WORLD FLAG COUNTER

Flag Counter

Friday 31 January 2014

HOW TO STOP EXCESSIVE SWEATING - SIMPLE TIPS FOR OVERCOMING SWEATING ALL THE TIME



భరించలేని చెమట వాసన... అధిక చెమటతో చిరాకు..


కొంతమంది అలా మన ప్రక్కకు వస్తే వారి వద్ద నుంచి వచ్చే చెమట వాసనను భరించలేనంతగా ఉంటుంది. వారి వద్ద నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంటాం. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే చెమట దుర్గంధాన్ని పారదోలవచ్చు.ప్రతి వారంలో ఒక్కరోజు నువ్వుల నూనెను ఒంటికి బాగా రాసుకుని చింతపండు గానుగ గింజలను నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకుంటే చర్మం నుండి వచ్చే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.కొందరిలో అధిక చెమట పడుతుంది. అలాంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క తీసుకుని నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది.

PREGNANT WOMEN NEEDS FULL REST - MUST TAKE FLUIDS - NO STRESS AND TENSION


గర్భధారణ సమయంలో 

గర్భధారణ సమయంలో మహిళలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు నీరు తాగండి. 

వేవిళ్లు, వికారం వంటి సమస్యలకు అల్లం దివ్యౌషధంగా పని చేస్తుంది. అల్లం వికారంకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. చల్లని అల్లం టీని తాగడమో లేదా అల్లం వాసన చూడటమో చేయవచ్చు. 

గర్భిణీలు కంప్యూటర్‌తో మరింత జాగ్రత్త కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారికి కొన్ని సందర్భాల్లో వికారానికి దారితీయవచ్చు, ఒక వేళ అటువంటి సందర్భాల్లో మీరు కంప్యూటర్ ఉపయోగించడం పూర్తిగా నివారించాలి. కానీ మీరు తప్పనిసరిగా ఉపయోగించాలంటే జూమ్ చేసి ఉపయోగించవచ్చు.

విశ్రాంతి బాగా తీసుకోవాలి మీరు గర్భవతి అయిన తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇది మీకు మరియు మీ కడుపులో పెరిగే బేబీకి మీద బాగా పనిచేస్తుంది. విశ్రాంతి తీసుకొనేటప్పుడు మీ వెనుక భాగంలో దిండును ఎత్తుగా మీకు సౌకర్యవంతంగా వేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆహారం తిన్న తర్వాత మరియు రాత్రి సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మీ నిద్రకు భంగం కలిగించే విధంగా ఒత్తిడికి గురికాకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Thursday 30 January 2014

HEALTHY INDIAN BELIEF OF SLEEPING - SLEEPING TIPS IN TELUGU




కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. 
ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. 
మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకు, తల నుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.

HEALTHY BONE CARE TIPS WITH VITAMIN-D



ఎముకల బలం కోసం....!

ఎముకలు బలిష్టంగా లేకపోతే వృద్ధాప్యంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ముప్పయి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బలవర్దకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎముకల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటున్నారు వైద్యులు.

- కండరాల పటుత్వానికి, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, హార్మోన్ల పనితీరుకు కాల్షియం అవసరం. శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్లలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఛీజ్, మజ్జిగ, పెరుగు, ఆల్మండ్స్, బీన్స్‌లు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

- శరీరానికి తగినంత కాల్షియం అందించడంలో విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. పొద్దున లేస్తూనే బిజీ జీవితంలో పడిపోయే నగరజీవి శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోవడం కష్టం. అందుకని విటమిన్ డి కొరత ఉంటే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడటం ఉపయుక్తం. విటమిన్ కె, పొటాషియం కూడా ఎముకల్ని బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

- పౌష్టికాహారం ఒక్కటే ఎముకల్ని బలిష్టంగా తయారుచేయదు. శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం తప్పక అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ, ఆరోగ్యంగా ఉంచుకుంటేనే కాల్షియం కొరత ఏర్పడదు. దీని కోసం ఉదయాన్నే నడవడం, పరిగెత్తడం, వ్యాయామం చేయాలి.

- ఎముకల సామర్థ్యాన్ని దెబ్బతీసేవాటిలో మద్యపానం, ధూమపానం ప్రమాదకరమైనవి. మోతాదుకు మించి తీసుకుంటే వయసు మీద పడేలోపు ఎముకల్ని పీల్చిపిప్పి చేస్తుంది మద్యం. అందుకని మితంగా తీసుకుని, చక్కటి ఆహారాన్ని భుజిస్తే సమస్యను అధిగమించవచ్చు.

USE FISH OIL FOR BETTER MEMORY


చేప నూనెతో మెదడుకు చురుకు!

"జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలనుకుంటున్నారా? అయితే చేపలు బాగా తినండి. చేపనూనె వల్ల మెదడు పరిమాణం పెరుగుతుంది. అల్జీమర్స్ లాంటి వ్యాధులూ దరిచేరవు. వయసు పైబడిన తరువాత ఒకటి నుంచి రెండేళ్ల పాటు మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో చేపనూనె ప్రభావం ఉంటుంది. ఇందులో ఉండే ఒమెగా- 3 కొవ్వు ఆమ్లాలు అందుకు తోడ్పడతాయి'' అని పరిశోధనల్లో వెల్లడైంది అంటున్నాడు జేమ్స్. ఈయన వాషింగ్టన్‌లోని సౌత్ డకోటా విశ్వవిద్యాలయ పరిశోధకుడు.

