WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 25 September 2014

DASARA FESTIVAL - NAVARATHRI INFORMATION FOR 2014 DASARA FESTIVAL


నవరాత్రి:

అక్షరాలా 'తొమ్మిది రాత్రులు' వ్యాఖ్యానించబడింది నవరాత్రి, స్వచ్ఛత మరియు శక్తి లేదా 'శక్తి' ప్రతీక మాతకు అంకితం అత్యంత ప్రసిద్ధి హిందూ మతం పండుగ. నవరాత్రి పండుగ కర్మకాండ పూజ, ఉపవాసాలు కలిపి తొమ్మిది వరుస రోజుల మరియు రాత్రులు తేజస్సుతో వేడుకలు కలిసి ఉంటుంది. భారతదేశం లో నవరాత్రి చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరించి చైత్ర నవరాత్రి మార్చి / ఏప్రిల్ లో, శరద్ నవరాత్రి సెప్టెంబర్ / అక్టోబర్ జరుపుకుంటారు.

నవరాత్రి సమయంలో, గ్రామాలు మరియు పట్టణాల నుండి ప్రజలు లక్ష్మీదేవి మరియు దేవత సరస్వతి సహా దుర్గా దేవి వివిధ కోణాలు ప్రాతినిధ్యం చిన్న విగ్రహాలు న 'పూజ' ప్రదర్శన గుమిగూడుతారు. మంత్రాలు మరియు భజనలు, జానపద పాటలు పాత్రాభినయం చాంటింగ్ సాధారణంగా నవరాత్రి తొమ్మిది రోజులపాటు వరుసగా పూజ ఆచారాలు వెంబడించే.

నవరాత్రి ఉత్సవాల్లో:
మతపరమైన మరియు సాంస్కృతిక నేపథ్యాలు రెండు నిర్వచించడం, నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ సంగీతం మరియు నృత్యం seeped ఉంటాయి. గుజరాత్ అన్ని రాత్రి దీర్ఘ నృత్యం మరియు ఉత్సవాలతో నవరాత్రి వేడుకలు దృష్టి ఉంది. గర్బ 'దాండియా' లేదా slim పుల్లలు ఉపయోగించి గోపికలతో కృష్ణుడు గానం మరియు నాట్యం జానపద నుంచి వచ్చింది అని ఒక భక్తిరస నృత్యం. 'రాస్ గర్బా' కూడా 'Dodhiyu', 'Trikoniya', 'Lehree' మరియు అనేక ఇతరులు వంటి దశలను కలిగి పరిణమించింది. ఏం మరింత వార్తలు, సమయం, నవరాత్రి పండుగ చేసింది ఆర్డర్, ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించి బాగా నృత్యదర్శకత్వం నృత్య ప్రదర్శనలు, హై ఎండ్ ధ్వని మరియు వ్యక్తులతో వేడుకలు మార్పులు చూసింది. పర్యాటకులు అధిక శక్తి బ్యాండ్ మ్యూజిక్ ప్రదర్శనలు, గానం మరియు నాట్యం మిశ్రమాన్ని ఆస్వాదించడానికి గుజరాత్ లో వడోదర వస్తారు.

మంచిని సాధారణ అంతర్లీన థీమ్ నిలుపుకుంటూనే భారతదేశం సాక్షులు నవరాత్రి దేశవ్యాప్తంగా భక్తి రూపాలను పదివేలు. జమ్మూ లో, వైష్ణో దేవి మందిరం నవరాత్రి సమయంలో తీర్థయాత్రకు వారి మార్గం తయారు భక్తులు సంఖ్య భారీ పెరుగుదల చూస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో, నవరాత్రి మేళా నవరాత్రి పర్వదినాన సూచిస్తుంది. వెస్ట్ బెంగాల్, పురుషులు మరియు మహిళలు గొప్ప భక్తి మరియు భక్తి తో 'దుర్గ పూజ' జరుపుకుంటారు మరియు దేవత దుర్గ భూతం 'మహిషాసుర' నాశనం పూజించే. ప్రజలు రామాయణం దృశ్యాలను చేయాలని ఇందులో 'రామ్లీలా' పెద్ద మైదానాల్లో నిర్వహిస్తారు. అశ్విన్ (శరద్) నవరాత్రి పదవ రోజు ఏక 'దసరా' దేశవ్యాప్త వేడుక చూస్తాడు.

