WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 29 March 2014

THE STORY ABOUT PUSHKARUDU AND THE MEANING OF PUSHKARAM - ARTICLE IN TELUGU ABOUT PUSHKARAM


పుష్కరుడి కథ - పుష్కరమంటే ఏమిటి?
పుష్కరం అంటే "పోషయతి అథవా పుష్ణాతీత పుష్కరం" పుష్టినిచ్చి పోషించేది అని అర్థం. పుష్కరాన్ని గురించి పరంపరగా ఎన్నో గాథలున్నాయి. బహుజన వ్యాప్తిలోని ఒక కథ ఇలా ఉంది. "ముద్గలుడనే మహర్షి పరమశివుణ్ణి గురించి మహాతపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ మహర్షి మరేమీ కోరుకోకుండా శివునిలో తనను లీనం చేసుకోమన్నాడు. శివుడు అతడ్ని తన అష్టమూర్తులలో ఒకటైన జలమూరతితో లీనం చేసుకుంటూ ఆ మహర్షికి పుష్కరుడని పేరుపెట్టాడు. అంతేకాక విశ్వంలోని మూడున్నర కోటి తీర్థాలకు రాజును చేశాడు. భూతత్వాన్ని కమండలంగా చేసి పుష్కరుని అందులో ఉంచి బ్రహ్మదేవునికిచ్చాడు. ఆ కమండల జలమే పుష్కరతీర్థంగా మారింది. మూడున్నరకోట్ల పుణ్య తీర్థాలతో దేవతలతో అందులో ఉంటూ అక్కడ స్నానాదులు చేసిన వారిని తరింపజేస్తున్నాడు.
ఆ పుష్క్రర తీర్థాన్ని గూర్చి తెలుసుకుందాం. పూర్వం హిమాచలంలో 'సరస్వతి' అనే నది పుట్టినది. అది వేదకాలం నాటికే ప్రసిద్ధి చెంది ఉంది. మహర్షులు ఆ నదీ తీరంలో ఉండగా వేదాలను దర్శించారు. ఆ తీరంలో వేదోక్త యజ్ఞకర్మలు ఆచరించారు. అక్కడ నుంచే ప్రపంచానికి వేదవిజ్ఞానాన్ని చాటారు. ఆ నదీ జలాల మహిమను తెలుసుకున్న మహర్షులు ఆ సరస్వతిని విద్యాధి దేవతగా గుర్తించారు. ఆ నది దక్షిణ దిశగా ప్రవహించి 'దృషద్వతి - అ వయా' అనే రెండు నదులతో కలిసి రాజస్థాన్‌ ద్వారా పశ్చిమ సముద్రం (అరేబియా సముద్రంలో) కలుస్తుండేది. తర్వాత కొన్ని వేల ఏళ్ళ క్రిందట రాజస్థాన్‌లో జరిగిన భూపరిణామాల వల్ల సరస్వతి ప్రవాహం పైకి పారకుండా భూమిలో ఇంకిపోయి సమీపంలో ఉండే యమునా నదిలో కలిసిపోయింది. ప్రయాగలో ప్రస్తుతం గంగ, యమునలు కలుస్తున్న యమునలో సరస్వతి అంతర్వాహినిగా ఉన్న సంగతిని తెలుసుకున్న ఋషులు సరస్వతిని కలుపుకొని త్రివేణీ సంగమమని అంటున్నారు. సరస్వతి ఇప్పుడు కొన్ని మడుగులుగా మారి మిగిలిపోయింది. ఆ మడుగులో పుష్కర తీర్థం ఒకటి. 'మహా భారతంలో పుష్కర తీర్థ ప్రస్తావన ఉంది.
" కురుక్షేత్రే గయాం గంగాం! ప్రభాసం పుష్కరం చ యత్‌ 
ఏతాని పుణ్యతీర్థాని! ధ్యాత్వా మోక్షమవాప్నుయాత్‌"

