WORLD FLAG COUNTER

Flag Counter

Friday 28 February 2014

NICE BODY SIR



దొంగకి ఉండాల్సిన బాడీ గురూ నీది . 

చిన్న కన్నం వేస్తే చాలు 

ఫినిష్ 

SAREE BEAUTY


ఈ చీర కట్టు కున్నప్పుడు ఇలా నడిస్తే తప్ప చూసేవాళ్ళకి 

దీని అందం తెలిదట 

HEALTHY USES WITH IODIZED SALT - USE ALWAYS IODIZED SALT



మీ ఉప్పులో ఐరన్ ఉందా?

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయప పడాలంటే ఆహార నియమాలు పాటించడమే ప్రథమ చికిత్స. నిజమైన చికిత్స కూడా' అంటున్నారు వైద్య నిపుణులు.

రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ పదార్థం తయారుకావడానికి పోషక పదార్థాలైన మాంసకృత్తులు, ఇనుము ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ లెక్కన మగవారిలో ప్రతి 100గ్రాముల రక్తంలో 13 గ్రా., ఆడవారిలో 12 గ్రా., 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11గ్రా., గర్భిణీ స్త్రీలలో 11 గ్రా., బాలింతల్లో 12గ్రా., 7-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రా. హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ ఈ మోతాదు విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో వారు బాధపడుతున్నారని అర్థం. రక్తహీనతకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య తగ్గిపోతుంది. ఆర్‌బీసీ(రెడ్ బ్లడ్ సెల్స్)లోని హిమోగ్లోబిన్, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. అంటే ఆక్సిజన్ రవాణా వ్యవస్థగా ఎర్ర రక్తకణాలు పనిచేస్తాయి.

ప్రధానమైన బలహీనత
మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనతలు రక్తం హీనత. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. రక్తం నష్టపోవడం, రక్తం ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడం, పౌష్టికాహారలోపం. అయితే, సాధారణ పనులకే ఆయాసం రావడం, బలహీనం, నిరాశక్తత, ఆలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 ఏళ్ల వయసుగల మహిళల్లో, పదకొండు సంవత్సరాలలోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. రుతుచక్రం సమయంలో అధిక రక్త స్రావం కావడం వల్ల, పైల్స్ సమస్య వల్ల కూడా ఎనీమియా సంభవించవచ్చు. కొద్ది మంది మగవాళ్లలో కూడా రక్తహీనత సంభవిస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువతో బిడ్బ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, వెంటనే వెంటనే రోగాలు రావటం, చదువులో వెనకపడటం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

రక్తహీనత ఉన్నవారు ప్రధానంగా ఆహార నియమాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలు. ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం తప్పనిసరిగా చేయాలి. రక్తహీనత ప్రమాదకరమైనది కాబట్టే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక పెట్టి ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా అందజేస్తోంది.

ఇనుము కలిసిన ఉప్పుతో...

నిజానికి దేశంలో అధిక శాతం జనాబా రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు ఏర్పడిన కొత్త మార్గం ఇనుము కలిపిన ఉప్పును వినియోగించటం. దీన్ని జాతీయ పోషకహార సంస్థవారు కనుగొన్నారు. సాధారణ ఉప్పుకు బదులు కొత్తగా తయారు చేసిన ఈ ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడటం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. ప్రస్తుతం ఇనుము కలిపిన ఉప్పు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే దొరుకుతోంది.

విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండు, యాపిల్, ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం మానేయాలి. ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తహీనతను అశ్రద్ధ చేయవద్దు. అది కేవలం నీరసానికి మాత్రమే దారి తీయదు. ప్రాణహాని కూడా కలుగవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటిస్తూనే వైద్యులను సంప్రదించడం సరైన పని.

HEALTHY MOODS - HEALTHY FOOD HABITS



మూడ్‌ని బట్టే ఆరోగ్యం

భోజనం చేసేటప్పుడు మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం వంటబట్టాలన్నా, ఆరోగ్యానికి ఉపయోగపడాలన్నా భోజనం దగ్గర మన మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ముఖ్యమని, ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా మన మూడ్స్‌ను బట్టే ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆరోగ్యం పైన మనసు ప్రభావం చాలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మందులు వేసుకున్నా, భోజనం చేస్తున్నా, చివరికి స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ పనైనా చక్కగా పూర్తి చేయాలన్నా దాని మీద శరీర ప్రభావమే కాక, మనసు ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

భోజనం విషయానికి వస్తే, చాలా మంది భావోద్వేగంతోనే భోజనాన్ని పూర్తి చేస్తుంటారని డెలవేర్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గార్డ్‌నర్ తెలిపారు. ఆబగా, అనాలోచితంగా, ఆశగా తినడం, రుచి కోసం తినడం వంటివి సాధారణంగా మనకు కనిపించే భోజన రీతులు. వీటన్నిటితో పాటు, భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా, క్రోధంగా ఉన్నామా, మానసిక ఒత్తిడిలో ఉన్నామా లేక హడావిడిలో ఉన్నామా అన్నవి కూడా చాలా వరకూ ఆహార పదార్థాల మీద పనిచేస్తుంటాయని ఆయన ఆధ్వర్యంలో 'ఆరోగ్యానికి, భోజనం తినే విధానానికి ఉన్న సంబంధం'పై అధ్యయనం చేసిన నిపుణులుచెబుతున్నారు.

ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోకూడదు, ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి అన్న దాన్ని ఈ నిపుణులు పరిశీలించి, వాటిని వ్యాసాల రూపంలో వివిధ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంబంధమైన మేగజైన్లలో ప్రచురించారు. ఎంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పళ్లెంలో పెట్టుకున్నా మనసు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే ఆ భోజనం ఇచ్చే శక్తి చాలా తక్కువగానే ఉంటుందట. భావోద్వేగంతో భోజనం తిన్నా అది గుండె మీదా, రక్త ప్రసారం మీదా దుష్ప్రభావాన్ని కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనమే కాదు, అల్పాహారం తీసుకునేటప్పుడు, స్నాక్స్ తీసుకునేటప్పుడు, మద్య సేవనం చేస్తున్నప్పుడు పండ్లు తినేటప్పుడు, చివరికి మందులు తీసుకునేటప్పుడు కూడా మనసును ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు.