Wednesday 29 January 2014

GENIE AND THE FISHERMEN - TELUGU COMICS STORY



సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపలకోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో రెండూ మూడు చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్‌మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి, దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొక్కటి ప్రత్యక్షం అయ్యింది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి..''కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరిని హడల కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్ర శక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతోకాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది'' అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది. ''నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయట పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా వుండాలంటే నువ్వు చావాలి'' అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి, జాలరి ధైర్యం తెచ్చుకొని ఒక్కక్షణం ఆగు. నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా?'' అన్నాడు. ''చివరి కోరికఏమిటోవెంటనే చెప్పు'' అంది భూతం కోపం గా.''నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా వున్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్ళావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని వుంది.చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం'' అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలాకాలం బంధింపబడి ఉండి, అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనా శక్తిని హరింప జేశాయి. ''అహ్హహ్హ అని పెద్దగా నవ్వుతూ మానవులకు అన్నీ సందేహాలే!'' అనుకొని ''చూడు మానవుడా..నేనెలా లోపలికి వెళ్ళానో..''అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది.వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు.

HEALTHY SKIN CARE TIPS - ARTICLE ON SKIN CARE IN TELUGU



శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏది? ప్రాణాలు నిలిపేది గుండె కాబట్టి అదే అంటారు ఏమో...! దానితో పాటు అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మనల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చర్మం అన్నిటికన్నా జాగ్ర త్తగా కాపాడుకోవలసిన అంశం అంటే అతిశ యోక్తి కాదు. చిన్న పిల్లల నుండీ పెద్ద వాళ్లవ రకూ చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేం దుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుం ది. ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పలేం. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు. కానీ చర్మం యొక్క స్థితిని మార్చలేం అని వది లేయక్కర్లేదు. అనేక జాగ్రత్తలు తీసు కోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్య వంతంగా, ఆకర్షణీయంగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అలాగే చర్మంలో కూడా పలు రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే ఎంతో మంది అవాస్తవాలను ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన పదార్థాలను వాడాలో తెలియక సతమతం అవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్ట పోతున్నారు. దానికి కారణం ఆ క్రీములలో వాడే పదార్థాలు ఎటువంటి చర్మానికి సరిపోతాయి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. వీటిపై అనేక అవాస్తవాలనూ, వాటి వెనక ఉండే నిజాలనూ ఒక సారి వీక్షిద్దాం...
అపోహ: మన చర్మంలో మార్పుల ప్రక్రియ తల్లిదండ్రుల చర్మంయొక్క మార్పులతో సమానంగా ఉంటుంది.
వివరణ: ఖచ్చితంగా తల్లిదండ్రుల జన్యుపరమైన మార్పులే పిల్లల చర్మానికి కూడా రావడానికి అధికశాతం అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమానత బాహ్య ప్రపంచంలోకి రావడం వరకే. తరువాత కాలంలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం మరియు వారి అలవాట్లే చర్మంలోని మార్పులకు కారణం అవుతాయి. కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా అలవాట్లు మార్చగలుగుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.
అపోహ: సన్‌లోషన్లపై ఉండే ూూఖీ సంఖ్య మనకు ఎంత రక్షణ కల్పిస్తుందో వివరిస్తుంది.
వివరణ: సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖVదీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖVదీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే దాని ూూఖీ సంఖ్య ఖVదీ కిరణాలను ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖVదీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.
అపోహ: సన్‌స్క్రీన్‌ లోషన్‌ మరియు మాయిశ్చరైజర్లను విడివిడిగా వాడాలి.
వివరణ: ఏ క్రీమ్‌ అయినా చర్మం యొక్క రకాన్ని బట్టే ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ అనగా సూర్యుని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపకుండా నివారిస్తాయి. మాయిశ్చరైజర్‌ క్రీములు చర్మంలో ఉండే తేమ స్థాయిని పెంచుతాయి. ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.
అపోహ: సూర్యకాంతి వలన 18ఏళ్ల వయస్సులోనే అధికంగా చర్మము సమస్యలకు గురి అవుతుంది.
వివరణ: ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాం తం బాధపడాలి అనే అపోహను నమ్మరాదు. ఎంత వయస్సు వచ్చిన వారైనా తగిన మందులను తీసు కోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు.
అపోహ: కాస్మటిక్‌ క్రీములు మీ పూర్వపు అందాన్ని తీసుకురాగలవు.
వివరణ: ఇది ఏమాత్రం నమ్మకూడదని డాక్టర్లు చెప్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొలదీ చర్మంలోని పటిష్టత, కొవ్వు తరుగుదల జరుగుతూనే ఉంటుంది. వానిపై ఎంత క్రీమ్‌ రాసిననూ వాటిని తిరిగి రానివ్వడం చాలా వరకూ సాధ్యపడదు. కాస్మిటిక్‌ క్రీములు కేవలం కొద్ది సమయం మాత్రమే చర్మాన్ని పటిష్టంగా ఉంచగలవు. అది కూడా మన చర్మపు ఆరోగ్యంపై ఆధారపడిఉంటుంది.
అపోహ: మొటిమలు వచ్చినప్పుడు మందులు వాడితే సరిపోతుంది.
వివరణ: మొటిమలు బాహ్యచర్మంపై తయార వ్వడానికి రెండు వారాల ముందు నుంచే లోపలి కణాలను బలహీనపరుస్తుంది. అందు వలన మొటిమలు వచ్చిన తరువాత అవి తగ్గడం కోసం మందులు వాడినప్పటికీ పైకి కనపడుతున్న మొటిమలను తగ్గించగలుగు తామే తప్ప లోపలి కణాలను బలహీన పరచ డాన్ని కూడా తగ్గించాలి అంటే నిర్ణీత కాలం వాడుతూనే ఉండాలి. డాక్టర్లు మొటిమలు వ్యాప్తి చెందడంలోని తీవ్రతను బట్టి మందు లు వాడవలసిన కాలాన్ని నిర్థారిస్తారు. 