నారద పద్మ పురాణంలో గూడా పుష్కర తీర్థం వర్ణించబడింది. ప్రసిద్ధ బౌద్ధక్షేత్రమైన 'సాంచీ'లో దొరికిన 3వ శతాబ్దినాటి శిలాశాసనంలో పుష్కర తీర్థ ప్రశంస ఉన్నది. రాజస్థాన్‌లోని అజ్మీరుకు 36 కి.మీ దూరంలో ఉన్న పెద్ద సరస్సును ఆ ప్రజలు 'పోఖరా' అంటున్నారు. అదే పుష్కర తీర్థం. వేదరాశి జన్మించిన పవిత్రనదీ భాగమైనందున మహాపవిత్రమైంది.
పుష్కరుడంటే వరుణదేవుడని ఒకచోట, మహాపుణ్య పురుషుడని ఒకచోట, పుష్కరమంటే తీర్థమని, సరస్సు అనీ పురాణాలు రకరకాలుగా వర్ణించాయి. పుష్కరుడ్ని బ్రహ్మ సృష్టి చేసాడని, అతడు శివుడి కోసం తపస్సు చేశాడని కూడా కొన్ని పురాణాలు వివరించాయి. పుష్కరుడ్ని తీర్థరాజు అని పిలుస్తారు. ఈలోకంలో నదులన్నీ తమలో స్నానం చేసిన వారి పాపాలన్నింటినీ స్వీకరించడం మూలంగా వాటి పవిత్రత క్షీనించడాన్ని గమనించి పుష్కరుడు చాలా చింతించేవాడు.
ఒకనాడాయన పరమశివుడి కోసం తపస్సు చేసి నదుల దోషాలన్నింటినీ ప్రక్షాళనం చేసే మార్గాన్ని అర్థించాడు. శివుడికి గల ఎనిమిది దేహాలలో జలరూపమైన దేహాన్ని తనకనుగ్రహించమని కోరాడు. దాని ప్రభావం వల్ల పుష్కరుడికి అనంతమైన శక్తి ప్రాప్తించింది. నదులలో పాపాలన్నింటినీ తొలగించగల ప్రభావం లభించింది. అందుకే నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివసించవలసిందిగా అభ్యర్థించసాగాయి. అటు పిమ్మట పన్నెండు పుణ్యనదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. ఈ ఏర్పాటు సురగురువైన బృహస్పతి సంచారాన్ని అనుసరించి నిర్ణయమైనది. అంటే మేషరాశి, వృషభరాశి, మిధునరాశి, ఇలా వరుసగా 12 రాసులలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో అప్పుడే పుష్కరుడు కూడా ఆయా నదులలో నివసించేలా ఏర్పాటయింది. కనుక ప్రతీ నదికీ 12 ఏళ్ళకోసారి పుష్కరుడి ఆగమనం సంభవిస్తుంది. అంటే ప్రతినదీకి 12 ఏళ్ళకు ఓసారి పుష్కరాలు వస్తాయి.
పుష్కరాలు వచ్చినపుడు ఆనదిలో స్నానం చేస్తే మూడున్నరకోట్ల తీర్థాలలో స్నానంతో సమానం అన్నమాట. ఇలా పన్నెండు పుణ్యనదులకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలొచ్చే క్రమం ఇదిగో ఈ వరసలో ఏర్పాటయింది.
శ్లోకం|| మే షే గంగా వృషే రేవా గతేయుగ్మే సరస్వతీ
యమునా కర్కటేచైవ గోదాసింహం గతేపిచ
కన్యాయాం కృషవేణీచ కావేరీచ తులాగతే
వృశ్చికేస్యాద్భీమరథీ చాపే పుష్కరవాహినీ
మృగే తుంగా ఘటే సింధుః ప్రణీతా తటనీ ఝషే
తిష్ఠన్న బ్దాత్సురగురుః క్రమాత్సర్యే మునీశ్వరాః

