WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 2 February 2016

AKKA MAHADEVI TEMPLE AT KARNATAKA


మహాభక్తురాలు అక్కమహాదేవి

పశ్చిమకర్ణాటకదేశంలో 'కల్యాణరాజ్యం' ఉండేది. ఆ రాజ్యం లోని "ఉడుతడి" అనే సంస్దానాన్ని "కౌశికుడు" అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సంస్దాన రాణిగారు మహాబక్తురాలు ఒకరోజు ఉదయాన్నే "శివపూజ" చేసి భక్తి గీతాలు పాడుకుంటూ కూర్చున్నారు ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ కౌశికరాజు కూడా ఆమె చెంతకు వచ్చి కూర్చొని పరవశత్వంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు ఇంతలో రాణిగారి గురువుగారు ఆమె దర్శనార్దమై ద్వారం చెంతకు రావటం గమనించిన రాణిగారు భక్తితో పరుగెత్తుకుంటూ పోయి గురువు గారికి పాదాభివందనం చేశారు ఈ హడావుడిలో పైట కౌశికరాజు చేతిలో ఉండిపోయింది. ఇది గమనించిన గురువు గారు ఆమెకు ఆ విషయాన్ని తెలియచేసారు ఆమె సిగ్గుతో తలదించుకొని లేచి వెళ్లి కౌశికుని చేతిలో వున్న పైటను తీసుకొని ధరించింది.

ఆ చేష్టను చూచిన కౌశికునికి ఎక్కడలేని కొపం వచ్చింది తీక్షణంగా ఆమె వంక చూసి కఠినంగా మాట్లడి ఆమె మనస్సును నొప్పించాడు భర్త కఠినోక్తులు ఆమెను కదిలించాయి
"వలువలు గట్టిన వారు కులముల నీడు వడల నరయుదురా..? మరులు గొన్నవారు సిగ్గుల నరయుదురా చెన్నమల్లికార్జునుని వరించిన వారు లోకాభిమానము నెరగుదురా" అని పాడుకున్నది ఆ మరుక్షణమే సంసారబంధాన్ని త్రెంచుకొని విరాగిణయై "చెన్నమల్లికార్జునుని" వెదుక్కుంటూ బయలు దేరింది కల్యాణనగరంలో బసవేశ్వరుని అనుభవమంటపంలో చాలాకాలం వేదాంతచర్చల్లో కాలం గడిపింది అనంతరం "శ్రీశైలం" చేరుకొని "కదళీవనం" అనే ప్రాంతంలో తపస్సు చేసి శివుని సన్నిది చేరుకున్నది.

'ఆమెయే మహాభక్తురాలు అక్కమహాదేవి' , శ్రీశైలమల్లికార్జుని దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడు తప్పగ దర్శించే స్దలం దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు రెండు గంటలు పడవలో నీటి మీద, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి చుట్టూ చెట్లూ చెప్పని నలవి గాని చూడచక్కని భక్కిరసపూరితమైన దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు కన్నడభాషలో తెలుగులోనూ ఆమె వ్రాసిన "వచనాలు" వందలకొద్దీ వున్నాయి అవి అన్నీ శివుణ్ణి కీర్తిస్తూ వ్రాసినవే అయితే మన దురదృష్టం వాటిలో ఎక్కువ బాగం ప్రచురితం కాకపోవటమే ...

No comments:

Post a Comment