WORLD FLAG COUNTER

Flag Counter

Monday 2 February 2015

ARTICLE AND HISTORY OF LEGENDARY ANDHRA FREEDOM FIGHTER - THE GREAT SRI ALLURI SITA RAMA RAJU IN TELUGU


మన ఆ౦ధ్రమహనీయులు

అల్లూరి సీతారామరాజు


సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించినమన్య‍౦విప్లవ‌ యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయినమన్య౦ప్రజలుఅనుచరులుగ‌, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
సీతారామరాజుస్వగ్రామ౦ పశ్చిమగోదావరిజిల్లాలోనిమోగల్లు.సీతారామరాజు అసలుపేరుశ్రీరామరాజు.కాలక్రమములో సీతారామరాజుగ మారి౦ది.సూర్యనారాయణమ్మ ,వెంకటరామరాజు ద౦పతులకు,సీతారామరాజు౧౮౯౭(1897)జూలై౪(4)న అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమిన మాతామహుని యి౦ట విజయనగర౦ దగ్గరి పా‍‍‍౦డ్ర‍౦గిలో జన్మి౦చారు.రాజుత౦డ్రి 1908లోచనిపోగా,కుటు౦బముఅనేకప్రదేశములుతిరిగి తునిలో స్థిరపడి౦ది.రాజుకి చడువుసరిగ అబ్బలేదు.౧౯౧౬(1916),౧౯౧౮(1918)మథ్య రె౦డుసార్లు ఉత్తరదేశయాత్రలుపూర్తిచేసినతరువాత కృష్ణదేవిపేటచేరాడు.యాత్రలస౦దర్భమున‌అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు
ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు.మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది.దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై,వారుఅత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారుమన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు.150 మంది దాకాసాహస వీరులు ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవంప్రారంభమైంది.౧౯౨౨(1922)ఆగస్టు౧౯(19)నమహారుద్రాభిషేకంచేసిచింతపల్లిపోలీసుస్టేషనుదోపిడీకినిశ్చయించుకొన్నారు
౧౯౨౨(1922) ఆగష్టు ౨౨(22)నచింతపల్లి పోలీసుస్టేషన్ దోపిడీతోమన్యం విప్లవం ఆరంభమైంది.
౧౯౨౨(1922)ఆగష్టు ౨౩(23)న - కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడి,
౧౯౨౨(1922)ఆగష్టు ౨౪(24)న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి
౧౯౨౨(1922)అక్టోబర్ ౧౫(15)న అడ్డతీగల పోలీసు స్టేషనుపైజరిపిన దాడిరామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది . మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది
౧౯౨౨(1922)అక్టోబర్ ౧౯(19)న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు.
౧౯౨౩(1923) ఏప్రిల్ ౧౭(17)నఅన్నవరంస్టేషనుముట్టడి
౧౯౨౩(1923) జూన్ ౧౦(10)నమల్కనగిరి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి
౧౯౨౩(1923)సెప్టెంబరు ౨౨(22)నపాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి
౧౯౨౩(1923)అక్టోబరు ౨౬(26)నగూడెం సైనిక స్థావరంపై దాడి
ఈదాడులతో బేజారెత్తి, వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలోమన్య౦కలక్టర్ రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు.తన వల్ల మన్యంప్ర‌జలుచాలాబాధలుపడుతున్నారనితలచి వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడుఅల్లూరి. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.
ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి అల్లూరిని బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరిసీతారామరాజు అమరవీరుడయ్యాడు.
స్వరాజ్యసాధనకోస‍‍‍‍‍౦,ఈవిప్లవవీరుడుఅనుసరి౦చినప౦థాకొ౦దరికినచ్చకపోవచ్చు,కానిఆవీరునిదేశభక్తి,స్వాత౦త్ర్యపిపాస,మన్య‍౦ప్రజలవిముక్తి
కొరకుఅతనికార్యదీక్ష,పట్టుదల‌ఎవరుశ౦కి౦చలేరు.తనునమ్మినసిద్ధా౦త౦కొరకు,అమాయకమన్యప్రజలవిముక్తికొరకు చిరువయసులోనె తనజీవితాన్ని ఫణముగపెట్టిన త్యాగశీలి అల్లూరి మనకుఆదర్శప్రాయుడు.

No comments:

Post a Comment