WORLD FLAG COUNTER

Flag Counter

Monday 30 November 2015

BRIEF INFORMATION ABOUT SOMESWARA SWAMY TEMPLE - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


సోమేశ్వరస్వామి దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా

భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది; చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. చంద్ర-ప్రతిష్ట అగుటచే పొర్ణమికి శ్వేతవర్ణంతోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంతోనూ ప్రకాశించుట ఈ లింగ మహత్యం.
ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద/గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో దర్శనమిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉపస్థితమై ఉన్నది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారమును దర్శించవచ్చును. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
* స్థలపురాణం
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్రప్రతిష్టితమని విశ్వసించబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

DETAILED INFORMATION ABOUT BOPPAI FRUIT - PAPAYA FRUIT HEALTH TIPS IN TELUGU BY SRI SRAJU NANDA GARU



బొప్పాయితో బోలెడు లాభాలు BY SRI SRAJU NANDA GARU

నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. 
హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. ఈ పండు తింటే గర్భస్రావం అవుతుందని, గర్భిణులు తినకపోవడమే మేలని పెద్దలు చెపుతుంటారు.


పుట్టు పూర్వోత్తరాలు... 

బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది.
రోగ నిరోధక శక్తి... 
వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
ఉపయోగాలు... 
* బొప్పాయి మలబద్ధకాన్ని 
పోగొడుతుంది.
* ఆహారాన్ని వెంటనే 
అరిగేలా చేస్తుంది.
* టీబీని నివారిస్తుంది. 
* రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* రక్తంలోని దోషాలను నివారిస్తుంది.
* రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది.
* వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
* కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
జీర్ణక్రీయ వేగవంతం... 
బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.
బ్రేక్ ఫాస్ట్‌గా బొప్పాయి... 
* బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది.
* బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.
నీళ్ల విరేచనాలకు 
నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
బొప్పాయి పాలతో ఎంతో మేలు 
10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.
బొప్పాయి ఆకులతో వైద్యం 
బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.
బీపీ తగ్గిస్తుంది 
రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు : బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్‌ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.
ఔషధంగా...
* అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
* వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.
* బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
* బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
* ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.
సౌందర్య సాధనంగా...
* బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
* బ్యూటీక్రీమ్‌లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు.
* బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్‌గా ఉపయోగపడుతాయి.
* బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది. 
* బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్‌లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది. 
* బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.


PANCHARAMALA PUTTUKA - STORY OF PANCHARAMA KSHETRALU


 పంచారామాల పుట్టుక

శ్రీ కాళహస్తి , శ్రీ శైలము , ద్రాక్షారామం , అనే మూడు శివలింగ క్షేత్రాల మధ్యన ఉన్న ప్రదేశంను "త్రిలింగ దేశమని" ఇక్కడ ప్రజలను త్రిలింగులని పిలిచెడివారు . క్రమంగా రూపాంతరం చెంది, తెలుంగుగాను, మరి కొంత కాలమునకు తెలుగువారు గాను మారారని మన పూర్వీకులు తెలియజేసినారు . త్రిలింగ దేశమున "పంచరామాలు" అనే ప్రసిద్ధమైనఐదు శివ క్షేత్రాలు ఉన్నాయి. అవి అమరారామము (అమరావతి), సోమారామము(భీమవరం), క్షీరారామము (పాలకొల్లు), ద్రాక్షారామము(తూర్పు గోదావరి జిల్లా) మరియు కుమారారామం(సామర్లకోట).

పంచ + ఆరామాలు = పంచారామాలు

ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు.

దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

" శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః "

‍ ‍ ‍ ‍ ‍ ‍ - స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

01. దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
02. కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
03. క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
04. భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
05. అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.

USE PAPAYA MILK TO REMOVE WARTS - PULIPIRI KAYALU


పులిపిరికాయలు... బొప్పాయి పాలతో రాలగొట్టండి.

శరీరంపై చిన్నచిన్న పొక్కులుగా వచ్చే పులిపిరికాయలు కాస్త గట్టిగా కూడా ఉంటుంటాయి. ఈ పులిపిర్లు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్లపై వస్తుంటాయి. ఇవి వైరస్ క్రిముల వల్ల కలుగుతాయి. వీటితో బాధ లేకపోయినప్పటికీ ముఖంపై వస్తే చూసేందుకు ముఖం వికృతంగా ఉంటుంది. వీటిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...
బొప్పాయి చెట్టు పాలను పులిపిరికాయల మీద రాస్తూ వుంటే క్రమేపీ అవి రాలిపోతాయి. ఇంకా చిత్రమూలము వేరును నీటిలో అరగదీసి, ఆ గంధమును పులిపిరికాయల మీద రాస్తుంటే తగ్గుతాయి.
సబ్బు, సున్నము రెండూ సమపాళ్లలో కలిపి, పులిపిరికాయలపై అద్ది ఉంచుతుంటే కొన్ని గంటలలో ఇవి చర్మము నుండి ఊడిపోవడం జరుగుతుంది.

IMPORTANCE OF KARTHIKA SOMAVARAM IN TELUGU


కార్తీక సోమవారం

శివునికి పరమపవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

ఈ వారంలో ముత్తౖదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.

సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.

శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది.

EATING FOOD FACTS ACCORDING TO HINDU CULTURE AND TRADITIONS


భోజన వేళలో శుభాశుభ శకునాలు

శుభం, అశుభం ఫలితాలు మనకు కలిగే

ముందు అనేక రకాలైన అనేక శకునాలు వాటి

గురించే ముందే సూచిస్తుంటాయి. అలాంటి

శకునాలు అనేకం వున్నాయి. 


