అదొక దోమ,దానికి ఎంత గర్వమో చెప్పటానికి వీలులేదు. అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఒక రోజు అది అడవికి వెళ్ళింది. ఆ అడవిలో ఒక గుర్రం మేతమేస్తూ నిలబడి వుంది. దానికి ఎదురుగా వెళ్ళింది దోమ.
''ఏరు ! ఏం చేస్తున్నా విక్కడ'' అంది దోమ. దోమ మర్యాద లేకుండా మాట్లాడటం చూసి గుర్రం కోపంగా చూసి ఊరుకుంది.
''ఏం- మాట్లాడవేం'' రెచ్చగొడుతూ అడిగింది దోమ.
అయినా గుర్రం'' మాటాడలేదు. నేను తలచుకుంటే నా మిత్రులతో వచ్చి నిన్ను పడెయ్యగలను'' అంది దోమ.
నువ్వు చేసినపుడు చూస్తాలే'' అంది గుర్రం తాపీగా,
గుర్రానికి తనంటే లక్ష్యం లేక పోవడం చూసి దోమకు కోపం వచ్చింది. వెంటనే తన మిత్రులయిన దోమల్ని తీసుకువచ్చింది. ''గుర్రాన్ని కుట్టండి'' అంది. దోమలు గుర్రం మీద ఒక పక్కన వాలాయి. పొగరుబోతు దోమ చూస్తూ అవతల ఉంది. వాటిని తోకతో పారద్రోలాలను కుంది. గుర్రం వీలుపడలేదు. బాధ ఎక్కువైంది.
ఇంక చేసేదిలేక గుర్రం దబ్బున బురదగుంటలో పడింది. దాని వీపు మీదున్న దోమలన్నీ నలిగి చచ్చిపోయాయి.
''చూశావా, నిన్ను పడేశాను'' అంది గర్వంగా.
''నీ బొంద'' నేను పడినందువల్ల నాకు వచ్చిన నష్టం లేదు. కానీ ఏ కారణం లేకుండా నీ మిత్రులు ఇంతమందిని పోగొట్టుకున్నందుకు నువ్వే ఏడవాలి'' అంది గుర్రం, అప్పటికిగాని దోమకి తనెంత నష్టపోయిందీ అర్థం కాలేదు. గర్వంతో మిడిసిపడినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తెలుసుకుని తన హద్దుల్లో తాను ఉండసాగింది.
No comments:
Post a Comment