మూడ్స్ బాగా లేనప్పుడు అంటే, విషాదం, భావోద్వేగం, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, పగ, ప్రతీకారం వంటివి ఆలోచనలను ముప్పిరిగొని ఉన్నప్పుడు ముందుగా కొద్దిగా మంచినీళ్లు తాగి, కాళ్లు కడుక్కుని, కొద్దిగా మనసు శాంతించిన తరువాత భోజనం ముందు కూర్చోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మన సు అలజడితోనో, కల్లోలంగానో ఉన్నప్పుడు, అంటే ప్రశాంతంగా లేనప్పుడు తినే భోజనమంతా రక్తాన్ని దోషభూయిష్ఠం చేసే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రసారంలో తేడాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల, గుండె కొట్టుకోవడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. వీటి ప్రభావం దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి కీలక అవయవాల మీద కూడా పడుతుంది. కొద్ది కాలంలోనే చిత్ర విచిత్రమైన అనారోగ్యాలు శరీరాన్ని పీడించడం ప్రారంభిస్తాయి.

ఆవేశకావేషాలతో భోజనం చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే తలనొప్పి, రక్తపోటు, గుండె దడ వంటివి ప్రారంభమైపోతాయి. కోప తాపాలలో ఉన్నప్పుడు భోజన పదార్థాల ఎంపికలో కూడా తేడాలు వస్తాయని, శరీరానికి ఏది పడదో అటువంటి పదార్థాన్నే ఎంపిక చేసుకునే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే భోజనం చేయడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ఎంతో మంచిదని వారు సలహా ఇస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసినా, జోక్స్ వేసుకుంటూ తిన్నా, సంతోషంగా తిన్నా, చివరికి భవిష్యత్తు గురించి కలలు గంటూ ఆహారం తీసుకున్నా దాని ప్రభావం శరీరం మీద, ఆరోగ్యం మీదా సానుకూలంగా ఉంటుందని, శరీరానికి అదనపు శక్తి సమకూరుతుందని వారు సూచిస్తున్నారు.

విచిత్రమేమిటంటే, మూడ్స్ బాగా లేనివారే ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తీసుకుంటూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మనసు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నవారు చక్కటి ఆహార పదార్థాలు, పండ్లు, పచ్చి కూరలు, రసాలతో భోజనం చేస్తారట. మనసు బాగా లేనివారు ఆరోగ్యకరమైన పదార్థాల కంటే ఉత్తేజపరిచే లేక కిక్ ఇచ్చే పదార్థాల కోసం చూసుకుంటారు. రుచులకు ప్రాధాన్యం ఇస్తారు. మనసు హాయిగా ఉల్లాసంగా ఉన్నవారు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం మీదే దృష్టి పెడతారు. అందువల్ల మూడ్స్ మీదే ఆహార పదార్థాల ఎంపిక, సేవనం ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదాంశం. 

మూడ్స్‌ను ఉల్లాసంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యం పుష్టిగా మారుతుంది. దాని మీదే ఆయుర్దాయం కూడా ఆధారపడి ఉంటుంది. సారాంశం ఏమిటంటే, జీవితాన్ని ప్రతి క్షణం ఉల్లాసంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తే రోగ భయం లేని దీర్ఘాయువు మీ సొంతం అవుతుంది.

HOW TO TAKE CARE OF YOUR BEAUTIFUL SKIN WITH CHERRY FRUITS - CHERRY FRUIT FACIAL



చెర్రీస్ తో సహజ చర్మ సంరక్షణ


చెర్రీ రసం చర్మ సౌందర్య మరియు డార్క్ మచ్చల తొలగింపు కోసం ఉపయోగపడుతుందని భావిస్తారు. దానిలో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన మొటిమల రూపంలో ముక్కు,నుదురు,బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధిని నివారిస్తుంది. అదనంగా,చెర్రీస్ చర్మంనకు తేమ మరియు దెబ్బతిన్న చర్మంనకు ఉపశమనానికి సహాయపడుతుంది. 

ఈ రుచికరమైన పండ్లలో వివిధ రకాల చర్మ ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే విటమిన్ ఎ,విటమిన్ సి, పొటాషియం,జింక్,ఇనుము,రాగి,మాంగనీస్ మొదలైనవి సమృద్దిగా ఉన్నాయి.

అంతే కాకుండా,చెర్రీస్ తినడం వలన తలనొప్పి మరియు నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పండు సాధారణ వినియోగం వలన ఆరోగ్యకరమైన గుండె నిర్వహణ మరియు న్యూరాన్లు ఆక్సీకరణ నష్టం,మెమరీ నష్టంను నిరోధిస్తుంది.

ఇంటిలో తయారుచేసుకొనే చెర్రీ ఫేషియల్ మాస్క్

1. ప్రతి రోజూ మీ ముఖం మీద మెత్తని చెర్రీస్ (గుంటలను తొలగించి) రాస్తే మీ చర్మం మృదువుగా మరియు సున్నితముగా మారుతుంది. మీరు ఒక ఫోర్క్ సహాయంతో చెర్రీస్ మాష్ చేయవచ్చు.

మీరు మీ చర్మంపై ఈ పండుని రాయటానికి ముందు మీ ముఖంను కడగడం మరియు శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. మీరు ఒక జిడ్డుగల చర్మం కలిగి ఉంటే,అప్పుడు పుల్లని చెర్రీస్ వాడండి.

2. చెర్రీస్ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఒక సులభమైన చెర్రీ ఫేషియల్ మాస్క్ సిద్ధం చేసుకోండి.

మీ ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ ను రాసి,15-20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మొటిమల రూపంలో ముక్కు,నుదురు,బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధి నయం అవుతుంది.

3. చెర్రీస్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ తేనే కలిపి మీ ముఖానికి రాసి,20 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. అప్పుడు ముడుతలకు మరియు ఫైన్ లైన్లు క్షీనత కోసం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డార్క్ స్పాట్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

4. ఐదు చెర్రీస్ మరియు మూడు స్ట్రాబెర్రీలు తీసుకోని మెత్తగా చేసి,మీ ముఖం మరియు మెడ మీద రాసి 5 నిముషాలు ఉంచితే మీ చర్మం యవ్వనంగా కనిపించటానికి సహాయపడుతుంది. ఇంకా అదనపు ప్రయోజనం కొరకు రోజ్ వాటర్ ను కలపవచ్చు.

5. కొన్ని చెర్రీస్ తీసుకోని మెత్తగా చేసి,దానికి 2 లేదా 3 స్పూన్స్ సాదా పెరుగు కలిపి మీ చర్మంపై రాసి 20-30 నిమిషాలు తర్వాత తొలగించాలి.