సురగురువగు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపుడు గంగానదీ పుష్కరము, వృషభరాశినందు ప్రవేశించినపుడు నర్మదానదీ పుష్కరము, మిధున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరము, కర్కటరాశి యందున్నచో యమునా నదికి, సింహరాశి యందున్న గోదావరికీ నదికీ, కన్యారాశియందు కృష్ణానదికి, తులయందు కావేరి నదికి, వృశ్చికరాశి యందు బీమరథీనదికి, ధనూరాశి నందు పుష్కరనదికి, మకరము నందు తుంగభద్రానదికి, కుంభమందు సింధునదికి, మీనరాశియందు ప్రణీతానదికి పుష్కరం.
పుష్కరంలో ఏం చేయాలి?
పరమ పవిత్రము, దుర్లభము అయిన పుష్కరము నదులకు వచ్చినపుడు ఆస్తిక జనులు తప్పక ఆచరించవలసిన కొన్ని కర్మలను శాస్త్రకర్తలు విధించినారు. వాటిని శ్రద్ధతో ఆచరిస్తే విశేష ఫలములు కలుగుతాయి. ఆ విధులు ఇలా ఉన్నాయి.
1. స్నానం: నదిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేసి విధిప్రకారం కొందరు దేవతలకు ఆర్ఝ్యాదులు వదలవలెను.
2. పుష్కరాదుల పూజ: స్నానం చేసి బయటకి వచ్చి ఒక సమతల ప్రదేశంలో కూర్చుని యధావిధిగా నదికి - బృహస్పతికి - పుష్కరరాజుకు విడివిడిగా షోడశోపచార పూజలు చేయవలెను. నదిలో అనుకూలముండదు. తొందర అవుతుంది.
3. పితరులకు శ్రాద్ధ తర్పణాలు: పుష్కర కాలంలో నదీతీరంలో తమ పితరులకు శ్రాద్ధకర్మలు చేయవలెను. అందువల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ శ్రాద్ధకర్మ వల్ల మరణించిన వారికి పుణ్యలోక ప్రాప్తి చేసిన వారికి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలకు పిండాలు పెట్టి శ్రాద్దం చేయలేని వాళ్ళు పెద్దల పేరు మీద నువ్వులు నీళ్లతో తర్పణాలైనా వదలవలెను.
4. దానాలు: పుష్కర సమయంలో తమ తమ శక్తికి తగినట్లు దశదానాలలో వేటినైనా దానం చేయవలెను.
దశదానాలంటే - 1. గోదానము, 2. భూదానము, 3. హిరణ్యదానము (బంగారు), 4. రౌప్యదానము (వెండి), 5. వస్త్రదానము (పంచలుగాని, సెల్లాగాని), 6. తిలదానము (నూవులు), 7. ఆజ్యదానము (పాత్రలో నెయ్యి వేసి చ్చుట), 8. ధాన్యదానము (ఒక పాత్రలో బియ్యం పోసి ఇవ్వడం), 9. గుడదానము (బెల్లం), 10. లవణదానము (ఉప్పు) ఈ దానాలు శక్తి ఉన్నవాళ్లకు, లేనివాళ్ళకూ అనుకూలంగా ఉన్నాయి. ఈ విధులు ఆచరించుటతో పుష్కరంలో కర్తవ్యం నిర్వహింనట్లు కాగలదు.
పుష్కర స్నానం - నియమాలు
పుష్కరస్నానానికి గాని, తీర్థస్నానానికి గాని వెళ్ళినపుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు పాటించడం ఉత్తమం.
తీర్థ స్థలానికి చేరిన రోజు ఉపవాసం చేయడం వాటిలో ఒకటి.
దంపతులు కలిసే స్నానం చేయాలి. బ్రహ్మముడి వేసుకుని ఈ స్నానం చేయాలి.
పురుషులు శిఖమాత్రమే ఉంచుకుని శిరోమండనం చేయించుకోవాలి. స్త్రీలు శిరోమండనం చేయించుకోరాదు.
తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.
పుష్కర దినాలలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.
సమీప బంధువులకు, పిండ ప్రదానం చేయవచ్చు. తర్పణం విడవవచ్చు. స్నేహితులకూ ఆత్మియులకూ పిండ ప్రదానం చేస్తే సరిపోతుంది.
పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.
తీర్థాల సమీపంలో మలమూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, బట్టలు ఉతకడం చేయరాదు.
స్నానం చేసే సమయంలో నిట్టనిలువుగా మూడు సార్లు మునకలు వేయాలి.
సంప్రదాయం కోసమే కాకుండా ఆరోగ్య కరమైన వాతావరణం కోసం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
ఏ రోజు ఏ దానం
మొదటి రోజు - సువర్ణ, రజిత, ధాన్య, భూదానలు.
రెండోవ రాజు - వస్త్ర, లవణ, ధేను, రత్న ధానాలు.
మూడవ రోజు - అశ్య, శాక, ఫల దానాలు.
నాల్గవ రోజు - ఘృత, తైల, క్షీర, మధు దానాలు.
ఐదవ రోజు - ధాన్య, శకట, మహిష, వృషభ, హల దానాలు.
ఆరవ రోజు - ఔషద, కర్పూర, కస్తూరి, చందన దానాలు.
ఏడవ రోజు - గృహ, పీఠ, శయ్య, ఆందోళికా దానాలు.
ఎమిదవ రోజు - చందన, పుష్పమాల, మూల ఆథృక దానాలు.
తొమ్మిదవ రోజు - పిండ, దాసీ, కన్య, కంబళ దానాలు.
పదవ రోజున - శాక, సాలగ్రామ, పుస్తక దానాలు.
పదకొండవ రోజు - గజాది దానాలు.
పన్నెండవ రోజు - తిల అజాది దానాలు
దాన ఫలితాలు
సువర్ణ, రజత దానాలతో - సుఖ భోగాలు
భూ దానం - భూ పతిత్వం
వస్త్రదానం - వసులోక ప్రాప్తి
గోదానం - రుద్ర లోక ప్రాప్తి
అజ్వదానం - ఆయుర్వృద్ధి
ఔషధ దానం - ఆరోగ్యం
సాలగ్రామ దానం - విష్ణులోకం
గృహదానం - ధన సౌఖ్యం
శయ్యా దానం - స్వర్గ సుఖాలు
తిలదానం - ఆపదల నివారణ

SWAMI VIVEKANANDA TEACHINGS AND QUOTATIONS


ఒకరు మనల్ని గొప్పవాడన్న,మంచివాడన్న

 అది మనగొప్పతనం,మంచితనం కాదు.

మనల్ని అలాభావించిన ఎదుటి వానిది

 అని నేను నమ్ముతాను.


LIST OF WOMEN HEALTHY FOOD ITEMS FOR WOMEN HEALTHY GROWTH



మహిళలకు ప్రత్యేక ఆహారం

- ఆహారం తీసుకోవడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ జీవితంలో శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలు అవసరం.

-వీలైనంత ఎక్కువ ఆకుకూరలు తినాలి. విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం శరీరానికి అందాలంటే పాలకూరను తీసుకోవాలి. దీనివల్ల ఇనుము లభిస్తుంది. బరువు పెరగరు.