భోజన సమయంలో ఎలాంటి శకునం, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందో తెలుసుకుందాం. భోజనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే మంచి
జరుగుతుంది.

పచ్చదనం, సమృద్ది కలుగుతుంది.

భోజనం చేసేటప్పుడు కాకి వచ్చి
తలపై కూర్చుంటే అశుభం. అలాగే కాకి భోజన
సమయంలో కుడిభుజంపై వాలితే కడుపులో
వికారం, ఎడమ భుజంపై వాలితే కులనాశకుడవటం
జరుగుతుందని సూచన.

భోజనం చేసే వేళలో కుక్క ఏడుపు వినిపిస్తే
అశుభసూచన. అలాగే అవి మొరుగుతే, ధాన్యం
దొంగతనం అవుతుందనటానికి సంకేతం.

ఏదైనా వివాదం భోజనం చేస్తున్నప్పు ప్రారంభమైనా అది
అశుభం. ఆ ఇంట్లో అన్నానికి కొరత
ఏర్పడుతుంది. తినేటప్పుడు ఏడుపు శబ్దం
వినిపిస్తే, విన్న వారికి ఆరోగ్యం దెబ్బ తింటుందని
సూచన.

రొట్టె ఎక్కువగా కాలి మాడిపోతే ఆహార నష్టం
జరుగుతుందని గ్రహించాలి.
ఆ సమయంలో పాము కనిపిస్తే అశుభంగా
పరిగణిస్తారు.

భోజన సమయంలో పాము కనిపిస్తే
భోజనంలో విషం కలిసిందన్న అనుమానానికి కారణం అని పండితుల అభిప్రాయం.

ఇవి భోజన వేళలో శకునాల వల్ల కలిగే, శుభ, అశుభ పరిణామాలు. శకునాలు మనకు సూచనలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు, అశుభ శకునాల
నుంచి పరిగ్రహించుకొనుటకు మార్గాలు కూడా
ఉంటాయి.

సూచనలుగా శకునాలను గ్రహించి
జాగ్రత్త వహించటం ఎంతైనా మేలు.

VIBHUDHI MAHATYAM - IMPORTANCE OF VIBHUDHI IN+ HINDU PUJA


విభూది మహత్యం 

మనుజుల లిఖితములను నుదుట రాసి బ్రహ్మ మమ్ములను సృష్టించెను.
దాని ఆధారముగా విష్ణువు పోషణ నియమకముల చేసెను.
తర్వాతి భాగమంతయు లయ కారక క్రియలకు అనుగ్రహ మీతడే ఈశ్వరుడు .
మనుజులకు లలాట లిఖితత్వం బులకు , విభూదులను బూసి ,
పైన రాసిన రాతల పరివేష్టితంబులను పాప ఖర్మలను, విముక్తి చేయు ,
అభిషేక ప్రియుడు యీతడు ...
మూడు రూపములు కలవాడు ముక్కంటి ,
త్రికాలములకు , కాలముల విభేదములుగా కనిపించు వాడు ఇతడు ..
త్రిశూల ధారి ,త్రినేత్ర స్వరూపుడితడు
త్రిపుండ్రములనే ధరింప చేసి తన ఆలయమున దర్శన మిచ్చి ,
సర్వ పాపంబుల ప్రక్షాళన చేయు విశ్వేశ్వరుడు యీతడు...
ఖర్మలన్నింటిని అగ్ని తోడ శుద్ధి చేయగా మిగిలినది భస్మము..
ఆ భస్మ లేపనములే తాను బుచ్చి మారని వర్చస్సుని ..
సృష్టించిన వాడు లయకారుడు ఈతడే ...
వారి యొక్క పరివేష్టిత విభూదులే లోక సంరక్షణలే గంగ,పార్వతీ ప్రదాయుడై ,
అలరారు వారు శైవ క్షేత్రవాసులు ...
జలముల భస్మమును గల్పి తనని అభిషేకము చేసి అది మారు తీర్ధముగా బుచ్చినన్
వ్యాధి,అపమృత్యు దోషం,అరిషడ్వర్గం ,సర్వ ఇంద్రియ ప్రకోపములను ,
పరిమార్చగలిగిన శక్తి భస్మంబుదే..
మోక్ష యోగంబులకు విభూది ధారణ మహత్తర ..యోగంబే ...
నిరాడంబర సంబరములు ఇచ్చు విభూది తీర్థంబు ఇదే
ఆ మహేశ్వర తత్వమే ఇది........... ...శ్రీమాత్రే నమః....

KARTHIKA SOMAVARAM - LORD SIVA PRAYER


కార్తీక సోమవారం శుభాకాంక్షలు
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ ||
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ ||
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ |
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ ||
యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ ||
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

OM NAMAH SIVAYA TELUGU PRAYER


ఓం శివయ ఓం శివాయ ఓం నమశ్శివాయ
చిదంబరాన చిరువనాన
నగరాజ తనయ నాన రత్న విభూషితయై
నటనమాడె నటరాజు నాగభూషణుని కూడి
శివజ్యోతి తత్వమై అఖండ జ్యోతియై అనంతమంత ఆక్రమించె
అర్ధనారీశ్వరియై సృష్టికి నాందిపలికె
ఆనంద స్వరూపునితో కూడి అంబ అమృతవర్షిణియై
శుద్ధ విద్యా సమన్వితుని శక్తియై ఙ్ఞానసముదాయినియై
మాయాశక్తిసంభూతిని మాయాశక్తియై కాలచక్రము త్రిప్పె
పంచాక్షరుని ప్రణవనాదమై శూన్యమెల్లనిండె
నటన సాగె శివ శక్తులేకమయి
పావన సురగంగ పరవళ్ళతొ పద్మముఖి పార్వతిపై ముత్యాలొలికె
భవుని నాగాభరణాలు భవాని కంఠాభరణాలతొ వింత వింత రంగులొలికె
వ్యాఘ్ర చర్మధారి కదలికలు మహా వ్యాఘ్రమై తోచె
కనకాంబరధారి కనక మణిమయ కాంతులతొ కలసిపోయె
మహా భయంకర ఢమరుక ధ్వనులను తన హస్తవిన్యాసములతొ శ్రుతి జేసె
శివకామసుందరి శివకామియై సుందరేశుని కూడి
అసురశక్తులను తనపాదముల నణచి నటనమాడే
వాణి వీణ మీట నారాయణుండు నాదమూద
బ్రహ్మ తాళమేయ నారదుని సామగానములొ
సుర గంధర్వ కిన్నెరాదులు వంతపాడ
సత్యం శివం సుందరమై నటనమాడె
ఓం నమశ్శివాయ ఓం శివాయ ఓం శివయ

ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !! 
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!! 
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!! 
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 
ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః
ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!
(శివయ్య అభిషేక ప్రియుండు, ఆయనకు చేసే అభిషేక ఫలితాలు) 
శివుని శిరమున కాసిన్ని నీళ్లుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడి గాడి పసర
మల్ల సురశాభి వానింట మల్లెచెట్టు
నెయ్యి - కీర్తి, ఆరోగ్యం
తేనె - తేజస్సు
చెరకు రసం - ధన సంవృధ్ది
పంచదార - దుఃఖ నాశనం
కొబ్బరి నీళ్ళు - సర్వసంపదలవృద్ది
భస్మజలం - మహాపాప వినాశం
నవరత్న జలం - ధనధాన్య బహుపుత్రలాభం
మామిడి పళ్ల రసం - చర్మవ్యాదుల నిర్మూలనం
పసుపు నీళ్లు - సౌభాగ్యం
నువ్వుల నూనె - అపమృత్యు భయ నాశనం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
రుద్రాక్షోదకం - ఐశ్వర్య ప్రాప్తి
గరిక, వట్టివేరు జలం - ధన కనక వస్తువాహనం

SRI SATYANARAYANA SWAMY VRATHA KALPAM - PUJA VIDHANAM



శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము.

పూజా విదానం.

శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంచనమ్
ఆచమనం: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః అనుచూ నీళ్ళను క్రిందకు వదల వలెను.

(తదుపరి నమస్కారము చేయుచు ఈ క్రింది మంత్రములను పఠించవలెను)
ఓం గోవిందాయనమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః , ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.

ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామము చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను.

సంకల్పమ్: మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాఙ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్విదీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.. సంవత్సరే.. ఆయనే.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే.. శుభనక్షత్రే,శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్.. గోత్రః.. నామధేయః.. ధర్మపత్నిసమేతః శ్రీమతః.. గోత్రస్య.. నామధేయస్య ధర్మపత్నీసమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్వధ పురుషఫలావ్యాప్త్యర్ధం, చింతితమనోరథ సిద్ధ్యర్ధం, శ్రీసత్యనారాయణముద్దిశ్య శ్రీసత్యనారాయణప్రీత్యర్ధం అనయాధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే, ఆదౌనిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగకల శారాధానం కరిష్యే.

కలశారాధన: (కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).
శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీ సత్యనారాయణ స్వామి పూజార్ధం దురితక్షయ కారకాః
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.

గణపతి పూజ

మం: ఓం అసునీతే
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
శ్రీ మహా గణాధిపతయే నమః |
ధ్యానం సమర్పయామి.
ఆవాహయామి ఆసనం సమర్పయామి |
పాదయో పాద్యం సమర్పయామి |
హస్తయో అర్గ్యం సమర్పయామి |
శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
శ్రీ మహాగణాదిపతయే నమః |
శుద్దోదక స్నానం సమరపయామి.
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం:
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగనాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

ప్రాణాప్రతిష్ఠాపనమ్
ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణుమహేశ్వరా ఋషయ, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠాజపే వినియోగః,
కరన్యాసమ్
హ్రాం అంగుష్ఠాభ్యాంనమః,
హ్రీం తర్జనీభ్యాంనమః,
హ్రూం మధ్యమాభ్యాంనమః,
హ్రౌం కనిష్ఠికాభ్యాంనమః,
హ్రః కరతలకర పృష్ఠాభ్యాంనమః,
హ్రైం అనామికాభ్యాంనమః.

అంగన్యాసమ్:

హ్రాం హృదయాయనమః,
హ్రీం శిరసేస్వాహా,
హ్రూం శిఖాయైవషట్,
హ్రైం కవచాయహుం,
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః ఆస్తృయఫట్
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానం

శ్లో: ధ్యాయోత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం
గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం
శ్రీసత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహనమ్

మం: ఓం సహస్రశీర్షాపురుషః, సహస్రాక్షస్సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ఠ ద్డశాంగులమ్
శ్లో: జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థ మోంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి.

ఆసనమ్

మం: ఓం పురుష ఏ వేదగం సర్వం, యద్భూతం యచ్ఛభవ్యం
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతి రోహతి
శ్లో: కల్పద్రుమూలే మణిమేదిమధ్యే సింహాసన్మ్ స్వర్ణమయం విచిత్రం
విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత,
శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి.

పాద్యమ్

మం: ఏతావానస్య మహిమాఅతోజ్యాయాగ్శ్చపూరుషః
పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతందివి.
నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి.

ఆర్ఘ్యమ్

మం: త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదోస్యేహాభవాత్పునః
తతోవిష్పజ్వ్యక్రామత్ సాశనానశనే అభి
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః
మయా నివేదితో భక్త్యా హ్యర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయమ్

మం: తస్మాద్విరాడజాయత, విరాజో అధి పూరుషః
స జాతోత్యరిచ్యత, పశ్ఛాద్భూమి మధోపురః
మందాకిన్యాస్తుయద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ఢఃఆచమనీయం సమర్పయామి.

