ఆహారం మనిషి ప్రాథమిక అవసరాల్లో తొలి స్థానంలో ఉంటుంది. అభివృద్ధిచెందిన ఆహారం మనిషి ఆలోచనలను, సామాజిక ప్రవర్తనను తీర్చిదిద్దింది.
ఖీ ఆరోగ్యానికి, ఆలోచనలకు, పురోగమనానికి మనిషి స్వీకరించే ఆహారం తోడ్పడుతుంది. శ్రమను తట్టుకునే శక్తిని సమకూరుస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సమర్థవంతంగా పనిచేసే లక్షణాన్ని చేకూర్చిపెడుతుంది.
ఖీ ఆహారంతోటే బుద్ధివికాసం, కళానైపుణ్యం, శాస్త్రాభివృద్ధి సాధ్య మవుతున్నాయి. మనిషిని రాక్షస ప్రవృత్తినుండి మానవతా ధోరణిలోకి ఆహారం తీసుకురాగల్గింది.
ఖీ భుజించిన ఆహారం మనిషి శరీరంలో మూడు భాగాలుగా విడిపోతుంది. కొంత విసర్జితం కాగా మరికొంత కండపుష్టిని కల్గిస్తుంది. మిగిలినది మేథను వృద్ధిచేసి ప్రజ్ఞాశీలిగా మారుస్తుంది.
ఖీ అప్పుడేపుట్టిన శిశువునుండి, జీవితాను భవాల చరమాంకంలోవున్న వ్యక్తివరకు శారీరక స్థితిని అనుసరించి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
ఖీ మనిషి ఎదుగుదలకు కీలకమైన బాల్యవ్యవస్థలో సరియైన పోషకాహారం పటిష్టమైన పునాదులను ఏర్పరుస్తుంది.
ఖీ పసివారి ప్రయోజన కరమైన ఎదుగుదలకు, పరిరక్షణకు, సంరక్షణకు విధిగా పోషకాహారాన్ని సమకూర్చాలి.
ఖీ ఆహారం కేవలం పసివారి మనుగడ కోసమే కాదు అభివృద్ధి కోసం కూడా అని మరువకూడదు.
ఏమి తినాలి? : శరీరానికి మొత్తం 50 పోషకాలు అవసరం అవుతాయి. పిండిపదార్థాలు, పీచు పదార్థాలు, నీరు, కొవ్వుపదార్థాలతోపాటు 10 అమైనో ఆమ్లాలు (ఇవి ప్రోటీన్ల తయారీకి కావాలి) 16 ఖనిజ లవణాలు, 13 విటమిన్లు శరీరానికి అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా వెల్లుల్లి, బ్రన్సెల్ స్ప్రౌట్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్...వంటి కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తాయి. పైగా క్యాన్సర్, గుండెజబ్బుల నివారణ కు దోహద పడతాయి.
ఖీ నారింజరంగులో ఉన్న పళ్లు, కూర గాయలు, క్యారట్, చిలగడదుంప, టమాటోల్లో బీటా-కెరోటిన్ (ఎ-విటమిన్) బాగా లభిస్తుంది.
ఖీ శరీరానికి ఎనిమిదిగంటలు ఏ ఆహారం అందించక పోతే దానికి కావలసిన పోషక పదార్థాలు వెంటనే అందించాల్సి ఉంటుంది.
ఖీ ఉదయంపూట తప్పనిసరిగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఫిష్, కర్రీపఫ్ లాంటివయితే వారానికి ఒకసారితింటే చాలు.
ఖీ క్రమం తప్పకుండా బ్రేక్ఫాస్టు తీసుకున్నవారే దానిని తినని వారికంటే నాజూగ్గా ఉంటారు.ఖీ డైటింగ్చేయడంవల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పూర్తిగా నిద్రలేవని సమయంలో అర్థరాత్రి సమయాల్లో భోజనం చేయడం శరీరానికి అంతమంచిది కాదు.
ఖీ వేయించిన పదార్థాలకన్నా ఉడికించిన పదార్థా లు తినడం మంచిది. ఖీ సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సప్లిమెంటుపదార్థాలు తినా ల్సిన అవసరంఉండదు.
ఖీ ఎక్కువగా ధూమపానం చేసేవారు, గర్భిణీలు, వృద్ధులు ఆకలికోల్పోయిన వారు సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. ఖీ గుండె జబ్బులున్నవారు వారానికి రెండుసార్లు మాక్రెల్, సాల్మన్ చేపల్ని తినడం మంచిది.
ఖీ ఆయిలీఫిష్లో విటమిన్-డి సమృద్ధిగా ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్స్లో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఖీ ఈ రెండూ కూడా గుండెజబ్బుల్ని నివారి స్తాయి. ఖీ మన శరీరం రోజుకి ఒకటిన్నర లీటర్ల నీటిని కోల్పోతుంది. కావున అనుదినం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం అవసరం.
గుర్తుంచుకోండి! : కౌమార దశలోవున్న బాలికలు రాగుల్ని రొట్టె, సంకటి, మాల్ట్ ఎక్కువగా తీసు కోవడంవల్ల ఐరన్లోపాన్ని అరికట్టవచ్చు.
ఖీ 6-9 నెలలవయసుగల పిల్లల ఆహారవిషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో వారికి పెట్టే ఆహారం వారి మానసిక, శారీరక పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది.
ఖీ పిల్లలకు ఒకేసారి ఎక్కువ ఆహారం ఇవ్వకూడదు. మొత్తం ఆహారాన్ని రోజు మొత్తంమీద అయిదారుసార్లు విభజించి పెట్టాలి.
ఖీ బాల్యస్థితిలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండకపోతే కౌమారదశలో తీసుకోవాలి. ఖీ అను దినం అన్నం, పప్పు లేదా రొట్టె, పప్పు, ఆకుకూర లు, కాయగూరలు విధిగా తీసుకోవాలి.
ఖీ భోజనం తరువాత సి-విటమిన్ కలిగిన ఏదో ఒక పండును కనీసం జామపండునైనా తినాలి. దీనివలన రక్తహీనత సమస్య తలెత్తదు.
ఖీ భోజనానంతరం కనీసం రెండుగంటల వరకు కాఫీ, టీలు సేవించకూడదు.
ఖీ 45 ఏళ్లు దాటిన వారు మితంగా ఆహారం తీసుకోవడం అలవరచు కోవాలి.
ఖీ వృద్ధాప్యంలో ఆకలి మందగిస్తుంది కాబట్టి పండ్లు ఎక్కువగాతినడం ఉత్తమం.ఖీ రెడీ మేడ్ పోషక ఆహార పదార్థాలపట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఖీ ఖనిజ లవణాలతోను, మాంసకృత్తుల తోను, రకరకాల విటమిన్లతోను, ఇతర పోషకాలతో కూడుకున్న సమతుల ఆహారం మానసిక, శారీరక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఖీ ఈ ఆహారం వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పౌష్టికా హారం తీసుకుంటే మందులఖర్చు చాలావరకు ఆదా అవుతుంది.
No comments:
Post a Comment