డల్ గా వుండే చర్మంను ఉత్తేజపరుస్తుంది. అంతేకాక మీ చర్మం ప్రకాశవంతముగా ఉంటుంది. దీనికి అదనంగా ముతక చక్కెర జోడించి స్క్రబ్ గా ఉపయోగిస్తే ఎక్స్ ఫ్లోట్ తగ్గుతుంది.

6. మీరు రెండు టేబుల్ స్పూన్స్ చెర్రీ రసం,ఒక స్పూన్ వోట్మీల్ కలపడం ద్వారా మరో ఎక్స్ ఫ్లోట్ చెర్రీ ఫేస్ మాస్క్ ను సిద్ధం చేయవచ్చు.

మీ చర్మంపై పేస్ట్ రాసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలివేసి,ఆతర్వాత శుభ్రం చేస్తే చనిపోయిన చర్మ కణాలు తొలగించడానికి సహాయపడుతుంది.

7. ఒక పీచ్ పండు మరియు ఎనిమిది లేదా తొమ్మిది చెర్రీస్ లను తీసుకోని ఒక బ్లెండర్ లేదా ఆహార ప్రాసెసర్ ద్వారా గుజ్జుగా చేయాలి. ముడుతలను తగ్గించేందుకు 20 నిమిషాల పాటు మీ చర్మంపై ఈ పేస్ట్ ను రాయాలి.

ఈ మాస్క్ పొడి చర్మం వారికీ చాలా బాగుంటుంది. చర్మంనకు మరింత పోషణ కొరకు ఒక స్పూన్ అదనపు వర్జిన్ ఆలివ్ నూనెను జోడించవచ్చు.

8. ఒక గుడ్డు తెల్ల సొనలొ 2 స్పూన్స్ మొక్కజొన్న పిండి,ఒక స్పూన్ తేనే,10 చెర్రీస్ పండ్ల గుజ్జు కలిపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడకు రాయండి. చివరగా,20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది జిడ్డు చర్మం గల వారి కోసం బాగుంటుంది.

Monday 24 February 2014

BRIEF PROFILE OF LORD SHANMUKHA - LORD KUMARASWAMY - LORD KARTHIKEYA IN TELUGU



షణ్ముఖుడు-

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కాంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు.

నెమలి వాహనంతో కుమారస్వామి
ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి

షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు

శ్రీ వల్లీ దేవ సేన సమేతులైన కుమారస్వామి .
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు.

SIVARATHRI FESTIVAL ARTICLE - HOW TO PERFORM LORD SIVA'S PUJA AND WHICH FLOWERS NEEDS TO PERFORM LORD SIVA PUJA AND ITS RESULTS ? SIVARATHRI FESTIVAL SPECIAL ARTICLES IN TELUGU


శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?

నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే

పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.

పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్

పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.

పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.

పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.

ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!

ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.

శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.

అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.

కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే

పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

SIVARATHRI FESTIVAL SPECIAL ARTICLE - WHO ARE EKADASA RUDRULU AND WHO ARE DWADASADHITHYULU - LIST OF LORD SIVA NAMES



ఏకాదశరుద్రులు, ద్వాదశాధిత్యులు అంటే ఎవరు?

శివోమహేశ్వర: శంభు: శ్రీ కంఠోభవ ఈశ్వర:
మహాదేవ: పశుపతి: నీలకంఠో వృషధ్వజ:
పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా:.

అని శివతత్త్వ రత్నాకరం. దీనిని బట్టి 1. శివుడు, 2. మహేశ్వరుడు, 3. శంభుడు, 4. శ్రీకంఠుడు, 5. భవుడు, 6. ఈశ్వరుడు, 7. మహాదేవుడు, 8. పశుపతి, 9. నీలకంఠుడు, 10. వృషధ్వజుడు, 11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.

మరో పక్షాన్నిఅనుసరించి -

1. అజుడు, 2. ఏకాపాదుడు, 3. అహిర్భుధ్న్యుడు , 4. త్వష్ట, 5. రుద్రుడు, 6. హరుడు, 7. శంభుడు, 8. త్ర్యంబకుడు, 9. అపరాజితుడు, 10. ఈశానుడు, 11. త్రిభువనుడు ఏకాదశరుద్రులుగా పేర్కొనబడ్డారు.
ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.
ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా భేదాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రిందివారు ద్వాదశాదిత్యులవుతారు.

1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పుమ్షుడు, 10. సవిత, 11. త్వష్ట 12. విష్ణువు.
మరోక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు -

1. జయంతుడు, 2. భాస్కరుడు, 3. భానుడు, 4. హిరణ్యగర్భుడు, 5. ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడివున్నాయి.

Saturday 22 February 2014

SALT - USES TO HUMANS - ADVANTAGES AND DISADVANTAGES OF USING SALT - BRIEF ARTICLE ON SALT


'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పువాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది మంచినీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగద్విదితమే. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. 

సాధారణంగా మన శరీరానికి ఉప్పు రోజుకు సుమారుగా 4 గ్రాములు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొలతలతో తీసుకోరు కనుక ఉప్పును చాలామంది అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉప్పును ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా వాడే వారికి అధిక రక్తపోటు వస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. అలాగే అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తపోటు వచ్చిన వారు పలు విధాల మందులను ఎక్కువగా వాడకుండా సాధ్యమైనంత తక్కువగా ఉప్పును వాడటం ద్వారా రక్తపోటు చాలామటుకు అదుపులో ఉంచుకోవచ్చునని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

రక్తపోటు తగ్గేందుకు వాడే మందులవల్ల కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడంతో పాటు గుండె జబ్బులు వంటి అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరించడమేకాదు, రక్తపోటును తగ్గించుకోవడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమనికూడా చెబుతున్నారు.

చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువగా తినడం, ఊరగాయలు ఎక్కువగా తినడం వల్ల వారిలో ఉదర సంబంధమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేసే కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్‌ను తినిపిస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఫాస్ట్‌ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

నేడు ఎంతోమంది జరిపిన పరిశోధనల్లో ఉప్పుకోసం ప్రత్యేకంగా ఉప్పును వాడనవసరం లేదని మనం రోజూవారీ తీసుకునే ఎక్కువగా వండని కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన ఉప్పు లభిస్తుందని పరిశోధనల్లో ద్వారా తేలింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఉప్పును అసలు తీసుకోకుండా ఉన్నట్లయితే నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఏర్పడతాయంటున్నారు. అందుకే ఉప్పును ఎంతవరకో అంతే తీసుకోవడం ఉత్తమం.