స్నానమ్

మం: యత్పురుషేణ హవిషా, దేవా యఙ్ఞ మతస్వత,
వసంతో అస్యాసీ దాజ్యం, గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః.
శ్లో: తీర్ధోదకై: కాంచనకుంభసం స్థై
స్సువాసితై ర్దేవ కృపారసార్ద్రైః,
మయార్పితం స్నానవిధిం గృహాణ
పాదాబ్జ నిష్ఠ్యూత నదీప్రవాహ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః స్నపయామి.

పంచామృతస్నానమ్

(పాలు) ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్ణియం. భవా వాజస్య సంగధే: (పెరుగు) దధిక్రాపుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్య వాజినః, సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషత్: (నెయ్యి) శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః (తేనె) మధువాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః, మాధ్నీర్నస్సంత్వోషధీః, మధుసక్తముతోషి మధుమత్పార్ధివగం రజః, మధు ద్యౌరస్తు నః పితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతునః, (శుద్ధోదకం) స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే, మధుమాగం అదాభ్యః.
శ్లో: స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ
అనాధనాధ సర్వఙ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.

శుద్ధోదకస్నానం

ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే,
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః,
ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో
యస్యక్షయాయ జిస్వథ, ఆపోజనయథాచనః.
శ్లో: నదీనాం చైవ సర్వాసా మానీతం నిర్మలోదకం
స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

వస్త్రమ్

మం: సప్తాస్యాసన్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః
దేవాయద్యఙ్ఞం తన్వానాః, అబధ్నన్పురుషం పశుం

శ్లో: వేదసూక్త సమాయుక్తే యఙ్ఞసామ సమన్వితే
సర్వవర్ణ ప్రదే దేవ వాససీ తే వినిర్మితే
శ్రీ సత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

యఙ్ఞోపవీతమ్

మం: తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే

శ్లో: బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ భగవాన్ విష్ఠోసర్వేష్టపలదో భవ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః యఙ్ఞోపవితం సమర్పయామి.

గంధమ్

మం: తస్మా ద్యఙ్ఞా త్సర్వ హుతః సంభృతం వృషదాజ్యం
పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే

శ్లో: శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః దివ్యశ్రీచందనం సమర్పయామి.

ఆభరణమ్

మం: తస్మాద్యఙ్ఞా త్సర్వ హుతః ఋచస్సామానిజజ్ఞిరే
చందాగ్ సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

శ్లో: హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి.

పుష్పమ్

మం: తస్మాద్శ్వా అజాయంత, యేకే చోభయా దత:
గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మా ఙ్ఞాతా అజావయః

శ్లో: మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో
మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, పుష్పాణి సమర్పయామి.

అథాంగపూజా

ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
అనఘాయ నమః జానునీ పూజయామి
జనార్ధనాయ నమః ఊరూ పూజయామి
విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
శంఖ్చక్రగదాశార్జ్గపాణయేనమః నమః బాహూన్ పూజయామి
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్తృం పూజయామి
కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి
సహస్రశిరసే నమః శిరః పూజయామి
శ్రీ సత్యనారాయణస్వామినే సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం శౌరయే నమః ఓం చోంఅక్రపాణయే నమః ఓం జనార్ధనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం వామనాయ నమః ఓం ఙ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం ఆత్మజ్యోతిషే నమః ఓం శ్రీ వత్సాంకాయ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం సర్వలోకపతిప్రభవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలఙ్ఞానాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వఙ్ఞాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షికాయ నమః ఓం హరిణే నమః ఓం శార్జినే నమః ఓం హరయే నమః ఓం శేషాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం సహస్రభాహవే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అక్షరాయ నమః ఓం క్షరాయ నమః ఓం గజారిఘ్నాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం ఆచంచలాయ నమః ఓం శంఖపాణయే నమః ఓం కేశిమర్ధనాయ నమః ఓం కైటభారయే నమః ఓం అవిద్యారయే నమః ఓం కామదాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం హంసశత్రవే నమః ఓం ఆధర్మశత్రవే నమః ఓం కాకుత్థ్సాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం నీలాంబుదధ్యుతయే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిత్యానందదాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం నిర్వకల్పాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథివీనాథాయ నమః ఓం పీతవాససే నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం శ్రీమతే నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం యఙ్ఞమూర్తయే నమః ఓం అమేయాత్మనే నమః ఓం వరదాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం సమదృష్టయే నమః ఓం సనాతనాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం అసురాంతకాయ నమః ఓం సర్వలోకానామంతకాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతవిక్రమాయ నమః ఓం మాయాధారాయ నమః ఓం నిరాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం ధరధరాయ నమః ఓం నిష్కళంకాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం మహోదరాయ నమః ఓం పుణ్యకీర్తయే నమః ఓం పురాతనాయ నమః ఓం త్రికాలఙ్ఞాయ నమః ఓం విష్టరశ్రవసే నమః ఓం చతుర్భుజాయ నమః శ్రీ సత్యనారాయణస్వామియే నమః
శ్రీ సత్యనారాయణస్వామియేనమః నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.

ధూపమ్

మం: యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్
ముఖం కిమస్య కౌ బాహూ కాపూరూ పాదావచ్యేతే

శ్లో: దశాంగం గుగ్గూలూపేతం సుగంధంసమనోహరం
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రపయామి.