- బ్రెస్ట్‌క్యాన్సర్ బారిన పడకూడదంటే ఒమెగాప్యాటీ ఆసిడ్స్, ఆంటీయాక్సిడెంట్స్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం, పోలిక్‌యాసిడ్స్ తప్పనిసరి. ఇవన్నీ గింజల్లో ఎక్కువగా ఉంటాయి.

- ఈ గింజలను కూరల్లో కాని, ఉడికించి కాని తినాలి.

- మహిళలను ఎక్కువగా వేధించేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే అధికరక్తపోటు, తలనొప్పి, మనోవికలత, డిప్రెషన్ చుట్టుముడతాయి. ఇవి దరిచేరకుండా ప్రత్యేక ఆహారపదార్థాలతోపాటు ఓట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.

- కాల్షియం సమస్యను తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు పాలను తాగడం శ్రేయస్కరం. విటమిన్ డి కూడా లభిస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

NATURAL INDIAN TRADITIONAL PAINTINGS





Wednesday 26 March 2014

SUN STROKE - HOW TO TAKE PROTECTION FROM SUN STROKE - SUN STROKE PROTECTION TIPS IN TELUGU - COCONUT WATER IS THE BEST REMEDY FOR SUN STROKE




వడ దెబ్బ - Sun Stroke

హీట్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..
సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం”ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..

వ్యాది లక్షణాలు

1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,
2. వాంతులు అవ్వడము,
3. నీరసం,
4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,
5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,
6. బ్రమల తో కూడుకున్న అలోచనలు కలగడము,
7. చివరి గా స్పృహ కోల్పోవడము. (తెలివి తప్పిపోవడం)…

చికిథ్స

వడ దెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సి..అత్యవసరం గా చికిథ్స చేయవలసి వుంటుంది, లేకపోతె ఒక్కొసారి ప్రాణాల కే ప్రమదాం..కాని కొద్ది పాటి జాగ్రత్త లతో కూడుకున్న ప్రధమ -చికిత్సకే చాలా త్వరగా కోలుకుంటారు..
1. మొదటిగా పేషంట్ని చల్లపరచాలి.. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని కాని, నీరు కాని మొత్తం శరీరం అంతా సమం గా అప్లై చేయాలి..చల్లని నీరు ఆవిరి రూపం లో ఐతె శరీరం అంతా సమం గా వుంటుంది..
2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన వస్తరాలు కప్పాలి..
3. భుజాలు కింద (ఆక్జిల్ల), గజ్జల్లో ను చల్లని ఐస్ ముక్కలు వుంచాలి..
4. యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..
5. అక్కడ యేమన్న కాంప్లికేషన్స్ వుంటె వారు తగురీతి లో స్పందిస్తారు అవసరాన్ని బట్టి ..
నివారణ మార్గాలు

వడ దెబ్బకి గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటె చాలా మంచిది.. అవి ఏమిటి అంటే...
1. తరచుగా చల్లని నీరు త్రాగడం,
2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…
3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .
4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .
5. మధ్యం సేవించకూడదు .
6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .

BRIEF ARTICLE ON SIMHACHALAM APPANNA


అప్పన్న సన్నిధి.. అందరికీ పెన్నిధి


ఆంధ్రప్రదేశ్‌లోని దివ్య నరసింహ క్షేత్రాలలో నాలుగు అత్యంత ప్రధాన మైనవి. వాటిలో విశిష్టత కలిగి ద్వయ రూపాలతో వరాహ నృశింహునిగా శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలం. విశాఖపట్నానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి రమారమి 820 అడుగుల ఎత్తులో వున్న సింహగిరిపై స్వామి కొలువైవున్నాడు. 

సంపెంగలు, పొన్నలు, జాజులు, విరజా జులు, జీడిమామిడి, అనాస, పనాస మొదలైన పుష్ప, ఫల, వృక్ష శీతల ఛాయలతో ప్రశాంత వాతావరణంలో సుజల సహజ జల ధారల సమీపాన ప్రహ్లాద మండపంలో సాలి గ్రామ పీఠంపై స్వామివారు శ్రీ మహాలక్ష్మి సమేతంగా సుగంధ పరిమళ భరిత చందన చర్చితుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు.ప్రహ్లాద వరదుడు వెలసిన పర్వతం సింహాకారంలో కనిపిం చడం వల్ల ఈ క్షేత్రానికి సింహాచలం అని పేరు వచ్చినట్లు ప్రతీతి. భక్త ప్రహ్లాదుడు కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారం, హిరణ్యకశ్యపుని వధించిన నృశింహ అవతారాల కలయికతో శాంతిమూ ర్తిగా ద్వయ రూపాలతో శ్రీ వరాహలక్ష్మి నృ శింహ స్వామిగా అవతరించినట్లు స్థల పురాణం కథనం.