ఉప్పువల్ల కొన్ని లాభాలుకూడా ఉన్నాయి. ఉప్పును నీళ్ళల్లో కలిపి ఇంటిని శుభ్రంగా కడిగినట్లయితే ఈగలు కొన్ని గంటల వరకు నేలపై వాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీపం బుడ్డిలో పోసే కిరోసిన్‌లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం కాంతి ఎక్కువ కావడమేకాకుండా, కిరోసిన్‌ కూడా ఆదా అవుతుంది. ఈ విషయం తాతయ్య, నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది తెలిసే ఉంటుంది. నేటికి కూడా కిరోసిన్‌ దీపాలు వాడే చాలా ఇళ్ళల్లో ఇలా చేస్తుంటారు కూడా. వస్త్రాలమీద సిరా మరకలు ఉన్నట్లయితే ఉప్పుతో బాగా రుద్ది, వేడినీళ్ళతో కడిగినట్లయితే పోతాయి. 

నిల్వ ఉండే బియ్యంలో ఉప్పును చల్లినట్లయితే పురుగులు బియ్యానికి పట్టే అవకాశం లేదు. దానిలో ఉన్న పురుగులు కూడా పోతాయి. ఇలా ఉప్పు వల్ల చాలా లాభాలున్నాయి. అయితే శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక శరీరానికి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పునే వాడటం ద్వారా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

SECRET OF HEART BEAT


గుండె ఎలా కొట్టుకుంటుంది. 

భయం కలిగినప్పుడు దాని వేగం ఎందుకు పెరుగుతుంది? గుండె అనేది ఒక పంపులాంటిది. గుండె శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. దానివల్ల జీవించి వుండగలుగుతాము. ప్రతి ఒక్క కదలికకు సుమారు వంద క్యూబిక్‌ సెంటీమీటర్ల రక్తాన్ని బయటకు పంపుతుంది. ఒక్కరోజుకు సుమారు 10,000 లీటర్ల రక్తాన్ని రక్తనాళికల ద్వారా వంపుతుంది. మామూలు జీవిత కాలంలో సుమారు 250,000,000 లీటర్ల రక్తాన్ని వంపు చేస్తుంది. 8/10 సెకనుల కొకసారి గుండె కొట్టుకుంటుంది. ఒకరోజులో గుండె సుమారు ఒక లక్షసార్లు కొట్టుకోవడం, అన్నేసార్లు నిలిచివుండటం జరుగుతుంది. దినంలో అది సుమారు ఆరు గంటలు పనిచేయకుండా వూరికే వుంటుంది. గుండె చప్పుడంటే గుండె సంకోచ వ్యాకోచాలకు గురి కావటం అని అర్థం. గుండె సంకోచించి నప్పుడు రక్తాన్ని బయటకు పంపుతుంది. వ్యాకోచించినప్పుడు కొత్త రక్తం లోనికొస్తుంది. ఈ కొట్టుకోవడం దీనికెలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగానే వుండిపోయింది. కోడిగుడ్డును తీసుకుని దాన్ని ఇరవై ఆరుగంటలు ఇంకుటేట్‌ చేసి, తెరిచి, పరీక్షిస్తే, వాటిలో కోడిపిల్ల గుండెకు సంబంధించిన కణాలుకొట్టుకోవడం గమనించవచ్చు. గుండెగా తయారుకాకమునుపే ఈ కొట్టుకునే గుణం దానికి వచ్చింది. గుండెకు సంకోచమనే అభిలక్షణం అనుకోకుండానే వచ్చిందంటారు. శరీర జీవన విధానంలో ఇదో ప్రత్యేక రహస్యం. అది ఇంకా ఎవ్వరికీ అంతుబట్టలేదు.
మామూలుగా గుండె పెద్దవారిలో 70-72సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. ఆడవారిలో 78-82, పిల్లలలో 90సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. గుండె పేస్‌మేకర్‌ వల్ల గుండె ఈ విధంగా కొట్టు కుంటుంది. భయపడినపుడు, ఆపద వచ్చినపుడు 140సార్లు నిమిషంలో కొట్టుకుంటుంది. ఈ సందర్భంలో శరీరంలోని ఎడ్రినల్‌ గ్లాండు ఎడ్రినలైన్‌ అనే హార్మోనును రక్తంలోనికి పంపుతుంది. దీని వల్ల గుండె కొట్టుకోవడం ఎక్కువౌతుంది. రక్తపీడనం కూడా పెరుగుతుంది. సహజసిద్ధంగా వీటిని తట్టుకునేగుణం గుండెకు వుంది. దానివల్ల మనిషికి అపాయం జరుగకుండా వుంది. 

SIMPLE FACE CARE BEAUTY TIPS WITH NATURAL HONEY, OLIVE OIL ETC


ఇంట్లోనే ముడతలను తొలగించేందుకు అనువైన చిట్కాలు

ఒక చెంచా తేనెలో ఒక చెంచా బేసన్‌ పౌడర్‌, కాసింత పసుపు, 
5-6 చుక్కల ఆలివ్‌ నూనెను కలుపుకోండి. 
ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ మిశ్రమాన్ని పూసుకోండి. 
20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి.
రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా బాదం పౌడర్‌, 
ఒక చెంచా ద్రాక్ష రసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసుకోండి. 
ఈ మిశ్రమాన్ని ముఖానికి ఆప్లై చేయండి. 
ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. 
ఆ తర్వాత ముఖాన్ని సుతిమెత్తగా చేతితో తపతపలాడించండి. 
దీంతో ముఖంపై ఏర్పడ్డ ముడతలు కొద్ది రోజుల్లోనే 
మటుమాయమౌతా యంటున్నారు సౌందర్య నిపుణులు.

CHUKKA KURA - KANDI PULUSU - ANDHRA RECIPE


చుక్కకూర గుప్పెడు కట్ట1 పోపుసామాన్లు;
కందిపప్పు చిన్నగ్లాసు ఎండుమిర్చి2
ఉల్లిపాయ 1 ఆవాలు 1/2స్పూన్‌
పచ్చిమిర్చి 6 మినప్పప్పు 1 స్పూన్‌
చింతపండు నిమ్మకాయంత కర్వేపాకు 1 స్పూన్‌
కారం తగినంత జీలకర్ర 1/4 స్పూన్‌ ఉప్పు తగినంత
నూనె 2 స్పూన్లు

చేయు విధానము: 
చుక్కకూర కడిగి సన్నగా తరగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు తరగాలి. 
కందిపప్పు సగం ఉడికిన తర్వాత చుక్క కూర,
ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి
ఉడికించి ఉప్పు, కారం వేసి మెదిపి రెండు నిముషముల తర్వాత చింతపండు రసం తీసి వేసి
ఉడికించి దించి, బాణలిలో నూనె మరిగాక పైన చెప్పిన పోపు, ఎండు మిర్చి 
ముక్కలు వేయించి వుడికించిన పోపు పప్పులో కలపాలి. తరిగిన కొత్తిమీర వేయాలి.