దీపమ్

మం: బ్రాహ్మణోస్యముఖమూసిత్ బాహూరాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

శ్లో: ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నిన యోజితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యమితిమిరాపహమ్
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

నైవేద్యమ్

మం: చంద్రమా మనసోజాతః చక్షస్సూర్యో అజాయత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో: సౌవర్ణస్థాలిమధ్యేమణిగణఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్
భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాన్ చోష్యంమన్నం నిధాయ
నానాశాకైరూపేతం దధిమధు సగుడక్షీర పానీయయుక్తం
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి
రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్.
ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్.
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణమసి,
ఓం ప్రాణాయాస్వాహా - ఓం ఆపానాయస్వాహా - ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయ స్వాహా - ఓం సమానాయ స్వాహా - ఓం బ్రహ్మణేస్వాహా
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, మహానైవేద్యం సమర్పయామి
అమృతాపిధానమసి, ఉత్తరపోశనంసమర్పయామి.
హస్తౌప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్

మం: నాభ్యా ఆసీదతరిక్షంశీర్ ష్ణోద్యౌస్సమ వర్తత
పధ్భ్యాం భూమిర్ధిశశ్శ్రోత్రాన్ తథాలోకాగం అకల్పయన్

శ్లో: పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనమ్

శ్లో: నీరాజనం గృహాణేదేవం పంచవర్తి సమన్వితం
తేజో రాశిమయం దత్తం గృహాణత్వం సురేస్వర.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్ప

మంత్రపుష్పమ్

శ్లో: ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైవ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణోదదాతు
కుభేరాయ వై శ్రవనాయ మహారాజాయ నమః
ఓం తద్భ్రహ్మాం ఓం తద్వాయః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం
ఓం తద్గురోర్ణమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యఙ్ఞస్త్వం వషట్కార స్త్వమింద్ర స్త్వగం రుద్రస్తం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరామ్. నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారమ్

శ్లో: యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రిహిమాం కృపయాదేవ శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం
సంసారసాగరాన్మాం త్వంముద్దరస్వ మహాప్రభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి.

సర్వోపచారమ్

ఛత్రం సమర్పయామి. చామరం సమర్పయామి. గీతంశ్రావయామి,నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

ప్రార్ధన

శ్లో: అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్
సగుణం చ గుణాతీతం గోవిందం గరుడఢ్వజం
జనార్ధనం జనానందం జానకీవల్లభం హరిమ్
ప్రణామామి సదా భక్త్యా నారాయణ మజం పరం
దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే
విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్
సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రార్ధనా నమస్కారమ్ సమర్పయామి.

ఫలం

శ్లో: ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ
తేన మే సఫలావాప్తిర్భవే జ్జన్మని జన్మని
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి.
శ్లో: యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం.
శ్లో: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్సర్వాత్మకః

శ్రీ సత్యనారాయణ స్సుప్రీతోవరదో భవతుః
శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి.

DAILY MORAL RULES TO FOLLOW BY EVERYONE



పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం.

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు.

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

Saturday 28 November 2015

INFORMATION ABOUT HIMACHALA KSHETRAM TEMPLE AT MALLURU - WARANGAL


హేమాచల క్షేత్రం

తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం మనకి 'హేమాచల లక్ష్మీనరసింహస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. వరంగల్‌ జిల్లా 'మల్లూరు' సమీపంలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందిది. ఇక్కడి గిరిజనులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కొండకోనల్లో తిరుగాడుతూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. లక్ష్మీదేవి అంశతో జన్మించిన 'చెంచులక్ష్మి' ని ఇక్కడ మకర సంక్రాంతి రోజున వివాహామాడాడని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ రోజున ఇక్కడ గిరిజనులంతా కలిసి వరపూజా మహోత్సవాన్ని జరిపిస్తారు.

ఈ ఉత్సవంలో స్వామివారి పట్ల ... అమ్మవారి పట్ల ఇక్కడివారికి భక్తిశ్రద్ధలే కాదు అంతకుమించిన ప్రేమానురాగాలు కనిపిస్తుంటాయి. తమని కరుణిస్తున్నదీ ... కాపాడుతున్నది ఆ లక్ష్మీనరసింహుడేననే అపారమైన విశ్వాసం వారి మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా సిద్ధులు ... యోగుల వంటి వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. అక్కడి ప్రజలకి వాళ్లపట్ల అపారమైన విశ్వాసం కలుగుతుంది. దాంతో వాళ్లని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఆ యోగులు సజీవసమాధి చెందిన తరువాత ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతుంటాయి.

ఆ పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలు చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో మొక్కులకు సంబంధించి ఒక్కోచోట ఒక్కో ఆచారం కనిపిస్తూ వుంటుంది. సాధారణంగా దైవ క్షేత్రాల్లో తమ మొక్కు చెల్లించమంటూ కొబ్బరికాయలు కట్టడం ... గంటలు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇక ఈ తరహా క్షేత్రాల విషయానికి వచ్చే సరికి, మొక్కుకునేవారు ఆచరించే పద్ధతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.

INFORMATION ABOUT BHOJPUR SOMANADHA TEMPLE - MADHYA PRADESH - INDIA


భోజ్పూర్ .మధ్యప్రదేశ్

యాత్రికుల పూజకే పరిమితమైన భోజ్‌పూర్ సోమనాథుడు!!

మధ్యప్రదేశ్‌ భోజ్‌పూర్‌లోని అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని స్వామిని సోమనాథునిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. 32.25 మీటర్ల పొడవుతో, 23.50 వెడల్పుతో కనిపించే ఈ ఆలయం ఎత్తు ఐదు మీటర్లు. భోజ్‌పూర్ గ్రామం మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన భోపాల్ నుంచి దక్షిణంగా ఇటార్సీ వైపు వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది.

ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దది. ఈ లింగం సుమారు 7.5 అడుగుల ఎత్తుతో, 18 అడుగుల చుట్టుకొలతను కలిగివుంటుంది. అయితే పాలరాయితో తెల్లగా ప్రకాశించే ఈ శివలింగం యాత్రికుల పూజకే పరిమితమైంది. ఈ ఆలయంలో అర్చకులు నిత్యపూజలు చేస్తున్న దాఖలాలు లేవు. పర్యాటకులు మాత్రమే ఈ భారీ శివుడిని స్మరించుకుని పూజలు చేస్తుంటారే తప్ప, శివాలయాల్లో జరిగే నిత్యపూజలకు సోమనాథుడు నోచుకోలేదు. అయితే గుడిలోనున్న భారీ శివలింగానికి ఎదురుగా ఉన్న చిన్న శివలింగానికి దర్శనానికి వచ్చిన భక్తులు, యాత్రికులు పూజలు చేస్తుంటారు.

ఈ గుడికి తలుపులు పెట్టేందుకు నిర్మించిన రాతిచట్రం చాలా ఎత్తుగా ఉంది. దానిపై కుబేరుడు, ద్వారపాలకులు, నదీమతుల్లులైన గంగ, యమునలు వంటి అనేక శిల్పాకృతులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. అంతేగాకుండా గోపురంతో కూడిన ఈ ఆలయంలో శివపార్వతీ, లక్ష్మీనారాయణ, బ్రహ్మ సరస్వతీ, సీతారాముల విగ్రహాలు కూడా దర్శనమిస్తుంటాయి.

ఇంకా కేవలం సిమెంట్, సున్నం వంటివి వాడకుండా రాళ్లను మాత్రమే పేర్చుకుంటూ కట్టిన అతి పురాతనమైన ఆనకట్టలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇంకేముంది.. భోజ్‌పూర్ గ్రామంలో పచ్చపచ్చని చెట్లు, కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసివున్న సోమనాథ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఎప్పటికీ ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు

SHIVA PUJA TRADITIONAL IMPORTANCE


శివలింగాన్ని ఆవుపాలతో, వెన్నతో పూజించిన వారు అశ్వమేధయాగం చేసినవారు పొందే ఫలితాన్ని పొందుతారు.
నెయ్యితో ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవారు నిత్యాగ్నిహోత్రం చేసే బ్రాహ్మణుడు పొందే ఫలితాన్ని పొందుతారు.
కేవలం నీళ్ళతో స్నానం చేయించిన నరుడు కూడా పుణ్యం పొందుతాడు, ప్రియాన్నీ పొందుతాడు.
శివసన్నిధిలో నెయ్యితో కూడిన గుగ్గులు మిశ్రితమైన ధూపాన్ని వేసిన నరుడు గోసవయజ్ఞం చేసిన ఫలాన్ని పొందుతాడు.
కేవలం గుగ్గులు ధూపం మాత్రమే వేసినవాడు కూడా సువర్ణదానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
నానావిధ పుష్పాలతో శివలింగాన్ని పూజించినవాడు వేయి ఆవులు దానం చేసినవాడు పొందే ఫలం పొందుతాడు.
మరొక దేశానికి వెళ్ళి శివలింగాన్ని ఆరాధించినవాని కంటె ఇష్టమయినవారు నాకెవరూ ఉండరు.
ఈ విధంగా అనేక విధాలయిన ద్రవ్యాలతో శివలింగాన్ని పూజించిన నరుడు నాతో సమానుడవుతాడు. మరణానంతరం తిరిగి జన్మించడు. భక్తులు పూజలతో, నమస్కారాలో స్తోత్రాలలో ఫలహారాలతో, బద్ధకం వదలి నా శివలింగాన్ని నిత్యం పూజించాలి. మోదుగ, మారేడుదళాలు రాజ వృక్షపూలమాలలు, జిల్లేడుపూలు పవిత్రమయిన పూలు. ఇవి నాకు మిక్కిలి ప్రీతిని కలిగిస్తాయి.
పండుగాని, కూరగాని, పువ్వుగాని, చివరకు నీరయినా సరే, నామీద మనస్సు నింపి నా భక్తులు సమర్పిస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను సంతోషిస్తే భక్తుడు పొందలేని ఫలమేదీ ఉండదు. కనుకనే నా భక్తులు ఎల్లవేళలా నన్నే పూజిస్తూ ఉంటారు. నా భక్తుల పాపాలు నశిస్తాయి. నా భక్తులు ఎన్నడూ నశిమ్చరు. నా భక్తులు అన్ని లోకాల్లోనూ పూజింపబడతారు. వందయజ్ఞాలు చేసినవారే నన్నుగానీ, నా భక్తుల్ని గానీ ద్వేషించే మానవులందరూ ఘోరమైన నరకాన్ని పొందుతారు. అని లింగపూజ గురించి మహేశ్వరుడు పార్వతో పలికిన పలుకులు. (మహాభారతం - అనుశాసన పర్వం).

INFORMATION ABOUT LEVER CANCER - DOCTORS ADVISE


సమతౌల్యం లేని ఆహారం, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం, విపరీతమైన ఒత్తిళ్ళతో జీర్ణ వ్యవస్థకు సంబం ధించిన సమస్యలు, అతివేగంతో కూడిన జీవనశైలి వల్ల రాష్ట్రంలో ఉదరకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి.