భూమిపై భక్తులను అనుగ్రహిం చటానికి అవతరించిన శ్రీ వరాహాలక్ష్మి నృశిం హస్వామిని భక్త ప్రహ్లాదుడు కొన్ని వందల ఏళ్ల పాటు అర్చించి తరించాడు. ప్రహ్లాద నిర్మాణా నంతరం స్వామిని పూజించే వారు కరువై ని త్య ధూప దీప నైవేద్యాలకు దూరమై, ఆలయం శిథిలమవగా స్వామివారిపై పెద్ద వల్మీకం వెలసింది. ప్రహ్లాదుని శకం ముగిసిన కొంతకాలం తర్వాత షట్‌ చక్రవర్తులలో ఒకరైన పూరూరవశ్చక్రవర్తి దేవనర్తకి ఊర్వశితో కలిసి సింహగిరిపై విహరిస్తుండగా ఒకనాటి రాత్రి స్వప్నంలో నృశింహస్వామి సాక్షాత్కరించారు. స్వామి పురూరవునితో తానున్న ప్రదేశాన్ని, తెలిపి, పుట్టను తొలగించి ఆలయ ప్రతిష్ఠ చేయవలసిందిగా ఆదేశించారు. పురూరవుడు తక్షణం నిద్ర నుండి మేల్కొని స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ప్రదేశానికి చేరుకుని ఒక మాలతీ నికుంజ ప్రాంతంలో వల్మీకం (పుట్ట) ను గమనించి, దానిని తొలగించి వరాహ నృశింహునుని దర్శించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. 

ఆరోజు వైశాఖ మాసం శుద్ధ పక్ష తృతీయ (అక్షయ తృతీయ). ఏడాదిలో 364 రోజులూ పుట్టకు బదులుగా తనపై పుట్ట మట్టికి సమాన తూకపు (12 మణుగులు అంటే 500 కిలోగ్రాములు) శ్రీ చందనంను పూతగా పుయ్యాలని, ఏడాదికి ఒక్కరోజు వైశాఖ తృతీయ నాడు మాత్రమే (ఆవిర్భవించిన రోజు) స్వామి నిజరూప దర్శనం భక్తులకు కలగజేయాలని సింహాద్రినాధుడు పురూరవ చక్రవర్తిని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం నాటి నుంచి నేటి వరకు పునుగు, జువ్వాది, కస్తూరి, కర్పూరం, కాశ్మీరం వంటి సుగంధ పరిమళాలతో కూడిన శ్రీ చందనంతో ఏడాదికి 364 దినాలు కప్పబడి, ఒక్క రోజు అంటే వైశాఖ శుక్ల తదియ నాడు శ్రీ వరాహ నృశింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించడం ఆచారంగా వస్తోంది. 

ఆరోజు రాత్రి ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన శ్రీ వైష్ణవ స్వాములు పవిత్ర గంగధార జలాలను నియమనిష్టలతో తీసుకురాగా, అష్టోత్తర సహస్రాత్మక(1008) కలశాలతో సహస్ర ఘటాభిషేకం, పంచా మృతా భిషేకం ఫలరసాల అభిషేకాలను పవిత్ర వేదమంత్రాల నడుమ నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అనంతరం ముందుగా అరగదీసి సిద్ధం చేసిన మూడు మణుగుల శ్రీ చందనాన్ని స్వామిపై పూతగా సమర్పిస్తారు. ఆరోజున స్వామివారి నిజరూప దర్శనం, చందన యాత్ర నిర్వహిస్తా రు సింహాచల దేవస్థానం అధికారులు.
మే నెల 2వ తేదిన చందన యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు

Tuesday 25 March 2014

HEALTHY ADVANTAGES OF EATING CURD DAILY - NUTRITIOUS BENEFITS WITH CURD - TELUGU ARTICLE ON CURD



* 4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.
* ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు .

* కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి ,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి .
* పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .

* పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సియం శాతం ఎక్కువ . కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.

* విటమిన్ బి , పాస్ఫరస్ , పొటాసియం , మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి .

* పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది .

* పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర , కరివేపాకు , చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి , డయేరియా తగ్గును .

* పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది .

* పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం.

* పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.

* రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు..శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి.

* అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.

DEAR COOK FOR ME TODAY - TELUGU CARTOONS COLLECTION


నా ముద్దుల శ్రీవారు ;

మనకి పెళ్లి అయి ఇరొజుకి సరిగ్గా 

సిక్స్ వీక్స్ ఫోర్ డేస్ త్రీ హౌర్స్ ఫైవ్ మినిట్స్ ;

ఇట్ట్స్ గ్రేట్ ;

ప్లీజ్ గో టు  కిచెన్ అండ్ కుక్ ఫర్ మే టుడే; డియర్ 

HOW MANY GODS TO PUT IN HOME PUJA MANDIRS AND HOW TO PERFORM PUJA IN PUJA MANDIRS - TELUGU DEVOTIONAL ARTICLE ON PUJA IN PUJA MANDIRS



పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

శ్లో || ఆదిత్య గణనాథం చ దేవీం రుద్రం చ కేశవం |
పంచదైవత్యమిత్యుక్తం సర్వకర్మసు పూజయేత్ ||

మన హిందూ సాంప్రదాయంలో కులాలకు అతీతంగా ఆస్తికులైన వారందరూ తమ పూజా మందిరాలలో

 ఐదుగురు (పంచదేవాతలు) విగ్రహాలను ఉంచి పూజించాలి. అవి సూర్యుడు, గణేశుడు, (దేవి) పార్వతి,