NO SLEEP - DANGER TO HEALTH - SO GO TO BED WITHIN TIME



ఒకటి రెండు రోజులు సరిగ్గా నిద్రలేకపోయినా, నిద్రలేమి ఏర్పడినా శరీరంలో చురుకుతనం, ఉత్సాహం తగ్గిపోతుంది. ఆవలింతలు వస్తూంటాయి. సోమరితనం ఏర్పడుతుంది. ఒకటి, రెండు రోజులు నిద్రా సమయం తగ్గితే ఆ తర్వాత ఎక్కువ సమయం నిద్రలో గడిపి, ఆ బద్ధకాన్ని తీర్చుకుంటారు చాలామంది. అయితే ఎక్కువ రోజులు నిద్రపట్టకుండా ఉండటం, అపరాత్రివేళ మెలకువవచ్చి తిరిగి నిద్రపట్టక పోవడమన్నది ఆరోగ్యరీత్యా మంచి విషయం కాదు. నిద్రలేమి వ్యాధి కానప్పటికీ దానివల్ల ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్రెషన్‌, జ్ఞాపకశక్తి మందగించడం, మెదడు సరిగ్గా ఆలోచించలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంలాంటి లక్షణాలు ఏర్పడతాయి.
రక్తపోటు కూడా పెరిగే ప్రమాదముంది. శరీరానికి, మనస్సుకూ తగినంత విశ్రాంతి లభించనందువల్ల, మానసిక శారీరారోగ్యాలు కుంటుపడుతాయి. ఎక్కువకాలం నిద్రలేమి ఏర్పడటం వల్ల హార్ట్‌ అటాక్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎటువంటి శారీరక అనారోగ్యాలు లేకుండా నిద్రపట్టకుండా ఎక్కువరోజులు బాధపడుతున్నవారు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సూచనలు, సలహాలు పాటిస్తూ నిద్రలేమిని తొలగించుకోవాలి. ఏ కారణాలవల్ల నిద్రలేమికి గురవుతున్నారో, నిద్రాభంగమవుతోందో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం వెతికి హాయిగా నిద్రపోయే ప్రయత్నాలు చేయాలి. లేకపోతే నిద్రలేమి దీర్ఘకాల వ్యాధులకు గురిచేస్తుంది.

Tuesday 14 January 2014

CULTURAL IMPORTANCE OF SOUTH INDIAN FESTIVAL SANKRANTHI - ARTICLE IN TELUGU ON SANKRANTHI FESTIVAL CELEBRATIONS

సంక్రాంతి సందడులలో భాగంగా పల్లె వాతావరణం జంట సన్నాయిల నాదం మధ్య 
డూడూ బసవన్నల అద్భుత విన్యాసాలతో ,హరిదాసుల హరినామ సంకీర్తనలతో 
వీధులన్నీసందడులతో పల్లెసీమ పండుగ శోభను సంతరించుకుంటుంది


భోగి పండుగ రోజున సాయంత్రం 7 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు 
పోస్తారు.రేగు పండ్లతో పాటు పూలు ,చెరకు ముక్కలు ,డబ్బుల నాణాలు 
పిల్లల తల పై ధారగా పోస్తారు .ఈ పళ్లలో వున్న గుజ్జు చంద్ర తత్వానికి ,రేగు పండు గింజ భూ తత్వానికి ప్రతీక .సూర్య చంద్రులు ,భూమాత యొక్క శక్తి యుక్తులు పిల్లలకు అందాలనే ఆకాంక్ష ఈ వేడుకలో కన్పిస్తుంది .


సంక్రాంతి పండుగలో మొదటిరోజైన 'భోగి ''రోజున ఇంట్లోని పిల్లలకు ఆరోగ్యాన్ని మేధోశక్తిని ప్రసాదించమని సూర్య భగవానుడిని వేడుకుంటాము తెల్లవారుజామునే పిల్లలందరిని నిద్ర లేపి ఇంటిలోని పనికిరాని వస్తువులను అన్నింటిని కుప్పగా పేర్చి భోగిమంటలు వేస్తారు ...పిల్లలందరూ ఆ మంట చుట్టూ కూర్చుని వెచ్చ 
దనాన్నిపొందుతారు ...ఆ తరువాత తలంటు స్నానాలు చేస్తారు .సూర్య భగవానుడుని ఆరాదిస్తే అందరూ దేవతలను పూజించినట్లేనని ఈ భోగి మంట యొక్క పరమార్దం ..