కాలేయం దెబ్బతినడానికి 40 నుంచి 50 శాతం వరకు వైరల్ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణమైతే, 30 నుంచి 40 శాతం మందిలో క్యాన్సర్ దెబ్బతినడానికి అతిగా మద్యం సేవించడమే ముఖ్య కారణం. ఆహారం, నీరు కలుషితమైనవి తీసుకోవడం వల్ల హెప టైటిస్ ఎ,ఇ వైరస్‌లు దాడి చేసి కామెర్లు, తద్వారా కాలేయం పూర్తిగా పాడయిపోవడానికి కారణమవుతున్నాయి. కలుషిత మైన సూదులు, సిరంజిలు వాడడం, మత్తు పదార్థాలు తీసుకోవ డం తదితర కారణాల వల్ల హెపటైటిస్ బి,సి వైనస్‌లు ప్రవేశించి కాలేయాన్ని మట్టుబెడతాయి. విపరీతంగా మద్యం సేవించడం వల్ల కాలేయం సిర్రోసిస్ అనే జబ్బుకు గురవుతుంది. ఫలితంగా కాలేయం పూర్తిగా చెడిపోతుంది. లివర్ ఇన్‌ఫెక్షన్లను గాని మద్యపాన ప్రభావాన్ని గాని నివారించగల అవకావం ఉన్నా అవగాహన లేక చాలా మంది వీటివల్ల కాలేయ క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. వేరుశగలాంటి గింజల్లో పెరిగే ఫంగస్‌లు ఉత్పత్తి చేసే ఆఫ్లటాక్సిన్లు కాలేయానికి క్యాన్సర్ కలుగజేస్తాయి.

కొన్ని రకాల గర్భనిరోధక మాత్రలు కూడా కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కూరగాయలను శుభ్రంగా కడగకుండా తినడం వల్ల కాలేయంలో తిత్తులాంటివి ఏర్పడతాయి.
మన ఆహార అలవాట్లు సరిగా లేనప్పుడు కడుపులో ఆమ్లాలు అవసరానికి మించి తయారవుతాయి. వీటివల్ల లోపలి పొరలు దెబ్బతిని పుండులా ఏర్పడుతుంది. నొప్పి నివారించే పెయిన్ కొల్లర్ల వల్ల కూడా అల్సర్లు ఏర్పడతాయి. కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళలో అల్సర్లు ఏర్పడానికి చాలా వరకు ఇవే కారణం. ఫలితం గా క్యాన్సర్ చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. పీచు పదార్థా లను చాలా తక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడికి గురవడం వల్ల అల్సరేటివ్ కోలై టిస్, క్రౌన్స్ డిసీజ్ లాంటివి పెద్దపేగును బాధిస్తాయి.

మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వాళ్ళకి అల్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీనికి తోడు ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వంటి అలవాట్లు అల్సర్లను ప్రేరేపిస్తాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్ల హెలికోబాక్టర్ ఫైలోరి బాక్టీ రియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయి. తద్వారా జీర్ణకోశంలో అల్సర్లు బాధిస్తాయి.

అవసరం కన్నా ఎక్కువగా తినడం, తక్కువ పనిచేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తద్వారా వచ్చే ఊబకా యం... గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవుతాయి. థాలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, మలేరియా లాంటి రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటే నల్లని రాళ్ళు ఏర్ప డతాయి. కాలెస్ట్రాల్ పెరిగితే పసుపు రంగు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నొప్పిగా ఉండడమే కాకుండా ఇన్ ఫెక్షన్లు కూడా కలుగుతాయి. ఇవి క్లోమ గ్రంథికి కూడా సమస్యలు తెచ్చిపెడతాయి.
రక్తంలో చక్కెరలను నియంత్రించడమే కాకుండా ఆహారం జీర్ణం కావడంలో ప్రధాన పాత్ర వహించే క్లోమగ్రంథికి మన అలవాట్లే శాపాలవుతాయి. గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడం, వైరల్ ఇన్‌ఫె క్షన్ల వల్ల, కాల్షియం మోతాదు పెరిగినా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల శాతం పెరిగినా క్లోమ గ్రంథి కుళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలు కూడా ప్రభా వితమవుతాయి. పాంక్రియాస్ దెబ్బతింటే 60 శాతం మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. క్రానిక్ పాంక్రియాటైటిస్‌కు గురయినప్పుడు రాళ్లు క్లోమ నాళానికి అడ్డుపడడం వల్ల క్లోమరసానికి దారి ఉండదు. ఫలితంగా జీర్ణప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. క్లోమ గ్రంథిలో రాళ్ళు ఇన్సులిన్‌ను తయారు చేసే ఐలెట్ కణాలను సైతం దెబ్బతీస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరలు పెరుగు తాయి. బరువు చాలా తగ్గిపోతారు. ఈ పరిస్థితి క్లోమగ్రంథి క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.

కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, నొప్పి, గుండెలో మంట, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గిపోవడం, మలం నల్లగా రావడం, రక్తం పడడం, హఠాత్తుగా మలబద్ధకం రావడం ఇవన్నీ దానికి సంకేతాలు.

SYMPTOMS OF BRAIN STROKE - TYPES OF BRAIN STROKE - PRECAUTIONS TO BE TAKEN - DOCTORS ADVISE


రక్తనాళంలో కలిగిన అవరోధం కలిగినప్పుడు స్ట్రోక్ అని పిలువుబడుతుంది.ఆకాల మరణాలకు స్ట్రోక్ మరణం మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఈ స్ట్రోక్ లక్షణాలు కలిగి ఉంటే, ఆలస్యం లేకుండా అత్యవసర వైద్యసహాయాన్ని తీసుకువటం ఉత్తమం.

