ్చు కూడటంవలన వచ్చే శబ్దాల అమరిక. 
ఈ క్రింది పట్టికలో తెలుగు అక్షరాలు వాటి గుణింతాలు ఇవ్వబడ్డాయి.



అక్షరం గుణింతం 


క :
---
క, కా, కి, కీ, కు, కూ, కృ, కౄ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
ఖ :
----
ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, ఖృ, ఖౄ, ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, ఖం, ఖః
గ ;
---
గ, గా, గి, గీ, గు, గూ, గృ, గౄ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః
ఘ:
----
ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘృ, ఘౄ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః
చ :
----
చ, చా, చి, చీ, చు, చూ, చృ, చౄ, చె, చే, చై, చొ, చో, చౌ, చం, చః
ఛ :
----
ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛృ, ఛౄ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః
జ :
---
జ, జా, జి, జీ, జు, జూ, జృ, జౄ, జె, జే, జై, జొ, జో, జౌ, జం, జః
ఝ :
------
ఝ, ఝా, ఝి, ఝీ, ఝు, ఝూ, ఝృ, ఝౄ, ఝె, ఝే, ఝై, ఝొ, ఝో, ఝౌ, ఝం, ఝః
ట :
----
ట, టా, టి, టీ, టు, టూ, టృ, టౄ, టె, టే, టై, టొ, టో, టౌ, టం, టః
ఠ :
---
ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠృ, ఠౄ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః
డ :
----
డ, డా, డి, డీ, డు, డూ, డృ, డౄ, డె, డే, డై, డొ, డో, డౌ, డం, డః
ఢ :
----
ఢ, ఢా, ఢి, ఢీ, ఢు, ఢూ, ఢృ, ఢౄ, ఢె, ఢే, ఢై, ఢొ, ఢో, ఢౌ, ఢం, ఢః
ణ :
----
ణ, ణా, ణి, ణీ, ణు, ణూ, ణృ, ణౄ, ణె, ణే, ణై, ణొ, ణో, ణౌ, ణం, ణః
త :
----
త, తా, తి, తీ, తు, తూ, తృ, తౄ, తె, తే, తై, తొ తో, తౌ, తం, తః
థ :
----
థ, థా, థి, థీ, థు, థూ, థృ, థౄ, థె, థే, థై, థొ, థో, ధౌ, థం, థః
ద :
----
ద, దా, ది, దీ, దు, దూ, దృ, దౄ, దె, దే, దై, దొ, దో, దౌ, దం, దః
ధ :
----
ధ, ధా, ధి, ధీ, ధు, ధూ, ధృ, ధౄ, ధె, ధే, ధై, ధొ, ధో, ధౌ, ధం, ధః
న :
----
న, నా, ని, నీ, ను, నూ, నృ, నౄ, నె, నే, నై, నొ, నో, నౌ, నం, నః
ప :
----
ప, పా, పి, పీ, పు, పూ, పృ, పౄ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః
ఫ :
----
ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫృ, ఫౄ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః
బ :
---
బ, బా, బి, బీ, బు, బూ, బృ, బౄ, బె, బే, బై, బొ, బో, బౌ, బం, బః
భ :
----
భ, భా, భి, భీ, భు, భూ, భృ, భౄ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః
మ :
-----
మ, మా, మి, మీ, ము, మూ, మృ, మౄ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః
య :
------
య, యా, యి, యీ, యు, యూ, యృ, యౄ, యొ, యే, యై, యొ, యో, యౌ, యం, యః
ర :
---
ర, రా, రి, రీ, రు, రూ, రృ, రౄ, రె, రే, రై, రొ, రో, రౌ, రం, రః
ల :
---
ల, లా, లి, లీ, లు, లూ, లృ, లౄ, లె, లే, లై, లొ, లో, లౌ, లం, లః
వ :
---
వ, వా, వి, వీ, వు, వూ, వృ, వౄ, వె, వే, వై, వొ, వో, వౌ, వం, వః
శ :
---
శ, శా, శి, శీ, శు, శూ, శృ, శౄ, శె, శే, శై, శొ, శో, శౌ, శం, శః
ష :
---
ష, షా, షి, షీ, షు, షూ, షృ, షౄ, షె, షే, షై, షొ, షో, షౌ, షం, షః
స :
---
స, సా, సి, సీ, సు, సూ, సృ, సౄ, సె, సే, సై, సొ, సో, సౌ, సం, సః
హ :
---
హ, హా, హి, హీ, హు, హూ, హృ, హౄ, హె, హే, హై, హొ, హో, హౌ, హం, హః
క్ష :
---
క్ష, క్షా, క్షి, క్షీ, క్షు, క్షూ, క్ష్, క్ష్, క్షె, క్షే, క్షై, క్షొ, క్షో, క్షౌ, క్షం, క్షః

GODDESS SRI PARVATHI DEVI PRAYER IN TELUGU



పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |

తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ||

IMPORTANCE OF INDIAN FESTIVAL - GURU POURNAMI - MEANING AND PRAYERS OF TELUGU FESTIVAL - GURU POURNAMI



గురు పౌర్ణమి.. వ్యాసపూర్ణిమ రోజున ఎవరిని పూజించాలి?

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :

గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట.


ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.

వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.

ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.

ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..