WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 30 January 2016

SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE - BHADRA


 లక్ష్మీ నరసింహ దేవాలయం, భద్ర

ఈ దేవాలయం 13వ శతాబ్దిలో హోయసల వంశస్ధులచే నిర్మించబడింది. విష్ణువర్ధన మనుమడు వీర నరసింహ దీనిని నిర్మించాడు. దీని ప్లాట్ ఫారం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ గుడి మూడు అడుగుల ఎత్తున ఉండి మహా విష్ణువుకు అంకితం చేయబడినట్లు చెప్పబడుతుంది. ఇక్కడ శ్రీక్రిష్ణ, గణేశ, పురుషోత్తమ, మాత శారదాంబల విగ్రహాలను భక్తులు చూసి తరించవచ్చు. ఈ దేవాలయాన్నే త్రికూటాచల గుడి అని కూడా పిలుస్తారు. అదే ప్రాకారంలో బయటవైపు, రాతి స్తంభ ద్వజస్తంభం ఉంటుంది. ఈ దేవాలయ వెలుపలి భాగం హొయసలుల శిల్ప శైలిలో అందంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధీనంలో ఉంది.

No comments:

Post a Comment