PREGNANCY - NO SLEEP - DEPRESSION PROBLEMS - REMEDIAL MEASURES


గర్బిణీ సమయంలో గురక రావడం సాధారణ విషయం. అలాగని అన్ని వేళల గురక గర్భిణీల లక్షణంగా భావించ కూడదు. ఎందుకంటే గురకకి కడుపులో పెరుగుతున్న బిడ్డకి సంబంధం వున్నట్టుగా తాజా పరిశోధనల్లో గుర్తించారు. అందువల్ల గురక సమస్యగా మారినపుడు గైనకాలజిస్ట్‌తో సంప్రదించడం అవసరం. నిద్రకు గురక సంబంధించిన విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు అతిగా బరువు పెరిగినా, లేదా రక్తహీనత వున్నా, శ్వాసనాళానికి సంబంధించిన సమస్యలు తలెత్తడం వల్ల గురక వస్తుంది. ఈ గురక వల్ల నిద్రకు భంగం కలుగు తుంది. ఇంకా ఇతరత్రా కారణాలవల్ల కూడా గర్భిణీలకు నిద్రపట్టని స్థితి వుంటుంది. అందువల్ల గర్భిణీ మహిళలకు నిద్రపట్టడం సమస్యగా మారినపుడు వైద్యులను సంప్రదించడం అవసరం.

గర్భిణీ సమయంలో డిప్రెషన్‌ :

గర్భిణీ స్త్రీలకు నిద్రపట్టకుండా చేసేవాటిలో డిప్రెషన్‌ కూడా ఒక ప్రధాన కారణం. సాధారణంగా గర్భంతో వున్న మహిళల్లో వచ్చే రసాయనిక మార్పులు కారణంగా 13శాతం మంది డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం వున్నట్లు నిపుణులు నిర్దారించారు. గర్భిణీలలో ఐరన్‌ లోపం ఏర్పడటం సహజం. అయితే ఐరన్‌కు, మెదడుకు చాలా అవినాభావ సంబంధం వుంది. ఐరన్‌ లోపం మెదడులో తయారయ్యే అత్యంత కీలకమైన డొఫమైన్‌ అనే రసాయనికంపై ప్రభావం చూపిస్తుంది. దాంతో మూడ్‌ డిసార్డర్‌ ఏర్పడి, డిప్రెషన్‌కు గురవుతారు. గర్భిణీలు డిప్రెషన్‌కు గురికావడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవించడం లేదా పుట్టే పిల్లలు వుండవలసిన బరువు కంటే తక్కువగా వుండటం జరుగుతుంది. గర్భిణీ సమయంలో డిప్రెషన్‌ నివారించకపోతే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై కూడా పడుతుంది.

సాధారణంగా డిప్రెషన్‌ నివారణకు వినియోగించే అన్ని రకాల మందులు గర్భిణీలకు వినియోగించకూడదు. ఈ మందులు గర్భిణీలకే కాకుండా పుట్టబోయే పిల్లలపై కూడా దుష్ప్రభావం చూపిస్తాయి. హాయిగా నిద్ర పట్టడానికి వారికి అను కూలంగా వుండే దిండ్లు, పరుపు ఉపయోగించాలి. పడుకొనేపక్క సౌకర్యంగా వుండేపక్షంలో నిద్ర పట్టక పోవ డానికి సంబంధించిన అనేక సమ స్యలు తొలగి పోతాయి. వీటన్నింటితో పాటు ప్రధానంగా నిద్రపట్టక పోవడానికి డిప్రెషన్‌ కారణ మని నిర్ధారణకు రావడానికి మందు యాంగ్జయిటీ డిసార్డర్‌ కారణం కాదని నిర్ధారించు కోవాలి. ఎటు వంటి చికిత్స చేయాలన్న గర్భిణీ ఆమోదం తోనే నిర్వహించాల్సి వుంటుంది. అంతే కాకుండా మందులు వాడాల్సి వస్తే వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

ప్రసవం తరువాత తలెత్తే నిద్రలేమి :

గర్భిణీ స్త్రీలలో ప్రసవం తర్వాత నిద్రపరమైన ఇబ్బందులు పసిపిల్లల సంరక్షణలో భాగంగానే తలెత్తుతాయి. కాని ప్రసవం తర్వాత స్త్రీలలో ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (తీవఎ) దశలో పట్టే నిద్ర తగ్గిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు గురయ్యే మహిళల్లో కూడా ఇదే తరహా సమస్య ఎదురౌతుంది. మొత్తం రాత్రి సమయంలో నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ప్రసవం తర్వాత తల్లిగా మారిన మహిళలో మత్తును కలిగించే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ మార్పులో ప్రొగెస్టోరోన్‌ కీలక పాత్ర వహిస్తుంది. పుట్టిన పిల్ల 12-16 వారాల తర్వాత నుంచి నిద్ర పోవడం ప్రారంభిస్తారు. వారు నిద్రపోవడం ప్రారంభమైన తర్వాత మాత్రమే స్త్రీలలో మత్తును కలిగించే హార్మోన్‌ పూర్తిస్థాయిలో తయారు కావడం ప్రారంభమై వారు సంపూర్ణంగా నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బహుసా తల్లిబిడ్డ మధ్య వుండే సృష్టి రహస్యం ఇదే కాబోలు. డిప్రెషన్‌ నివారించడం వల్ల కూడా నిద్ర సమస్యను నివారించవచ్చుననే భావన కూడా వుంది. నిజానికి ప్రసవం తరువాత మొదటి నెలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం వుంటుంది. ఈ డిప్రెషన్‌ మూడు నెలల వరకు వుండవచ్చు. సహజంగా తన పాప హాయిగా నిద్రపోతుందని భావించినపుడు మాత్రమే తల్లి నిద్రపోతుంది. అందువల్ల తల్లి మూడ్‌ డిసార్డర్‌ వల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం వుంటుంది. బాలింతలు నిద్రపట్టకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటువంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.