 శివుడు, విష్ణువు. వీరిని సమిష్టిగా పంచాయతన అని వ్యవహరిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా కూడా

 భావించవచ్చు. మన హిందూ, సనాతన సాంప్రదాయ రీత్యా ఈ పంచాయచన పూజ ఎంతో శ్రేష్ఠమైనదిగా

 మహా ఋషులు తెలిపారు. సకల శుభకార్యాలలోనూ, ప్రతినిత్యం ఈ ఐదుగురు దేవతను పూజించటం

 ఆ గృహంలో నివశించేవారందరికీ శ్రేయస్సు చేకూరుతుంది. ఈ ఐదుగురు దేవతలా విగ్రహాలు, చిన్నవి

 మీ గుప్పిటలో సరిపోయే కొలత ఉన్నవి వీటిని ఒక పళ్ళెంలో వుంచుకుని పూర్వాభిముఖంగా

 కూర్చుని పూజ చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టతో శుభ్రపరచాలి. సమయాభావం ఉన్నవారు కేవలం

 ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే ...?

కేవలం పంచ ఉపచార పూజ ... దేవతల పేర్లు చెప్పి 

1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం సమర్పయామి అంటే చాలు. అయితే అన్నిటికంటె

 ముఖ్యంగా భగవంతుని పూజలో, ఉపచార సమర్పణలో అర్చనచేసే వ్యక్తి భక్తిశ్రద్ధలే గీటురాళ్ళు.

 అందుకే చివరగా శాస్త్రం "తత్ర భక్తి శ్రద్ధా గరీయసీ'' అంటుంది.

TELUGU ARTICLE OF LORD SRI SURYANARAYANA / LORD SURVA DEVA



జగతికి వెలుగు సూర్యుడు 

అదితి, కశ్యపుల కుమారుడు సూర్యుడు. సూర్యుని భార్య సంజ్ఞ. వీరిరువురి సంతానం యముడు, యమున. సూర్యుని వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్ళిపోతుంది సంజ్ఞ.

అశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమెకు జన్మించిన వారే అశ్వనీదేవతలు. సూర్యుని వద్ద మారురూపంలో ఉన్న స్త్రీ ఛాయ. వీరి సంతానం శని, సావర్ణి, తపతి. మోహినీ అవతారంలో విష్ణుమూర్తి రాక్షసులకు అమృతము పంచుతూ, దేవతల రూపంలో ఉన్న రాహుకేతువులకూ అమృత మిచ్చినప్పుడు దానిని సూర్యుడు, చంద్రుడు గుర్తిస్తారు. ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పగా, అతడు సుదర్శనంతో రాహుకేతువుల శిరస్సులు ఖండిస్తాడు.

సూర్య చంద్రులపై పగబూనిన రాహుకేతువులు అప్పుడప్పుడూ సూర్యుడినీ, చంద్రుడినీ మింగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు వస్తాయని పురాణాల కథనం. మహాభారతంలో కుంతికి సూర్యునికి జన్మించిన వాడే కర్ణుడు. ఇంకా సూర్యుని గురించి పురాణాలలో అనేక సందర్భాలలో కనిపిస్తుంది.

MESSAGE FROM LORD HANUMAN - MEANING OF LORD HANUMAN - TELUGU ARTICLE ON LORD HANUMANJI



హనుమంతుడి సందేశం ?

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

TELUGU ARTICLE ON PUDINA LEAVES - THE HEALTHY BENEFITS OF USAGE OF PUDINA IN DAILY LIFE


అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు

1.పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. 

2.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. 

3.అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది

4.స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం బహుబాగా పనిచేస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

5.గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

6.గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

7.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మౄఎదువుగా మారుతుంది.

8.గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9.పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వౄఎద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

Saturday 15 March 2014

AN ARTICLE ON DYANAM - TELUGU SPIRITUAL ARTICLES



మనస్సు అంటే ఆలోచనల పుట్ట. ఆలోచనల్ని తీసేస్తే మనస్సు లేదు. ఇది మనకు ఎలా తెలుస్తుంది. గాఢనిద్రలో మనస్సూ లేదు, ఆలోచనలూ లేవు. మనస్సును నియంత్రించటం సాధ్యమే. ప్రతీోూ ధ్యానంలో మనస్సును నియంత్రించాలి. మనస్సును అదుపుచేయడం అసాధ్యం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు నిజమే అని ఒప్పుకొంటూ "మనస్సునును అదుపుచేయడం కష్టమే కానీ, అసాధ్యం కాదు" అంటూ ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు మనస్సును నిగ్రహించవచ్చు అంటాడు. ప్రపంచంలోని ఋషులు, మునులు, అవతార పురుషులు అధ్యాత్మిక సాధకులు, శాస్త్రవేత్తలు అందరూ మనస్సును అదుపులో పెట్టుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అలాగే కర్మేంద్రియాల్నీ, జ్ఞానేంద్రియాల్నీ వశపరచుకోవాలి. మనం ఎంచుకొన్న లక్ష్యం వైపుకే "తైలధార"లాగ (ఒకపాత్ర నుండి మరొక పాత్రలో నూనె పోస్తున్నప్పుడు అవిచ్ఛిన్నంగా ధారపడేటట్లు) మనస్సును పంపాలి. ఏకలవ్యుడు, అర్జునుడు మొదలైన వాళ్ళు చేసింది అదే. ధ్యానంద్వారా మనస్సును నిశ్చల పరచవచ్చు. జీవితంలో అనుకొన్న లక్ష్యాన్ని సాధించిన వారందరూ మనస్సును నిగ్రహించే విజయులయ్యారు.