దక్షిణ భారతదేశం లో, నవరాత్రి సమయంలో, ప్రజలు ఒక అడుగు నమూనా విగ్రహాలను ఏర్పాటు మరియు దేవుని పేరు ఇన్వోక్. మైసూర్ లో తొమ్మిది రోజుల నవరాత్రి పండుగ 'దసరా' ఫెస్టివల్ జానపద సంగీతం పాత్రాభినయం, నృత్య ప్రదర్శనలు, కుస్తీ పోటీలలో మరియు Tableau పాల్గొనడం పాల్గొన్న కలుస్తుంది. అలంకరింపబడిన ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ముదురు వెలిగే మైసూర్ ప్యాలస్ నుండి ప్రారంభమయ్యే పాటు ఆ చిత్రం ఊరేగింపుకు ఒక ప్రసిద్ధ ఒకటి. 'విజయదశమి' ఒకరి వాహనం పూజ దక్షిన భారతదేశం లో ఒక పవిత్రమైన రోజు.
శరద్ నవరాత్రి 2014 తేదీలు

Ghatsthapana - నవరాత్రి డే 1 - సెప్టెంబర్ 25, 2014
చంద్ర దర్శన, ద్వితీయ - సెప్టెంబర్ 26, 2014
సిందూర్లో తృతీయ, Chandraghanta పూజ, తృతీయ - సెప్టెంబర్ 27, 2014
Varadvinayak చవితి - సెప్టెంబర్ 28, 2014
పదవీ లలితా Vrat, Skandamata పూజ - సెప్టెంబర్ 29, 2014
కాత్యాయని పూజ, Shashthi - సెప్టెంబర్ 30, 2014
సరస్వతి Awahan, Kalaratri పూజ, Saptami - అక్టోబర్ 1, 2014
శ్రీ దుర్గా Mahaashtami, సరస్వతి పూజ - అక్టోబర్ 2, 2014
శరద్ నవరాత్రి ముగుస్తుంది - అక్టోబర్ 3, 2014 - రామ్ నవరాత్రి డే 9

TELUGU MAHABHARATHA STORIES - IMPORTANCE OF GAYA


గయ మహత్యం

ఆధ్యాత్మిక వైభవాన్ని కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయా క్షేత్రప్రస్తావన మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు, స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది. ప్రయాగ, కాశీ, గయ అనే మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అని అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి.

కాగా,అ గయ పవిత్రమైన నాలుగు క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడింది. ప్రయాగ, కురుక్షేత్రం, గయ, వారణాసి, ఈ నాలుగు క్షేత్రాలు కలిపి పవిత్రమైన నాలుగు స్థలాలుగా పేర్కొంటారు. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని, కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రదానం చేసి, కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా అత్యంత పవిత్రక్షేటంగా కీర్తించబడిన గాయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ మహర్షిముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది. భౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు గయను చేరి ఇక్కడి అశ్వత్థవృక్షం క్రింద నలభైరోజులు పాటూ ధ్యానంలో నిమగ్నుడై, చివరకు జ్ఞానోదయాన్ని పొందాడు. షోడశ మహాజానపదాల కాలంలో మగధ పరిపాలన క్రింద వుండి ప్రధానమైన పట్టణంగా గయ పేరుపొందింది. ఇదేవిధంగా మౌర్య సామ్రాజ్యకాలంలో కూడా అభివృద్ధి చెందినా గయకు దగ్గరలోనే గుప్తసామ్రాజ్య పాలకుడైన మొదటి కుమారగుప్తుడు (క్రీ.శ. 414-435) నలందాలో భౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. దీనితో వివిధ దేశాల నుంచి భారతదేశానికి భౌద్ధ అధ్యయనం కోసం వచ్చేవారి సంఖ్య అధికం కాగా, వారు నలందాతో పాటూ ఆధ్యాత్మికంగా, బుద్ధుడి జ్ఞానభూమిగా పేరు పొందిన ‘గయ’ను దర్సించడంతో పాటూ దాని అభివృద్ధికి కూడా కృషి చేయడం విశేషం.

పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.

‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -

“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.

గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్రహ్మ దేవుడు యజ్ఞ సమయంలో శివుడితో పాటు ఈ ప్రాంతానికి చేరిన పార్వతీదేవి శ్రీమాంగల్య గౌరీదేవిగా కొలువు దీరినట్లు, మహర్షుల పూజలందుకున్నట్లు కథనం.

గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగామిస్తూ వుండడం వాళ్ళ ఈ క్షేతం ప్రయాగాతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూవుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. పిన్దప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుందని చెప్పవచ్చు. ఫల్గుణీ నదీతీరంలో “విష్ణుపడమందిరం" కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి వున్నా ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే ‘గదాధరుడు’ అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గడాధరస్వామిగా పూజ లందుకుంటున్నాడు. ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర అడుగు పొడవు, అర్థ అడగు వెడల్పున్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు.

ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని “అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు ‘చిరకాలం అక్షయవటం’గా వర్థిల్లమణి వరాన్ని ప్రసాదించిందట. ఈ విష్ణుపద మందిరానికి ప్రక్కనే అష్టాదశ శక్తిపీఠ దేవతల్లో పదహారవ దేవత అయిన శ్రీమాంగల్య గౌరీదేవి ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయం లోని గర్భాలయంలో అమ్మవారు దివ్యమైన అలంకరణలతో దర్శనమిస్తుంది. ఈమెకే శ్రీ సర్వమంగళాదేవి అని కూడా పేరు. ఈమెను శ్రీ మహావిష్ణువు సోదరిగా పేర్కొనడం విశేషం.

WHAT ARE THE ESSENTIALS REQUIRED FOR PERFORMING DASARA PUJA



పూజకు అవసరమైన ముఖ్య వస్తువులు

01. పూజ వేళ ఉపయోగించుటకుగాను విడివిడిగ పాత్రలలో జలము, ఉద్ధరిణెలు లేదా చెంచాలు కావలేను.

02. ఏ దైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్రపటము లేదా ప్రతిమ, అది కూడా లేనప్పుడు బంగారు లేదా వెండితో చెసిన కాసు.

03. ముఖ్యముగా “వినాయక” పుజకు “వరలక్ష్మీ పూజకు పాలవెల్లి కట్టి తీరవలెను.

04. దీపారధనకు కుందులు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గిపెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.

05. పూజ నిమిత్తము అక్షతలు, పువ్వులు, పసుపు కుంకుమ.

06. ఇతరేతరోపచారార్ధము =- తపలపాకులు, వక్కలు, అగరు వత్తులు, గంధము, హారతికర్పూరము, కొబ్బరికాయలు.

07. ప్రధానముగా కలశము, దానిపైకి ఒక కొబ్బరికాయ, రవికెల గుడ్ద.

08. వినాయకపూజకు తప్పనిసరిగా 21 రకముల పత్రి కావలెను.

09. నివేదన (నైవేద్యం) నిమిత్తముగా బెల్లము ముక్క (గుడశకలం), అరటిపళ్ళు (కదళీఫలం), కొబ్బరి (నారికేళఫలం) ఇవి సాధారణావసరములు.

TELUGU STORY ABOUT SAMAVARTHANAM - STUDY PERIOD


సమవర్తనం అంటే ఏమిటి?

విద్యాభాస కాలాన్ని బ్రహ్మచర్య కాలంగా చెప్పబడుతుంది. బ్రహ్మచారి తన విద్యాభాసం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు మరియు బంధువులు అతనికి మంగలహారతులచ్చి సాదరంగా ఆహ్వానిస్తారు. బ్రహ్మచారితో పాటు అతని గురువు మరియు తోటి విద్యార్థులు కూడా సాదరంగా సకల మర్యాదలతో ఆహ్వానించడం జరుగుతుంది.

విద్యాభాస కాలంలో గురువు విద్యార్థికి తండ్రిలా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. కావున అట్టి గురునికి తగిన ఆసనమేసి కూర్చుండబెట్టి, పుష్పమాల వేసి బహుమతులిచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఆదరిస్తారు. గురువు తన సిష్యుదిని దీవించి సమావర్తన కార్యాన్ని పూర్తి చేస్తాడు.

నేటి కొత్త తరం వారికి ఈ సమవర్తనములో ఎత్తి విశేషము కనిపించకపోవచ్చు, కానీ అది ఎంతో అర్థమైనటువంటింది. జ్ఞానాన్ని ఆర్జించిన విద్యార్థిని మరియు జ్ఞానాన్ని విద్యార్థికి అందించిన గురువును గౌరవించి ఆడరించడమంటే పరోక్షంగా జ్ఞానాన్ని ఆరాధించినట్లే అవుతుంది. ఈ కార్యంలో గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా గౌరవించి గుర్తించబడుతుంది.