లక్షణాలు అకస్మాత్తుగా ఒకవైపు శరీరం మొద్దుబారుట లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట.
ఈ లక్షణాలు సంభవిస్తే అత్యవసర వైద్య సదుపాయాన్ని సంప్రదించడం అవసరం.
స్ట్రోక్ పరీక్ష : స్ట్రోక్ అని అనుమాన కలిగినప్పుడు ఈ చిన్న పాటి పరీక్ష దీనిని నిర్థారించాటానికి ఉపయోగపడగలదు.
1. ముఖంపై చిరునవ్వుకు ప్రయత్నించడం, దీనిద్వారా ముఖంలో ఒకవైపు ముఖంలో నవ్వు కనబడక శుష్కించుకు ఉండటం.
2. రెండు చేతులు పైకి ఎత్తడం. ఒకవైళ ఒకవైపు చేయి పైకి లేపలేకపోవడం
3. ఒక వాక్యాన్ని చెప్పడం. ఈ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేకపోవడం ఇందులో ఏ ఒక్క కారణం కనిపించినా, పరిస్థితి తీవ్రంగా ఉన్నదని భావించి వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలి.

స్ట్రోక్ సంభవించినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. మెదడులో ఆక్సిజన్ క్షీణిస్తున్నప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించడం అరంభమవుతాయి. కణాల రక్తం గడ్డల ను కరిగించేందుకు మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్ సంభవించిన మూడు గంటల లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్కకణం మరణించినచో ఆ కణానికి సంబం ధించిన అవయవాలు పని చేయటం ఆగిపోతాయి. దీనితో దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది. స్ట్రోక్ లక్షణాలు ఎవరికైనా వచ్చినప్పుడు ముందుగా ఎటువంటి స్ట్రోక్‌కు గురయ్యారు అనేది నిర్థారించాలి. స్ట్రోక్‌లలో రెండు విధాలు కలుగుతాయి. వీటిని ఒకే విధంగా చికిత్స అందించలేము. సిటిస్కాన్ ద్వారా స్ట్రోక్ రక్తనాళాలు బ్లాక్ అవటం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన సంభవించిందా అనేది కనుగొవచ్చు. ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్ శరీరంలో ఏ ప్రాంతంలో జరిగింది. అనేది గుర్తించవచ్చు.

ఇస్కామిక్ స్ట్రోక్ : సంభవించే స్ట్రోక్‌లలో ఇది ప్రధానమైనది. ప్రతి 10 స్ట్రోక్‌లలో 9 ఈ విధమైన స్ట్రోక్ కిందికే వస్తున్నట్లు గుర్తించారు. ఇందులో మెదడు లోపల రక్తపు గడ్డ మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కల్పిస్తుంది. ఈ రక్తపు ముద్ద అక్కడే ఏర్పడవచ్చు. లేదా శరీరంలో ప్రయాణించి ఒక క్టిష్టమైన ప్రదేశానికి వచ్చి అడ్డు పడవచ్చు.

రక్తస్రావ కారక స్ట్రోక్ : ఈ రక్త స్రావ కారక స్ట్రోక్ సాధారణంగా తక్కువ వ్యక్తులలో సంభవిస్తుంది. కానీ ప్రమాదకరమైనది. మెదడులోని బలహీన రక్తనాళం పగిలిపోయినప్పడు ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని కారణంగా మెడడులో రక్తం ప్రవహిస్తూ నివారణ చేయలేకపోయే సందర్భాలు కలటవచ్చు.

మీనిస్ట్రోక్: మెదడుకు రక్తం ప్రవహించే నాళాలు తాత్కాలికంగా మూసుకుపోయి. తరువాత తిరిగి రక్త ప్రవాహం పునరుద్ధరించబడుతుంది. దీనిని మీనిస్ట్రోక్ అంటారు. ఈ లక్షణాలు మీకు కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం. ఈ స్ట్రోక్‌ను నివారించుటకు సరి అయిన వైద్య సదుపాయాలు కలవు.

స్ట్రోక్ కలగటానికి కారణాలు : కోవ్వు ,కొలేస్ట్రాల్ , కాల్షియం ఇతర పదార్థాలు రక్త ప్రవాహం కలిగే నాళాలలో ఫలకు లాగా ఏర్పడి రక్త ప్రవాహన్ని అడ్డుకుంటాయి. దీని మూలంగా కాల క్రమేణా ఫలకం పరిణామం పెరిగి రక్తపు ముద్దల మాదిరిగా ఏర్పడాతాయి. ఈ గడ్డకట్టిన రక్తపు ముద్దనాళంలో ఒక సంకుచిత స్థానంలో చిక్కుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగిలి స్ట్రోక్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఇదే రక్తపు గడ్డ అడ్డు పటడం మూలంగా రక్త ప్రవాహం ధాటికి రక్త నాళాలు చిట్లిపోయి స్ట్రోక్‌కు కూడా కారణమవుతుంది.

నష్టకారకాలు : కొన్ని తీవ్ర పరిస్థితుల వలన స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వాటిలో 1. అధిక రక్తపోటు, 2. అధిక మద్యపాన సేనన, 3.మధుమేహ వ్యాధి, 4. స్థూలకాయత, 5. ధూమాపానం, 6. వ్యాయామం చేయలేకపోవటం, 7. అధికంగా కొవ్వు, కొలేస్ట్రాల్ ఉన్న వంటకాలను తినడం, 8 ఉప్పును అధికంగా సేవించడం తద్వారా రక్తపోటు పెరగడం. వీటిని నియంత్రించడం వలన గుండె పోటును నివారించవచ్చు. కొన్ని కారణాలు స్ట్రోక్ రావడాన్ని నివారించలేవు. వీటిలో వయస్సు మీదపడటం , వంశపారంపరిక స్ట్రోక్ లక్షణాలు వంటివి అనివార్య కారణాలు . అలానే పురుషులలో ఎక్కువ శాతం స్ట్రోక్ కలిగే అవకాశం ఉంది. కానీ స్ట్రోక్ కారణంగా మరణాలు మహిళలో అధికశాతం కలగటం గమనించవచ్చు.