తల్లి ముగ్గులు పెడుతూ ఆడపిల్లలకు సృజనాత్మకత కళా వైభవాన్ని నేర్పే విధానం 
ఈ పండుగలో మనకు కన్పిస్తుంది .తెలవారుజామునే లేచి మగువలు తీర్చే రంగు రంగుల అందాల ముగ్గులు ,వాటి పై బంతి పూలతో అలంకరించిన గోబ్బెమ్మలు,నవధాన్యాలు,ఆ రంగవల్లుల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాడుకునే గొబ్బిపాటలు ఈ పండుగలో విశేషంగా అందరినీ ఆకర్షిస్తుంది ...

ధనుర్మాసం ప్రారంభమైనప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళలో రంగవల్లులు వేస్తూ ''నెలపట్టు''పడతారు .కనుము రోజున రథం ముగ్గుతో ఈ 
నెలపట్టు ను విడుస్తారు .ఈ సంప్రదాయం ఈనాటిది కాదు .శ్రీ కృష్ణుని చెల్లెలు 
సుబద్ర ఆనాడే ముగ్గులతో యుద్ద వ్యూహాలను చూపించిందని పురాణ గాధలు 
తెలియచేస్తున్నాయి

సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణ .చుట్టూ ప్రక్కల ఇళ్లలోని ముత్తైదువులను ,ఆత్మీయులను పిలుచుకొని బొమ్మల కొలువును వేడుకగా 
చేసుకుంటారు .చిన్నప్పుడే పిల్లలకు మానవత్వ విలువలతో పాటు పురాణాలను 
సాంప్రదాయాలను తెలియచేసే క్రమంలో ఈ వేడుక జరుపుకుంటారు

ARTICLE IN TELUGU ON THE HISTORY AND TRADITIONAL IMPORTANCE OF INDIAN MUGGU / KOLAM / RANGAVALLI


మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

ARTICLE ON GODDESS SARASWATHI


|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది ఎందుకు?

ॐ పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది.మనలో కూడా ఎవరైతే సమాజంలో ఉన్న మంచి గ్రహించి చెడును విడిచిపెడతారో,అటువంటి వారిని అనుగ్రహిస్తుంది సరస్వతి దేవి. 

ॐ ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ..ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించడం, చెడును విసర్జించడం చేసే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని అర్ధం.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ హంస అంటే ఊపిరి. మనం విడిచే గాలి(నిశ్వాసను) బయటకు "సః" అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు(ఉచ్చ్వాశం) "అహం" అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఈ ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు.సః అంటే అతడు, పరమాత్ముడు అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః........ అంటూ హంసో హంసో హంససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అంటే అతడు, నేను అనేది అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ అంటే మనం. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి అధిదేవత మన సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంస వాహన అయ్యింది.

HEALTHY ADVANTAGES OF EATING REGI PANDU - REGI FRUIT


రేగుపండులో సుగుణాలు

రేగు పండులో విటమిన్ డి, ఎ, కె పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేగు పండు మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల రకాల రేగు పండ్లు లభిస్తున్నాయి. ఎండిన రేగు పండులో కాపర్, బోరాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాలు ఆస్టియోపొరోసిస్ నివారణలో ప్రధానపాత్ర వహిస్తాయి. రేగు పండు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మినరల్స్ బీపిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది. మంచి యాంటిఆక్సిడెంట్ కూడా కావడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రేగు పండులో బీ కాంప్లెక్స్‌లోని నియాసిన్, విటమిన్ బి6, ఫినోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కార్బోహైవూడేట్లు, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాల జీర్ణక్షికియకు తోడ్పడుతాయి. 

గుండె ఆరోగ్యానికి - రేగు పండులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా నిరోధిస్తుంది. అందువల్ల బీపి అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె కొట్టుకునే విధానం కూడా స్థిరంగా ఉంటుంది. రేగు పండులోని సాలిబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండులోని అధిక పొటాషియం శరీర బరువును కూడా నియంవూతిస్తుంది.

కాన్సర్ ను నిరోధిస్తుంది - రేగు పండులోని బీటా కెరోటిన్ చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటి ఆరోగ్యానికి - ఆరోగ్యవంతమైన కళ్లకి విటమిన్ ఎ ఎంతో అవసరం. రేగుపండులో విటమిన్ ఎ తో పాటు జియాక్సిథిన్ అనే ఒక ఫైబర్ కూడా రెటినా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మలబద్దకానికి - ఎండిన రేగు పండును ప్రూనే అంటారు. జీర్ణక్షికియకు తోడ్పడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఉండే సార్బిటాల్, ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణక్షికియ సామర్థ్యం పెరిగి కడుపులో కదలికలు సరైనరీతిలో జరిగి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం రేగు పండు.

నిరోధక శక్తి పెంపొందించడానికి- రేగుపండు ద్వారా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

వృద్ధాప్యం వాయిదా -రేగు పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాలిక్ యాంటిఆక్సిడెంట్, లూటిన్, క్రిప్టోక్సాథిన్, జియాక్సిథిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ప్రతినిత్యం జరిగే ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి వీలుంటుంది.

ARTICLE ON THE HISTORY OF SANKRANTHI FESTIVAL IN TELUGU


సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. 

నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది. 

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.

సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.

కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.
సంక్రాంతి, ఆధ్యాత్మికం, భోగి, కనుమ, ముక్కనుమ


Saturday 11 January 2014

THE IMPORTANCE OF COW PUJA IN INDIAN TRADITION AND CULTURE AND HEALTHY REASONS BEHIND COW PUJA




గోమాత ముక్కోటిదేవతల సమూహము. గోమాత కలియుగంలో సాక్షాత్ కామధేనువు వంటిది. కామధేనువు అనగా అడిగినదల్ల లేదనకుండా ప్రసాదిన్చునది అని అర్ధం. ఈ కలియుగంలో ఒక్కమారు గోమాత వ్రతం ఆచరిన్చినట్లయితే తప్పకుండ అనుకున్నపనులన్ని సఫలికృతము అవుతాయి.

గోపంచకమును ప్రతి పూజలోను వినియోగిస్తారు. కారణమేమనగా అది వినియోగించిన ప్రతివారు, ప్రత స్తలము శుద్ధి అవుతాయి. మనమాచరించే ప్రతి పూజలో గణపతి పూజ నుండి ప్రతిష్టాంతం వరకు పంచగవ
్యాలను వాడతారు. పంచగవ్యాలు అనగా ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , ఆవుముత్రము , ఆవుపేడ.ఈయొక్క ఐదింటిని పంచగవ్యాములన్డురు. వీటితో పంచగవ్యప్రాసన అనేపూజ చేసి అవి తీర్ధముగా తీసుకొనవలెను. ఈతీర్దము సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండ తీసుకోవలెను. అదేవిధంగా ఆవుపాలు చాలా శ్రేస్థామైనవి. చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే మంచితెలివితేటలు పెరుగుతాయి . మంచివిద్యావంతులవుతారు .
మనము తెలిసి తెలియక ఆడవారు అంటూ , ముట్టు ఇంట్లో కలిపినపాపమును , పెద్దలను దూషించిన పాపమును , సర్వపాతకములను , మహాపాతకములను , భక్తిపూర్వకముగా గోమాతను ధ్యానించిన , గోవులకు గ్రాసాములిచ్చినను , గోవులకు దాణాలిచ్చినట్లయితే , పైనచేప్పబడిన పాపములనుండి విముక్తి పొంది సర్వసంపదలు చెకూరునని శాస్త్ర ప్రమాణము . ఏకాదశి నాడు ఉదయమునే కాలకృత్యాలు నెరవేర్చుకొని గోమాత పూజ మరియు గోసేవ ఆచరిన్చినట్లయితే కాశి నగరంలో కోటిగోవులను దానము చేసినంత ఫలితము లభిస్తుంది.

SCIENTIFIC REASON / IMPORTANCE OF INDIAN CULTURE / MUGGU / KOLAM / RANGAVALLI - THE IMPORTANCE OF MUGGULU FOR WOMEN - HEALTHY REASONS FOR WOMEN ON MUGGULU




మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి.

శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం.

ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.

స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ. వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు.


THE NAMES OF SEVEN HILLS AT TIRUPATI BALAJI RESIDES - THE IMPORTANCE OF SEVEN HILLS - ARTICLE IN TELUGU ON LORD SEVEN HILLS GOD


తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా? 

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. 
ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. 
ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. 
అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. 
ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే.
 అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే.
 తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

Thursday 9 January 2014

ARTICLE IN TELUGU ON MUKKOTI EKADASI AND ITS IMPORTANCE IN INDIAN MYTHOLOGY


ముక్కోటి వైభవం!!

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు. 

వైకుంఠ ఏకాదశి రోజు.. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాలు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు. 

ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులవుతారట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేడంతో పాటు పాటించవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలన్నదే ఉపవాసంలోని ఆశయం. 

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.

