WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 26 April 2016

VEMULAWADA BHIMA KAVI - OM KARAM


యో వేదా దౌస్వరః ప్రాక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః |
తస్య ప్రకృతిలీనస్య యః పరస్సభీమలింగేశ్వరః ||
ఓంకారం విశ్వాన్ని విచ్చిన్నంకాకుండ కాపాడుతుంది, వేదవిజ్ఞానం విశ్వంలోని మానవులకు జ్ఞానాన్ని పంచుతుంది మరియు జీవనగమనాన్ని తెలుపుతుంది. ఓంకారం, వేదవిజ్ఞానం మానవ జీవితాలకు అనుసందానంగా, మార్గదర్శకంగా ఉన్నాయి.
“ ఓంకారం పరమశివుడి ప్రతిరూపం, వేదం బ్రహ్మ స్వరూపం ”
పరమాత్ముడు సృష్ఠిస్థితలయకారకుడు, ఈ సృష్ఠిలో జీవి తమ జీవనగమనంలో ముఖ్యంగా మానవజీవనంలో స్థబ్దత వచ్చిన ప్రతిసారి పరమాత్ముడు మానవరూపంలో అవతరిస్తున్నాడు, మానవజన్మ ఆవశ్యకతను తెలియపరుస్తున్నాడు.
అందులో భాగంగానే భరతఖండంలో రాజ్యహింసలు జరుగుతున్న తరుణంలో, ప్రజలు ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్నప్పుడు పరమేశ్వరుడి ప్రతినిధిగా, ప్రతిరూపంగా తూర్పు గోదావరి జిల్లా, కరప మండలంలో గల వేములవాడ గ్రామమున శ్రీమతి మాచమ్మ మరియు శ్రీ సోమనాథమాత్యులు దంపతులకు ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా ఒక మగ శిశువు జన్మించాడు. ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా బిడ్డ జన్మించాడు కాబట్టి ఆ బిడ్డకు భీమన్న అని నామకరణం చెసారు.
ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా, ప్రతిరూపంగా ఈ భువిపై మానవరూపాన జన్మిచాడు కాబట్టి జనజాగృతి చెయదలచి మెదటి దశలో కవిగా(వేములవాడ భీమకవి) తన పద్యకుసుమాలద్వారా మానవజన్మ ఆవశ్యకతను తెలియపరిచాడు. మలిదశలో పరమేశ్వరుడి ప్రతిరూపం భీమలింగేశ్వరుడిగా దేశాటనం చేస్తూ చివరగా అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామములో జీవసమాధినోందా

No comments:

Post a Comment