BE POSITIVE - ALWAYS TRY TO ACHIEVE THE GOAL IN POSITIVE WAY



మేఘం సూర్యుణ్ణి మరుగునపరిచినప్పుడు అలముకున్న 

అంధకారం తాత్కాలికమే! 

అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా తాత్కాలికమే 

అని తలచిన ధీరులను జయం తప్పక వరిస్తుంది.


- స్వామి వివేకానంద

YOGI VEMANA SATAKAMULU





ఓ వేమనా !

హీనమైన బుద్ధి గలవానికి అధికారము కట్టబెట్టినచో 
అతడు అక్కడ ఉన్న మంచి వారినందరినీ వెళ్ళ గొట్టును . 
వారిని అవమానపరుస్తాడు. 
ఎందుకనగా చెప్పును తినే కుక్కకు 
చెరుకు తీపి తెలియదు. 
అట్లే హీనునకు అధికారము వచ్చినను 
వానికి మంచి గుణములు తెలియవని భావము. 

- వేమన శ తకము  - 20

SRI KRISHNA SATAKAM meaning in Telugu




ఓ కృష్ణా  - నీవు లొకముల కెల్ల ప్రాభువైననూ 
చేతిలో వెన్న ముద్డయు, సిగలో నెమలి పింఛమును ,
ముక్కున ఆణి ముత్యమును ధరించి 
పసి బాలునివలె ఉంటివి  గదా !

-- శ్రీ కృష్ణ శతకం 

TELUGU ARTICLE ON HOLI FESTIVAL AND ITS IMPORTANCE



హోలి పండుగ

మనిషి అందం శరీరవర్ణంలో కాదు, మనసులో ఉంటుంది, అతని గుణగణాలలో, చేసే కర్మ(పని)లో ఉంటుంది. అది చెప్పడానికే అన్ని వర్ణాలకు అతీతమైన పరమాత్మ, ఏ రూపమూ, ఏ రంగు లేని పరమాత్మ, కృష్ణ(నల్లని)వర్ణంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.

ఒకసారి చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి " అమ్మా! చూడమ్మా! రాధ తెల్లగా, అందంగా ఉంది. నల్లగా ఉన్నానని నన్ను ఆటపట్టిస్తోంది" అంటాడు. ఆ విషయం మన చూసుకుందాం అన్న యశోద, రాధ మీద రంగులు చల్లమని సలహా ఇస్తుంది.

అల్లరి కృష్ణుడు రాధతో పాటు బృందావనంలో ఉన్న గోపికల మీద కూడా రంగులు చల్లుతాడు. ఎన్ని రంగులు చల్లినా రాధ మాత్రం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుంటుంది. అలా శ్రీ కృష్ణపరమాత్మ రాధతో జరిపిన లీల హోలీ.

నిజానికి రాధ అంటే ఒక పాత్ర/వ్యక్తి కాదు. మహాభారతంలో రాధ ప్రస్తావన ఎక్కాడ కనిపించదు. రాధ అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాల మీద పట్టు సాధించినవారని/జయించినవారని అర్దం. ఆత్మ తత్వం అర్దమైనవారు ఇంద్రియాలను జయిస్తారు. అలాంటి వారు పరమాత్మకు చాలా దగ్గరగా జీవిస్తారు. అలా పరమాత్మకు దగ్గరైనవారి మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అటువంటి వారితో(రాధ) పరమాత్ముడు ఆడే దివ్య లీల హోలీ.


DEVOTIONAL ARTICLE ON GODDESS SRI MAHA LAKSHMI IN TELUGU



యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 

ఈ చరాచర జగత్తులోని అన్ని జీవులలో , బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవి. ఆ తల్లినే విద్యా లక్ష్మి గా కొలుస్తాము. " విద్య " అనగానే మనకళ్ళముందు వాగ్దేవి సరస్వతి మాత ప్రత్యక్షం అవ్వడం అనేది సహజం. శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి సరస్వతి దేవి. ఆమే అనుగ్రహం ఉన్నవాళ్ళు మహావిద్వాంసూలుగా , ఙ్ఞానులుగా ప్రసిద్ధికెక్కుతారు.