Wednesday 24 September 2014

DEVI NAVARATHRI PUJA INFORMATION IN TELUGU - DASARA FESTIVAL SPECIAL TELUGU INFORMATION


నవ అంటే తొమ్మిది. సంస్కృత భాషలో నవానాం రాత్రీనాం సమహరః నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు. 
నవ‬ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం.ఈ నవరాత్రులు మనిషికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ నవరత్రులలో దేవిభాగవతం చదవడంకానీ,వినడంకాని చేస్తారు.


అమ్మవారు వివిధ రూపాల్లో రాక్షసులను సంహరించింది. నిజానికి రాక్షసులు ఎక్కడొ లేరు. మనలోనే, ఆలోచనలలో, మనసులో ఉన్న చెడు భావాలలో, దురలవాట్లు, కుళ్ళు కుతంత్రాలే రాక్షసులు. వారిని ఈ తొమ్మిది రాత్రులలో ఈ దేవి భాగవత పారాయణతో వాటిని సంహరించి జయించడం, మనలను మనం సంస్కరించుకోవడమే విజయదశమి పండుగ.

నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి అని కూడా అర్ధాలు ఉన్నాయి. అలాగే నవ అంటే క్రొత్తది అని కూడా అర్ధం ఉంది. 9 రోజులు ఆరాధన చేయలేని వారు 7 రోజులు కానీ,5,3 లేదా కనీసం చివరి రోజైనా తప్పక ఆరధించాలి అని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంవారికి పనిపాటలేదు కనుక ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసేవారు,మాకైతే ఉదయం ఆఫీసు ఉంటుంది, కాలేజీ ఉంటుంది, లేదా వేరే పని ఉన్నదని తప్పించుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది రాత్రి విశేషంగా చేయవలసిన పూజ. సాయంకాలం నుండి రాత్రి 9గంటలలోపు చేయవలసిన ఆరాధన. ఆ సమయానికి అందరు ఇంటికి చేరుకుంటారు కనుక తప్పించుకునే అవకాశం లేదు.

పవంచ వింధ్య వాసిన్యాం నవరాత్రోపవాసతః|
ఏక భుక్తేన నక్తేన తధైవాయాచితేన చ||
ఈ నవరాత్రి వ్రతాని ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ఆచరించాలని,ఆచరించేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని అర్దం.
పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే|
గృహే గృహే శక్తి పరైర్ర్గ్రామే గ్రామే వనే వనే||

ఈ వ్రతాన్ని ప్రతినగరంలోను,ఇంట్లోను,గ్రామంలోను,వనంలొ ప్రతి చోట ఆచరించాలి అని అర్దం.

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు స్వామి శివానంద. మొదటి 3 రోజులు దుర్గగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మను ఆరాధించాలి.

DASARA PUJA 2014 FIRST DAY SRI BALA THRIPURA SUNDARI AVATHAR OF GODDESS SRI KANAKA DURGA PUJA DETAILS


నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. 

స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి

దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు.

శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి

Bezawada Sri Kanaka Durga Amma vari Navarathrulu First Day Avathar Information - Swarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One 25-09-2014


Swarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One - Telugu - 

స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి పూజ

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ
శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
అధాంగ పూజ
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ: 
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా దేవి యే నమః (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
శ్రీ దుర్గా దేవి పూజ సమాప్తం.






Dasara Festival 2014 Pooja Information and step by step details - Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu Article of Bezawada Sri Kanaka Durga Ammavari Alankaramulu and its detailed puja information


Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu - 

దుర్గాదేవీ పూజా విధానం

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి - నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

శ్రీ శైలము దుర్గ అవతారములు

1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట , రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ , కైలాస వాహన సేవ,
5న స్కంధమాత , శేష వాహనసేవ,
6న కాత్యాయని , హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ , అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవ


దుర్గాదేవీ పూజా విధానం

శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)

అధాంగ పూజ

ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి


శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ

అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ: 
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ: 
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ: 
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ: 
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ: 
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని, అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
_________


బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి - నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
_________
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా దేవి యే నమః (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
శ్రీ దుర్గా దేవి పూజ సమాప్తం.