LORD SRI MAHA VISHNU PRAYER


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్ 

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

Saturday 4 January 2014

LORD VENKATESWARA SWAMY PRAYER



గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా

మత్స్యకూర్మా గోవిందా

మధుసూదన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా
 
వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా

బౌద్ధకల్కిధర గోవిందా

వేణుగాన ప్రియ గోవిందా

వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా

FLOWERS COLORFUL SANKRANTHI FESTIVAL MUGGU


17 DOTS - 7 LINES - UPTO 7 DOTS



BHAGAVAD GITA SLOKAS AND ITS MEANING



హరిః ఓం 
గీత ..1వ అధ్యాయము ...21,22 శ్లోకాలు 
అర్జున ఉవాచ ...సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే౭చ్యుత 
యావతేదాన్నిరీక్షే ౭హం యోద్దుకామానవస్థితాన్ 
కైర్మయా సహ యోద్దవ్యం అస్మిన్ రణసముద్యమే.....అర్జునుడు చెప్పాడు :ఓ అచ్యుతా!యుద్దానికి తయారవుతున్న ఈ సమయంలో నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపమని కోరుతున్నాను .యుద్దం చేయడానికి సిద్ధపడి ఎవరెవరు
యుద్ద రంగంలో నిలబడ్డారో,వారిలో నేను ఎవరెవరితో యుద్దం చెయ్యబోతున్నానో
చూడాలనుకుంటున్నాను .
శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు ....అర్జునా !ఇది ని జీవితంలో ఒక గొప్ప మలుపు.ఇక నీవు అన్నీచోట్లా ,అన్నింటిలోనూ దైవికమైన ప్రయోజనాన్ని
చూడగలుగుతావు .అపవిత్రమైనది ఏదీవుండదు .అసహ్యకరమైనది ఏదీ వుండదు
ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే నువ్వు బలహీనుడివైతే నీకు బాధలు కలుగుతాయి
నువ్వు భయపడితే ,అన్నీ నిన్ను భయపెడతాయి .పరుగెత్తి పారిపోవడానికి
ప్రయత్నిస్తే ఎల్లకాలం ఒకచోటు నుండి ఇంకొకచోటుకి పరుగులు తీస్తూనే వుంటావు .ఎదుర్కో !అన్నింటిని ,శక్తితో ,ధైర్యంతో ,పట్టుదలతో ఎదిరించు.ఈ
జీవిత సమరం నుండి ,సమస్యలనుండి పారిపోవడానికి ప్రయత్నించినా మనం వాటిని తప్పించుకోలేము .నిజంగా జీవితమంటే అదే .వాటిని ఎదుర్కుని పరిష్కరించడమే సుఖం .......జీవితపు మేలిమలుపులోనీరసపడిజాలి ,దయల
పేర్లుచెప్పి అందరూ నా వాళ్ళు అనే మోహంతోయుద్దంనుండి తప్పించుకోచూసిన అర్జునిడిని కర్తవ్యబోధ చేసి జీవితంతో తలపడమని ఉద్బోదించాడు .........
ఓం పరమాత్మనే నమః

Wednesday 1 January 2014

ANCIENT IMPORTANCE OF INDIAN CULTURE FOR COW PUJA




గోవుమాలక్ష్మికి కోటి దండాలు -శ్రీ మహాభారతంలో కథలు


నృగ మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసాడు. ఆయన నిరంతరం గోదానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలుగకుండా ప్రజలను పాలించేవాడు. ఓ సారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒకరికి దానం చేసిన గోవునే మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. గోవు నాదంటే నాదని ఆ విప్రులిద్దరూ తగువులాడుకున్నారు. చివరికి రాజుగార్నే అడుగుదామనుకుని ఆ యిద్దరు బ్రాహ్మణులూ నృగ మహారాజు దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ తగాదా విని రాజుగారు విచారపడ్డాడు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. " అయ్యా! దీన్ని ముందు మీకిచ్చిన మాట నిజమే. ఇది మా ఆవులలో కలిసి మేస్తుంటే మాదేననుకుని గోపాలకులు తీసుకువచ్చారు! తెలియక నేను దాన్ని మళ్ళీ ఈయనకు దానమిచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి గోవులు నూరువేలిస్తాను. ఈ ఆవును ఆయనకు ఇచ్చేయండి" అన్నాడు మొదటి బ్రాహ్మణుడితో.

"మహారాజా! ఇది చాలా శ్రేష్ఠమైన ఆవు. నా కుమారుడు పాలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకోనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది! ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మిలా ఉంటే నాకు సంతోషం కాని, నువ్వు కోటి గోవులిచ్చినా తీసుకోను నేను" అని వెళ్ళిపోయాడా బ్రహ్మణుడు.

"అయ్యా ! మీరు కోరినన్ని రత్నాలు, మణులూ, గోవులూ, ఇస్తాను. ఈ ఆవును ఆయన కివ్వండి" అని మహారాజు రెండవ బ్రాహ్మణుణ్ణి వేడుకున్నాడు.

" ఈ ఆవు తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు" అంటూ మొండిగా ఆ ఆవును తీసుకుని వెళ్ళిపోయాడతను.

కొన్నాళ్ళు గడిచాకా నృగ మహారాజు కాలం చేసాడు. యమ భటులు యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు.

" మహారాజా! ఎన్నో పుణ్యకార్యాలు చేసావు. కాని ఒకరి కిచ్చిన గోవునే మరొకరికి దానమిచ్చి పొరపాటు చేసావు. విప్రుని మనసు కలత పెట్టావు. అందుచేత కొంచెం పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా? పుణ్యం అనుభవిస్తావా?" అని యనుడు ప్రశ్నించాడు.

"పాపమే అనుభవిస్తాను" అన్నాడు. వెంటనే తలక్రిందులుగా భూమి మీద పడ్డాడు. పడుతూ పడుతూ ఉండగా-

" రాజా! విచారించకు. కొన్నాళ్ళయ్యాకా వాసుదేవుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత సౌఖ్యం కలుగుతుంది" అన్నాడు యమధర్మరాజు.

నృగుడు భూమి మీద తొండ రూపంలో తిరగసాగాడు. చాలా రోజులు గడిచాకా ఒకనాడు విధివశాత్తూ ఒక నూతిలో చేరాడు. ఆ నూతిలోకి వచ్చిన మరుక్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. తనను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు.

నూతి దగ్గరకు వచ్చిన ప్రజలు ఆ తొండను చూసి, ' ఇది ఇందులో ఉంటే నీళ్ళు పాడైపోతాయి ' అనుకుని పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి పైకి లాగబోయారు.

కాని అది కదిల్తేగా! వాళ్ళకు భయం , ఆశ్చర్యం కూడా కలిగాయి. గబ గబ వెళ్ళి సంగతంతా కృష్ణభగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ నూతి దగ్గరకు వెళ్ళి ఆ తొండను బయటకు తీసాడు. అప్పుడు నృగుడు దివ్యరూపం ధరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు.