విద్యాలక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికి, విద్యా సంపదతో పాటు, ఐశ్వర్య సంపద కుడా కలుగుతుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి సప్తమ అంశ అవతారమైన ఈ విద్యాలక్ష్మీని పూజించినవారు త్వరిత గతిన ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

జన్మలన్నిటిలోను మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎందుకంటే,జీవులలో మనిషికి మాత్రమే వివేకం, మంచి చెడులను గుర్తించే శక్తి, బుద్ధి కుశలతలను ఆ పరాశక్తి వరాలుగా అనుగ్రహించింది.

"విద్యలేనివాడు వింత పశువు" అని అంటారు. ఇలాగ విద్యావంతుడైన వ్యక్తిని అందరూ గౌరవించాలంటే ' వినయం' అనే లక్షణం చాలా ముఖ్యం.
"విద్యా వినయ సంపన్నే " అన్నారు పెద్దలు. వినయం లేని అహంకారి, ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎవరు గౌరవించరు.

శ్రీ విద్యాలక్ష్మి అనుగ్రహం ఉన్నవారికి వినయ సంపద కుడా అమ్మవారే వరముగా ఇస్తుంది .

విద్యా ప్రతిభ ,వినయం,మృదు సంభాషణ కలిగిన వారికి సమస్త సంపదలు అప్రయత్నముగ లభిస్తాయి.

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి శాంతి సమావృత హాసముఖే
నవ విధి దాయిని కలిమలహారిణి కామ్యఫలప్రద హాసయుతే
జయ జయహే మధుసూధన కామిని శ్రీ విద్యా లక్ష్మీ జయ పాలయమాం

Friday 7 March 2014

LIST OF DO'S AND NO DO'S/POINTS TO BE REMEMBER TO VISIT A HINDU TEMPLE



దేవాలయంను దర్శించుకునే పధ్ధతి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇది మంచి పధ్ధతి కాదు.నిరసన, సమ్మె చేసే వారు మాత్రమె సగం దుస్తులు ధరించి 'అర్ధనగ్న ప్రదర్శన' చేస్తారు. ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .)

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

హిందూ ధర్మములను ఆచరించండి ఆచరింపజేయండి.

ARTICLE ON THE IMPORTANCE OF SRI PANCHAMI / VASANTHA PANCHAMI - SRI SARASWATHI PUJA IN TELUGU



శ్రీ పంచమి./ వసంత పంచమి విశేషాలు.!

మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి / వసంత పంచమి అంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తల స్నానం ఆచరించి, నిత్య నైమిత్తిక కర్మలు పూర్తీ చేసుకొని ' జ్ఞ్యాన ప్రదాత అయిన ఆ సరస్వతిని ' పూజించాలి. సరస్వతి దేవి ఈ రోజునే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలు కూడా ఆ భారతిని కొలుస్తారు.
సరస్వతి దేవి కృప వలెనే జ్ఞ్యాన విజ్ఞ్యానాలు వృద్ధి చెందుతాయి. లౌకికమైన చదువులతోపాటు, పరమమైన బ్రహ్మ విద్య కూడా ఈ జగజ్జనని ప్రసాదిస్తుంది.
సరస్వతి దేవి విగ్రహం లేని వారు ఆ దేవి చిత్రమును కాని, పుస్తక రూపంలో గాని అర్చించాలి. చాలా మంది సరస్వతిని పిల్లలు, విద్యార్థులు మాత్రమె అర్చించాలి అనుకుంటారు. ఆబాల గోపాలమంతా ఆ శారదాంబను అర్చించవచ్చు జ్ఞ్యాన వికాసం అందరికీ అవసరమే .
ముఖ్యంగా జ్యోతిష్కులు ఆరాధిస్తే ఆ వాగీశ్వరి కటాక్షంతో వాక్శుద్ధి లభిస్తుంది.
ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి, తెల్లని వస్త్రాలను ధరించాలి, గృహానికి మామిడి తోరణాలు అలంకరించి, అమ్మవారిని షోడశ ఉపచారాలతొ పూజించి క్షీరాన్నం నివేదించాలి.ఎక్కువగా తెల్లని పూలు వాడాలి.

జోతిసశాస్త్ర పరంగా ఈ రోజున ( ఈ సారి మంగళవారం రావడం చేత పనికిరాదు ) అక్షరాభ్యాసాలు ముహూర్తాలకు చాలా మంచిది.
!! సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం !!

ప్రథమం భారతినమ ద్వితీయం చ సరస్వతి !
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహని ||
పంచమం జగతీ స్థాథ షష్ఠం వాగీశ్వరి తథ !
కుమరీం సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిని ||
నవమం బుద్ధిధాత్రి చ దశమం వరదాయిని !
ఏకాదశం క్షుద్రగమ్తా ద్వాదశం భువనేశ్వరి ||
బ్రాహ్మి ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పథెన్నరహ్ |
సర్వసిద్ధికారి తస్య ప్రసన్న పరమేశ్వరి |
సామే వస్తూ జిహ్వాగ్రే బ్రహ్మరుప సరస్వతి ||

BRIEF STORY OF LORD SHIV'S FESTIVAL - MAHA SIVARATHRI IN TELUGU



మహాశివ రాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము.