కాకికి అన్నం పెట్టడం ఎందుకు?
వాల్మీకి రామయణమందు కొన్ని ప్రాణుల ప్రత్యేకతను వివరించి వుంది. పూర్వ కాలంలో మరుత్ అనే రాజు దేవ గురువు బృహస్పతి సహోదరుడైన సంవర్తుని ఆధ్వర్యముతో ఒక యాగమును చేసెను. ఆ యాగమునకు ఇంద్రాది దేవతలు సహాయ సహకారాడులను అందించిరి. అప్పుడు అచ్చటికి రావణుడు వెంచేసేను అతని అసాధ్యమైన బల పరాకరమునకు బ్రంహ వారమునకు అంజి దేవతలు తమ రూపాదులను పక్షులుగా మ్రుగాములుగాను మార్చుకొని దాగుకోనిరి. రావణుడు ఒక అపరిశుబ్రమైన శునకము వలే సభలోకి వేంచేసి మరుత్ను యుద్ధమునకు ఆహ్వానించెను. యుద్ధమునకు అంగీకారము లేకపోతె ఓటమిని ఒప్పుకోనమని నిర్భందించెను. అప్పుడు రాజు నువ్వెవరని ప్రశ్నించితే రావణుడు ఒక అలక్ష్య నవ్వు నవ్వి నన్ను గుర్తించలేదా నీ అమయాకత్వానికి జాలి కలుగుతోంది నేను కుబేరుని అసహోధరుడిని అతనిని జయించి ఈ పుష్పక విమానమును పొందితిని. దానికి రాజు నువ్వు నీ సహోదరునే యుద్దములో జయించావా ముల్లోకములలోను నీ లాంటి వీరుని కాంచడం కష్టము కటిన తరమైన తపము ఆచరించి గొప్ప వరములు పొందినది ఎందుకు నేను ఇంతవరకు నిన్ను గురించి వినబడలేదు దూర్తుడా కాచుకొమ్ము నువ్వు ప్రాణములతో తిరిగి వెళ్ళలేవు నిన్ను ఇచ్చటనుండి నేరుగా యమపురికే పంపుతాను అని యుద్ధమునకు సన్నాహములు చేయబోయేను
అప్పుడు అధ్వర్యుడు సంవర్తుడు రాజా నా మాట మన్నించు మహేశ్వరుని గురించి చేసే యాగ మధ్యలో త్యజించడం నీ వంశ నాశనానికి హేతువు అవును యాగ దీక్షలో ఉండేటప్పుడు యుద్ధము కోపము తగదు యుద్ధము అంటే జయము నీకే నిశ్చయము కాదు అదియు కాక రావణునితో యుద్ధము చాలా శ్రమముతో కూడిన కార్యము అని హిత వచనములు పలికెను రాజు దానికి అంగీకరించి యాగము చేయడానికి పూనికోనేను అప్పుడు రావణుని మంత్రి రావణుడు జయము పొందెను అని ఘోశించెను రావణుడు కూడా ఆ స్థలము విడచి వెళ్ళిపోయెను.
అప్పుడు ఇంద్రాది దేవతలు తమ స్వయ రూపములతో సభలోనికి వెంచేసిరి ఇంద్రుడు నెమలి రూపములో ఉండినందున నెమలికి సర్ప భయము వుండదు ప్రజలు నిన్ను చంపరు. నీ నీలిరంగు పించ్చమునందు నా వేయి నేత్రముల వలే నీకును కలుగును వర్ష ఆగమనమునకు పూర్వము నువ్వు పించ్చము విప్పదీసుకొని ఆడటము చూడడానికి వేయి కళ్ళు చాలదు అంత రమణీయముగా ఉండును అని వారము ఇచ్చెను
యముడు కాకిని చూసి నాకు నీయందు చాలా ప్రీతి కలిగినది నీ వల్ల ఎవ్వరికీ ఏ రోగము రాదు నిన్ను ఎవ్వరు చంపరు నీకు అందించే ఆహారము వల్ల పితృ లోకములో పితరులు క్షుద్భాద నుండి విముక్తులు అవుదురు
వరుణుడు హంసకు పూర్ణ చంద్ర బింబము లాంటి కలుగునట్టు వరము ఇచ్చెను నిన్ను నీటిలో విహరిన్చందము చూసే దానికి రమణీయముగా కనపదేఅట్టు వరము ఇచ్చెను ఏ వరమునకు ముందు హంసకు రెక్కలు అగ్రము నలుపుగాను హృదయ భాగము నీలముగాను వుంటూ ఉండెను
ఇక కుబేరుడు తొండకు (ఊసరవల్లి) బంగారు వన్నె రుంగుతో ప్రకాశించేదవు నీ శిరో భాగము అరుణ వర్ణముగా వేలుగొందేటట్టు వరము ఇచ్చను
ఇలా దేవతలు ఆయా ప్రాణులకు వారములు ఇచ్చి రాజు హోమము కొనసాగే వారకు వుంది వరములను ఇచ్చి వెళ్ళిరి.
అందువల్ల కాకికి అన్నం పెడితే పితృదేవతల తృప్తి కలుగును ఇది యమ వరం.
No comments:
Post a Comment