" కృష్ణ స్పర్స వలన నృగుడికి ఉత్తమగతి కలిగినట్టే సజ్జనసాంగత్యం వల్ల సర్వసుఖాలూ కలుగుతాయి" అని మాంధాతృడికి బృహస్పతి చెప్పినట్టు మహాభారతంలో ఉంది.

దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళం లోంచి సురభి అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు హిమవత్పర్వతం మీద సంచరిస్తూ ఉండగా ఒక దూడ తల్లి దగ్గరకు వెళ్ళి పాలు తాగటం మొదలుపెట్టిం ది. అప్పుడా పాలనురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకుని మూడోకన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిలవర్ణం వచ్చింది. దాంతో అవన్నీ భయపడి అక్కడినుంచి పారిపోయాయి.

అప్పుడు బ్రహ్మ వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసాడు. ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచీ ధూర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభచిహ్నం ఉంటుంది.

శివుడు ప్రసన్నుడు కావడంతో ఆవులన్నీ మళ్ళీ ఆ పర్వతం మీదకు వచ్చాయి. వాటిని చూచి అవి సర్వాత్రా సంచరించగలవి గానూ, మిగిలిన గోవులకంటే ఆ కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగానూ వరమిచ్చాడు శివుడు.

ఈనాటికీ గోవుల్ని లక్ష్మీస్వరూపాలుగా ఆరాధించడం , గోపంచకాన్ని పవిత్రమయినదిగా భావించడం జరుగుతోంది. భోజనం చేసే ముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యమని మనవాళ్ళు భావిస్తారు.

LORD SAI BABA BHAKTHI PRAVACHANALU - SAI BABA TEACHINGS IN TELUGU




బాబా ప్రవచనములు:

1. భక్తులకు కావలసినది మంత్రోపదేశం కాదు: భగవంతునిపై లేదా తన గురువుపై స్థిరమైన విశ్వాసం. (శ్రద్ధ) , మరొకటి సంతోషం, పట్టుదలతో కూడిన ఓరిమి (సబూరి). ఈ రెండు దేవునిపై లేదా గురువుపై నిలిపిన నాడు వారి మనోద్రుష్టి భక్తునిపై నిలిపి భక్తుని ఉద్దరిస్తారు. 

2. శ్రద్ధ, ఓరిమి ఉన్ననాడు వేరే విజ్ఞానం, శాస్త్రాలు అవసరం లేదు.

3. ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమౌతున్ది. ధ్యానించే నివే, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరే వేరేగా కాక సర్వగతమైన చైతన్యం అనుభవం అవుతుంది.

4. ఇతరుల దోషాలు ఎంచకు. ఆలా చేస్తే భగవంతుడు నీ దోషాలు ఎంచుతాడు. సాటివారిని కొద్దిగా నిందించినా, నరకంలో శిక్షలు తప్పవు.

5. సుఖదు:ఖాలు మనోకల్పితాలు. సర్వం ఈశ్వర మయము అని, ఈశ్వర ప్రసాదం అని తలచేవాడు ఏ పరిస్తితిలో అయినా ఆనందంగా ఉంటాడు.

6. చేసిన కర్మకు అనుభవించక తప్పదు. కష్టాలకు భయపడి ముందే చావాలి అనుకుంటే, చేసిన పాపాలకు తోడు ఆత్మహత్య పాతకం కూడా తోడు అవుతుంది.

7. అర్హత లేని వారికీ ఆత్మజ్ఞానం లభించదు . లౌకిక విషయాల పైన మోహం నశిస్తే కానీ ఆత్మజ్ఞానం లభించదు.

8. జ్ఞానం కావాలంటే, పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ది, అహంకారము -- విటన్నిటిని భగవంతుడికి సమర్పించాలి.

9. సద్గురువు మిద ప్రీతీ పెరిగిన కొద్ది, భక్తులకు ధనమ్ మిద ప్రీతీ తగ్గుతుంది.

10. నా వద్దకు ఎవరు వారికి వారు రాలేరు. నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను.

11. నా వద్దకు మొదట అందరు కోర్కెల తోనే వస్తారు. కానీ, కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక, నన్ను అనుసరించి మంచి మార్గానికి వస్తారు.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

PUT CHECK TO DIABETES DISEASE - SUGAR DISEASE TO BE CURED BY FOLLOWING TIPS ONLY AFTER DOCTOR'S ADVISE



 షుగర్ వ్యాధికి చెక్‌పెట్టండి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పుత్తూరు తైలంవారి 'డయాకేర్-బి' ఔషధం చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని తయారీదారులు చెబుతున్నారు. భారతదేశంలో తొలిసారిగా రూపొందించబడిన ఈ ఔషధం అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్ల ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు మధుమేహం లేనివారు కూడా ఈ డయాకేర్-బి ని వాడితే ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చని, ఇది అన్ని అపోలో మందుల దుకాణాల్లో లభిస్తుందని పుత్తూరు తైలం వారు చెబుతున్నారు.

ప్రస్తుతకాలంలో మధుమేహం కారణంగా అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన, శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం వలన, ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వలన, బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.

డయాకేర్-బి పాత్ర

మధుమేహ నివారణలో ఎలాంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి ఔషధం డయాకేర్-బి. తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా సంపూర్ణ ఉపశమనాన్ని పొందుతారు. ఈ ఔషధంలోవాడిన దాల్చిన చెక్కపై అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిశోధనలు జరిగాయి. ఇది ముఖ్యంగా రక్తంలో గల చక్కెర(గ్లూకోజ్)ను జీవకణాలకు అందించటంలో అద్భుతమైన ప్రతిభను చూపుతుంది. డయాకేర్-బి ఇన్సులిన్‌లా పని చేస్తుంది.