పాలివ్వడం వల్ల:

బిడ్డకు తన స్తన్యం ద్వారా పాలివ్వడంవల్ల కూడా బిడ్డ తల్లులకు నిద్ర ఇబ్బంది ఏర్పడుతుంది. నిజానికి బిడ్డకు పాలివ్వడం వల్ల తలెత్తే సమస్యపై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు. బిడ్డపక్కనే పడుకొని వుండటం వల్ల తన అజాగ్రత్త కారణంగా తన కాలు.. చేయి బిడ్డపై పడి, ఊపిరాడక బిడ్డ చనిపోతుందేమోనన్న భయం కొంతమంది తల్లులకు ఉంటుంది. ఈ భయం వల్ల కూడా తల్లులు సరిగా నిద్రపోలేరు. ఈ భయంతో అతిజాగ్రత్త తీసుకోవడం, అతి జాగ్రత్త వల్ల భయంతో తప్పులు చేయడం, ఆ తప్పులకు బాధపడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల పసిపిల్లలను తల్లిపక్కనే పడుకోబెట్టడం కంటే తల్లి పడక పక్కనే ఊయలలో బిడ్డను పడుకోబెట్టడం ద్వారా ఈ భయం కొంత మేరకు నివారించవచ్చు.

తల్లి బిడ్డకు పాలివ్వడం ప్రారంభించిన తర్వాత తల్లిబిడ్డ మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.ఈ అనుబంధంవల్ల కొంతమందిలో బిడ్డకు హాని కలుగు తుందనే భయం తొలగిపోయే అవకాశం వుంటుంది. అయితే ఈ భయం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం బిడ్డకు పాలిచ్చిన తర్వాత పక్కనే వుండే ఊయలలో పడుకోబెట్టటం ఉత్తమంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


HEALTH BENEFITS WITH NATURAL GINGER


అల్లం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. 
ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇదొకటి. 
దీంతో అద్బుతమైన వైద్యం 
చేయవచ్చని  వైద్యులు చెపుతారు. 
భారతీయ వైద్యులు నిరూపించారు కూడా. 
ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం అన వాయితీ, 
పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను 
అల్లం రసం కానీ, చిటికెడు శొంఠి పొడి కానీ ఇస్తే 
తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
అలాగే, పెద్ద వాళ్లు మోతాదు కు సరిపడా తీసుకోవచ్చు. 

Friday 14 February 2014

World Famous Bird Sanctuary at Karnataka – Ranganathittu - A Bird Lover’s Paradise



అంటార్కిటికా, ఉత్తర అమెరికా, చెైనా, సైబీరియా, నెైజీరి యాల్లాంటి సుదూర ప్రాంతాల నుంచి మే-అక్టోబర్‌ మాసాల మధ్య అతిథులుగా విచ్చేసే విగంహాలకు కొలువెైన ప్రాంతమే రంగనతిట్టు పక్షి విహార కేంద్రం. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని కావేరీ నదీ మధ్యభా గంలో, 57 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం శ్రీరంగపట్నానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.అదే మైసూర్‌కు 19 కిలోమీటర్లు, బెం గళూరుకు 128 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది రంగనతిట్టు. శ్రీరంగ పట్నం నుంచి బస్సులో వెళ్తే రంగన తిట్టు క్రాస్‌ రోడ్డు దగ్గర దిగి అక్కడినుం చి అర కిలోమీటర్‌ దూరం నడవాల్సి ఉంటుంది. మన దేశంలో నెలకొన్న అతి పెద్ద పక్షిధామాలలో రంగనతిట్టు ఒకటి కావడం విశేషం గా చెప్పుకోవచ్చు.

ఇక్కడ రకరకాల అందమైన పక్షులు చేసే అల్లరి ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. కొంగల బారులతో, పేర్లు తెలియ ని పక్షుల సందడితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని ఎవరికైనా అనిపించక మానదు. ముఖ్యంగా ఇక్కడికి నూతన దంపతులు ఎక్కువగా వస్తుంటారు.పాయలు, పాయలుగా చీలి ప్రవహించే కావేరీనది... ఏపుగా పెరిగిన పచ్చని పంట పొలాలు, కొండ చిలువలు మత్తుగా నిద్రిస్తున్నట్లుండే పొడవెైన రాతి బండలతో లంక పల్లెసీమలు ఆంధ్రలోని కోస్తాను తలపించక మానవు. ప్రతి సంవత్సరం మే నుంచి జూలెై వరకు వలస పక్షులు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి.

వీటిలో క్రాస్‌బర్‌, హెరాన్‌, నెైట్‌ హెరాన్‌, రాబిన్‌, స్పూల్బిల్‌, పెయింటెడ్‌ స్ట్రోక్‌, స్మాల్‌ ఇగ్రెల్‌, జంగిల్‌ బాబ్లర్‌, క్రాస్‌బల్‌, ఫ్లెమింగో.. మొదలెైన మరెన్నో పేరు తెలియని దాదాపు 80 రకాల పక్షులను రంగనతిట్టులో చూడవచ్చు. పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడుతుండే ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు ప్రతియేటా వేలాది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు.రంగనతిట్టు పక్షిధామం ప్రవేశ ద్వారం వద్ద పెద్ద వెదురు చెట్ల సమూహం ఉంటుంది. అక్కడ వెదురుతో కట్టిన అందమైన క్యాంటిన్‌ కూడా పర్యాటకుల ను విశేషంగా ఆకట్టుకుంటోంది. లంక ల్లో అక్కడక్కడా పాతిన సైన్‌బోర్డులలో రకరకాల పక్షుల వివరాలను పొందుపరచి ఉంటారు. సూర్యోదయం సమ యంలో ఈ ప్రదేశం స్వర్గధామంలా ఉంటుందంటే అతిశ యోక్తి కాదు.

ఈ పక్షిధామంలో విదేశీ పక్షులతో పాటు మన దేశానికి చెం దిన బుల్‌బుల్‌ పిట్టలు, నెమళ్లు కూడా పర్యాటకులకు కను విందు చేస్తుంటాయి. ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్‌ అనే పక్షులు చెట్ల నిండా కనిపిస్తుంటాయి. ఈ పక్షులు పునరుత్పత్తి కాలంలో తెల్లగా ఉండి మిగిలిన సమయాలలో గౌర వర్ణంతో కూడిన తెలుపుతో ఉంటాయి. వీటి ముక్కు మధ్య భాగంలో ఖాళీ ఉండటంవల్ల వాటికి ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్‌ అనే పేరు వచ్చిందట.ఇకపోతే అన్ని పక్షుల్లోకెల్లా అందమైనవి పెద్దసైజు ఇగ్రెట్‌లట. ఇవి గుడ్లు పెట్టే కాలంలో ఈకలు లేకుండా, నేత్రాల వద్ద పచ్చని చారలతో కనిపిస్తాయి.