ఇంకేం చేస్తుంది?

టైప్1, టైప్-2 రకాల మధుమేహంలోనూ డయాకేర్-బి'వాడవచ్చు. అతిమూత్రం, అలసట, ధాతుక్షయము, అరికాలి మంటలు, తిమ్మిర్లు రావడం, అధిక దాహం, ఎక్కువ ఆకలి, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలను డయాకేర్-బి తక్షణమే నివారించగల శక్తిగలదు. మధుమేహం కలవారికి లైంగిక శక్తిని పెంచగలిగే ఔషధం కేవలం డయాకేర్-బి ఒక్కటే. ఈ ఔషధం వాడటంతో పాటు 15-20 నిమిషాలు పాటు వ్యాయామం/ యోగా/ ప్రాణయామం లేదా 2 కి.మీ. నడవడం, రాత్రిపూట అల్ఫాహారం తీసుకోవడం చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.

విశేషాలు

ఇది మధుమేహ నివారణ కోసమే తయారుచేసిన ఔషధం.

టైప్-2 ఉన్నవారు ఈ డయాకేర్-బి వాడటం వల్ల తమ సామాన్య జీవితాన్ని తిరిగి పొందగలరు. వీరిలో 90శాతం మందికి సంపూర్ణ ఉపశమనం కలుగగలదు.

డయాకేర్-బి హెర్బల్ ప్రాడక్ల్ కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ వారు ఆమోదించిన జీఎంపీ సర్టిఫైడ్ ప్రాడక్ట్ ఇది. క్యాప్సూల్ రూపంలో అన్ని మెడికల్ షాపులలో లభిస్తుంది.
టైప్-1 ఉన్నవారికి ఈ డయాకేర్-బి వాడుతూనే క్రమేపీ ఇన్సులిన్ మోతాదును (డోస్) తగ్గించు కుంటూ కేవలం డయాకేర్-బి మీద ఆధారపడి ఉపశమనం పొందవచ్చు.

వాడే విధానం

టైప్-1(ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం, రాత్రి అల్పాహారానికి 15-30 నిమిషాల ముందు 1 క్యాప్సూల్‌ను తీసుకోవాలి. టైప్-2(నాన్- ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం మరియు రాత్రి అల్పాహారానికి అరగంట లేదా పావుగంట ముందు 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఒకవేళ మధుమేహం రాకుండా ఉండేందుకు తీసుకోవాలనుకుంటే రోజూ ఉదయం, రాత్రి ఒక క్యాప్సూల్ చొప్పున 3 నెలలు వాడితే మధుమేహాం రాకుండా నివారించవచ్చు.
పిల్లలకు: తినడానికి అరగంట ముందు రోజుకు 1 క్యాప్సూల్ వాడవచ్చు. అయితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

గమనిక: నివారణ కోసం మెడిసిన్(ప్రివెన్షన్) వాడేవారు 15-30 రోజులకోసారి షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే మంచి పరిష్కారం దొరుకుతుంది.

పుత్తూరు తైలం: కీళ్లు, కండరాలు, ఎముకలు, బెణుకు, నరం, నడుం, మెడ మొదలైన అన్ని రకాల నొప్పులకు పుత్తూరు తైలం మరియు పుత్తూరు బామ్ చక్కగా పనిచేస్తుంది.

డిస్నోర్: గురక నివారిణి:

గురక పెట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్దకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్ల వంటివి ఉన్నప్పుడు గురక పెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా ఈ అలవాటు ఎక్కువే. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నా దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకే డిస్నోర్-గురక నివారిణి సిరప్ 10 ఎం.ఎల్. లేదా రెండు టీస్ఫూన్లు తాగితే అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను విరేచనాల ద్వారా బయటకు పంపిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ నిర్మూలనకు కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్లీన్ టీ: నోటి దుర్వాసనను పోగోడుతుంది. పళ్లు పుచ్చకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎనామిల్ కోటింగ్ పోకుండా చూస్తుంది. పళ్లపై మరకలను పోగొడుతుంది. దంతక్షయానికి చక్కటి పరిష్కారం చూపుతుంది.


SANKRANTHI LAMPS MUGGU


THE MEANING BEHIND WEARING PEACOCK FEATHER BY LORD SRI KRISHNA




శ్రీ కృష్ణుడు నెమలిపించాన్ని ధరించడంలో ఆంతర్యము ....సృష్టిలో సంభోగం చేయని ప్రాణి నెమలి మాత్రమే .శ్రీ కృష్ణునికి 16 వేలమంది గోపికలు .అన్నివేల
మంది భామలతో శ్రీ కృష్ణుడు అల్లరిచేసి ఆడాడు .అంతవరకే మెలిగాడు .ఆ విషయాన్ని తెలియచేయటమే శ్రీ కృష్ణుడు ధరించిన నెమలి పింఛం భావం .ఐతే శ్రీ కృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు .వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా వున్నానని పదే పదే చెప్పటమే నెమలిని ధరించటము.నెమలి 
అంత పవిత్రమైనది కనుకే మన జాతీయ పక్షి అయింది ....ఓం పరమాత్మనే నమః