POTATO / ALU WITH GREEN LEAVES / CHUKKA KURA CURRY IN TELUGU RECIPES


బంగాళ దుంపలు : 250 గ్రా
చుక్కకూర : 4 ట్టలు పెద్దవి 
పచ్చి మిర్చి : 8 కాయలు
కారం : 1/2 చెంచా
ఉల్లిపాయ ముక్కలు :1 కప్పు 
ధనియాల పొడి : 1 చెంచా
ఎండుమిర్చి : రెండు
ఉప్పు పసుపు నూనె : కావాల్సినంత
కరివేపాకు : రెండు రెబ్బలు

దుంపలు శుభ్రంగా కడిగి చెక్కుతీసి సన్నగా తరగాలి. 
చుక్కకూర కూడా కడిగి సన్నగా తరిగి ఉంచాలి. బాండీలో కొంచెం నూనెలో 
బంగాళదుంపలను ముప్పావు వంతు వేపి తీయాలి. 
బాండీలో మిగిలిన నూనె కాగిన తర్వాత పోపుసామాను
 వేసి వేగిన తర్వాత మిర్చి ఉల్లిముక్కలు వేసి వేపి 
ఆలూ ముక్కలు కూడా వేసి ఉడకనివ్వాలి. 
ఉడికిన తర్వాత చుక్కకూర కూడా వేసి ఉప్పు, పసుపు, 
కారం, ధనియాల పొడి వేసి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి.
 ఉడికిన తర్వాత బాగా కలిపి దింపి 
చపాతీలోకిగాని అన్నంలోకి గాని సర్వ్‌ చెయ్యాలి.

WORLD FAMOUS JAIN MAHARAJ TEMPLE AT KOLANUPAKA VILLAGE, NALGONDA DISTRICT, ANDHRA PRADESH, INDIA


జైన దేవాలయం... కొలనుపాక

దాదాపు 9వ శతాబ్ధంలో రాష్టక్రూటుల పాలనలో కొలనుపాక ప్రాముఖ్యం పెరిగింది. అప్పట్లో ప్రముఖ జైన క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్టక్రూటులు ఆరోజుల్లో సైన్యాగారంగా మార్చడంతోపాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అటుపై ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు సైతం ఈ ప్రాంతంపై శ్రద్ధ కనబర్చడంతో ఇక్కడ అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంది. వీరి కాలంలోనే ఇక్కడ అన్ని రకాల కట్టడాలు నిర్మించబడ్డాయి.అయితే ఆ తర్వాత చోళులు, పల్లవులు జైనులపై దాడులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంతో పాటు ఇక్కడి ఆలయం సైతం దాదాపుగా ధ్వంసమైంది. అటుపై ఈ ప్రాతం కాలగర్భంలో కలిసిపోయింది.


దాదాపు వందేళ్ల క్రితం కొలునుపాక ఆలయం వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఈ ప్రాంత విశిష్టత సైతం అందరికీ తెలిసివచ్చింది. అయితే ఈ ప్రాంతం మాత్రం గత 25 ఏళ్ల వరకు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఈ క్రమంలో దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి మాత్రమే ఈ ప్రాతం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. రాజస్థాన్‌, గుజరాత్‌లాంటి రాష్ట్రాలకు చెందిన జైనులు ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించడంతో ఈ ప్రాతంలో నిర్మాణాలు ఊపందుకున్నాయి.దీంతో కొలనుపాకలోని ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో దాదాపు వెయ్యిమంది కళాకారులు పనిచేయడంతో పాటు మరెందరో కార్మికులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఓ అద్భుత చిత్రకళతో కూడిన జైన దేవాలయం కొలనుపాకలో రూపం సంతరించుకుంది.


కొలనుపాకలోని జైన దేవాలయం అద్భుత శిల్పకళకు పెట్టింది పేరు. కోట ద్వారాన్ని తలదన్నేలా నిర్మించిన ఆలయ ప్రవేశ ద్వారం ప్రారంభంలోనే పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ మార్గంలో నిర్మించిన రెండు ఏనుగు శిల్పాలు మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఠీవీగా నిల్చుని ఉంటాయి .ఇక లోపల ఉన్న భారీ గోపురంపై అద్భుతమైన శిల్పకళ చూపరులను కట్టిపడేస్తుంది. అలాగే ఆలయ ఆవరణలోని ఏ స్థంభాన్ని చూసినా అందులోని సూక్ష్మ చిత్రకళ మైమరపింపజేస్తుంది.
అలాగే ఆలయంలో కొలువైన తీర్థం కరుల ప్రతిమలు పర్యాటకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి. 

దీంతోపాటు ఆలయ ఆవరణ మొత్తం పచ్చని చెట్లతో నిండి ఉండడం ఆవరణ మొత్తం పాలరాయితో నిర్మించడం ఇక్కడి ఆలయానికి అదనపు అందాన్ని తెచ్చాయి.ఇక ఈ ప్రదేశానికి ఉన్న చారిత్రక విశేషం గురించి చెప్పాలంటే వీరశైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యులవారు లింగంలోంచి ఉద్భవించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఉండే సోమేశ్వరాలయం అనే శివాలయంలో రేణుకాచార్యల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. అయితే ఈ దేవాలయం మాత్రం శిధిలావస్థలో ఉంది.

నల్గొండ జిల్లాలోని ఆలేరు మండలంలో ఉన్న కొలనుపాకను కులపాక అనికూడా పిలుస్తారు. హైదరాబాద్‌నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ కొలనుపాక ఉంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ పట్టణానికి వెళ్లే మార్గంలో కొలనుపాక వస్తుం ది. ఆలేరు రైల్వే స్టేషన్‌ నుంచి కొలనుపాక కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

దేశంలో జైన దేవాలయాలకు ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నా మన రాష్ట్రంలోనూ ఓ ప్రముఖమైన జైన దేవాలయం ఉంది. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రముఖ జైన దేవాలయంగా గత కొన్నేళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదేశం కొత్త రూపం సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతోపాటు నేడు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతోంది. దాదాపు వందేళ్ల క్రితం కనుగొనబడిన కొలునుపాక జైన దేవాలయం ప్రస్తుతం కొత్తరూపు సంతరించుకుంది.

RAVVA HALWA - SWEET AND DELICIOUS RECIPE


బొంబాయి రవ్వతో హల్వా


ఇవి కావాలి

బొంబాయి రవ్వ : 3/4 కిలో
పంచదార : 3/4 కిలో
నెయ్యి : 1 కప్పు
యాలకులు : 12
తరిగిన కొబ్బరి : కావాల్సినంత
కిష్‌ మిష్‌ : కావాల్సినంత
బాదంముక్కలు : కావాల్సినంత
పిస్తా ముక్కలు : కావాల్సినంత
మంచినీరు : 1 గ్లాసు
ఇలా చేయాలి ముందుగా బొంబాయి రవ్వాను పెనంపై అది బంగారు వర్ణంలో వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. 
ఇంకో ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో యాలకులను వేసి కలపాలి. పంచదారను,
 నీటిని వేసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి.
 పంచదార సిరప్‌ సిద్ధం అయ్యాక అందులో వేయించిన బొంబాయి రవ్వను, బాదం, 
పిస్తా ముక్కలను వేసి బాగా కలిసే వరకు కలపండి.
 కొంత సమయం తరువాత మంటను తీసేసి 
మీకు నచ్చిన విధంగా హల్వాను కట్‌ చేసుకొండి. 
డిజైన్‌ చేసుకొండి.

HOW TO TAKE CARE CHILD/KIDS DENTAL CARE - TIPS IN TELUGU FOR BABIES CHILD CARE


బిడ్డకు దంతాలు రావటానికి ముందుగానే నోటిలోని బాక్టీరియా చిగుళ్లను పాడు చేస్తుంది. మరి బేబీ నోటి చిగుళ్ల పట్ల సంరక్షణ ఎలా వహించాలి ? నీటిని ఉపయోగించి - బేబీ చిగుళ్లను రెగ్యులర్‌గా నీటితో కడగండి. తడి గుడ్డతో చిగుళ్లను మెత్తగా తుడవండి. ఈ అలవాటు మీ బిడ్డకు దంతాలు రాకముందే చేయండి. ప్రతి ఆహరం తర్వాత, నిద్రకు ముందు ఈ చర్య చేపట్టండి. తడిగుడ్డకు బదులుగా మీ చేతిని శుభ్రం చేసుకొని బేబీ నోటికి పట్టించి కూడా శుభ్రం చేయవచ్చు. ఈ చర్య మీ బేబీ నోటిని క్రిములు లేకుండా చేస్తుంది. టూత్‌ బ్రష్‌ - బిడ్డకు దంతాలు రావటం మొదలు పెట్టగానే, చిన్నది మెత్తటిది అయిన టూత్‌ బ్రష్‌ ఉపయోగించి దానితో శుభ్రం చేయండి. ఈ దశలో టూత్‌ పేస్ట్‌ అవసరం ఉండదు. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయండి. మెల్లగా చిగుళ్లు మసాజ్‌ చేయండి. బిడ్డకు ఏ హాని జరుగకుండా చూడండి. బ్రష్‌ కొనలు అరిగితే, బ్రష్‌ మార్చండి. బ్రష్‌ చేసిన తర్వాత నోటిని బాగా కడగండి.

ఫ్లోరైడ్‌ టూత్‌ పేస్ట్‌ - దంతాలు బయటకు రాగానే ఏదేని ఒక నాణ్యతగల టూత్‌ పేస్ట్‌ వాడకం మొదలుపెట్టండి. అది దంత క్షయాన్ని నిలిపి దంతాల ఎనామిల్‌ బలపరుస్తుంది. బాక్టీరియా నోటిలో చేరకుండా చేస్తుంది. అధికంగా పేస్ట్‌ వాడి హాని కలిగించకండి. మీ బిడ్డకు అవసరమైన ఫ్లోరైడ్‌ కొరకు వైద్యుని సంప్రదించండి. ఆహారం - బేబీ చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, బిడ్డకు ఇచ్చే ఆహారాలు ఆరోగ్యంగా ఉండాలి. స్వీట్లు, జ్యూస్‌లు, పాలు వంటివాటితో జాగ్రత్త పాటించండి. చిగుళ్లు, నోటి ఆరోగ్యం ఈ దశలో కాపాడితే, మీ బిడ్డకు జీవితాంతం మంచి నోటి ఆరోగ్యం, దంతాలు కొనసాగుతాయని గ్రహించండి. దంతాలు మనిషికి ఆరోగ్యకరంగా నిర్వహిస్తే జీవితాంతం బలంగా పటిష్టంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం బాగా ఉండాలంటే, పెద్దలైనా చిన్న పిల్లలైనా ప్రతి ఆహారం తర్వాత నోటిని శుభ్రంగా నీటితో కడిగి నోటిలో బాక్టీరియా చేరకుండా ఎప్పటికపుడు రక్షించుకోవాలి.

Saturday 8 February 2014

MAINTAIN SKIN BEAUTY IN SUMMER SEASON - SUMMER SEASON BEAUTY CARE TIPS FOR SHINY SKIN IN NATURAL WAY EATING BADAMS ETC



మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించాల్సిన చర్మం.. వేసవిలో నిర్జీవంగా మారిపోతుంది. అలాంటి చర్మానికి ఎప్పటి కప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చర్మం సహజంగా మెరిసేలా:
. ఐదారు బాదం గింజల్ని తీసుకుని పాలల్లో కనీసం నాలుగు గంట నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మెత్తగా గ్రైండ్‌చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక కడిగెయ్యాలి.
.కాచిన పాలమీగడ, తేనె కలిపిన మిశ్రమాన్ని రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేసి ఆ తరువాత కడిగితే, చర్మం చాలా తాజాగా తయారవు తుంది.
.ముఖం మృదు త్వాన్ని సంత రించు కోవాలంటే, బాదం పొడిలోనాలుగు చుక్కల వీట్‌ జెర్మ్‌ నూనె, అరచెంచా గులాబీ రేకుల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషా లయ్యాక కడిగేస్తే సరిపోతుంది. చర్మం తాజాదనాన్ని పొందు తుంది. వేసవి కాలంలో ప్రతిరోజు మంచి క్రీం రాసుకుని పాలమీగడతో మర్దన చేసుకోవటం చాలా మంచిది.
పొడిచర్మం వీడి ప్రకాశ వంతంగా:.చెంచా కలబంద గుజ్జులో గులాబీ నూనె, వీట్‌జెర్మ్‌ నూనె రెండు చుక్కలు, చొప్పునవేసి, చెంచా బాదం పొడి కలిపి పూతలా వేసుకోవాలి.
. చెంచా పాలపొడినిలో మోతాదులో తేనె, విటమిన్‌ ఇ క్యాప్యూల్‌ ఒకటి, అరచెంచా గులాబీ రేకల ముద్ద కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల య్యాక కడిగేస్తే పొడిచర్మం పోయి ప్రకాశవంతంగా మారుతుంది.